Presidential election in ap

presidential election in ap

presidential election in ap

33.gif

Posted: 07/01/2012 07:44 PM IST
Presidential election in ap

      రాష్ట్రపతి ఎన్నికల సంబంధిత ఎమ్మెల్యే ఎవరికి ఓటు వేశారో తెలుసుకోవడం ఆసాధ్యమని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ప్రవీణ్‌కుమార్ పేర్కొన్నారు. దేశ ప్రథమ పౌరుని ఎన్నికల్లో రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికైన సభ్యులు ఓటు హక్కు వినియోగించుకుంటారు. ఇందుకోసం రాష్ట్ర 1ఎన్నికల కమిషన్ సచివాలయంలో పోలింగ్‌కు అవసరమైన ఏర్పాట్లు చేపట్టింది. రాష్ట్రపతి ఎన్నికల్లో రాష్ట్ర శాసనసభ్యులందరూ సచివాలయంలోనే ఓటుహక్కు వినియోగించుకోవలసి వుంటుందని ప్రవీణ్ కుమార్ తెలిపారు. బ్యాలెట్ పేపర్లు, బ్యాలెట్ బాక్సులు ఈ నెల 4వ తేదీ అనంతరం ఢిల్లీ నుంచి చెన్నయ్‌కి దిగుమతి చేసుకుంటామని తెలిపారు.
       ఈనెల 19వతేదీ ఉదయం 10 గంటలకు పోలీంగ్ ప్రారంభమై సాయంత్రం 5 గంటల వరకు సాగుతుందని తెలిపారు. బ్యాలెట్ బాక్సులను ఆరోజే ఢిల్లీకి పంపుతామని, శాసనసభ్యులు తమ ఓటు ఎవరికి వేశారో కనిపెట్టడం సాధ్యంకాదన్నారు.అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్న రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటుహక్కు వినియోగించడంపై శాసన సభ్యులందరికి లేఖలు పంపుతామని పోలింగ్ సమయంలో భద్రతకు పోలీసులు పాల్గొంటారని ప్రవీణ్‌కుమార్ తెలిపారు.

....avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Another round of service tax
Srikakulam agri chem factory closed  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles