అన్నా బృందానికి, యుపిఎ ప్రభుత్వానికి మధ్య సాగుతున్న యుద్ధం ఏకంగా మహాభారతం వరకూ వెళ్లింది. అన్నా బృందం సీనియర్ నాయకురాలు కిరణ్ బేడీ ఏకంగా మన్మోహన్సింగ్ను ధ్రృతరాష్ట్రుడితో పోల్చారు. అంతేకాదు, అవినీతి పంకిలమైన ఆయన పాలనవల్ల నేరస్థులకు తగిన శిక్షపడే అవకాశం లేదని వ్యాఖ్యానించారు. దీనిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డ న్యాయశాఖ మంత్రి ఖుర్షీద్ ‘అన్నా బృందం ఇలా వ్యక్తిత్వ హననానికి దిగడం ఎంతమాత్రం సమంజసం కాదు’ అని స్పష్టం చేశారు. అలాంటివాటివల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు అని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ‘మన్మోహన్సింగ్ ప్రమేయం లేదని ప్రధానమంత్రి కార్యాలయం తేల్చింది.
అయితే ద్రౌపది వస్త్రాపహరణకు యత్నించిన కౌరవులకు ధృతరాష్ట్రుడు మద్దతు తెలపలేదు. అలాగని ఆ ఘటనతో ధృతరాష్ట్రుడికి సంబంధం లేదని అనగలరా?’ అని బేడీ ప్రశ్నించారు. సమర్థవంతమైన న్యాయవ్యవస్థను ప్రజలకు అందించగలిగేది కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీయేనని, ప్రతిపక్షం కాదనీ, అందుకే కేంద్రంపైనే అన్నా బృందం దృష్టి సారించిందని బేడీ స్పష్టం చేశారు. ప్రధానమంత్రి, 14మంది కేబినెట్ మంత్రులపై వచ్చిన అవినీతి ఆరోపణలను సిట్తో విచారణ జరిపించాలని, ఫాస్ట్ట్రాక్ కోర్టును ఏర్పాటుచేయాలని అన్నా హజారే డిమాండ్కు ప్రధానమంత్రి కార్యాలయం తిరస్కరించిన మరుసటి రోజే ప్రధాని లక్ష్యంగా కిరణ్ బేడీ ఆరోపణాస్త్రాలు సంధించారు. సిట్తో విచారణ జరిపించి తీరాలనే డిమాండ్పై జూలై 25 నుంచి ఆఖరి పోరాటాన్ని చేపట్టి అమీతుమీ తేల్చుకుంటామని స్పష్టం చేశారు. అవినీతి ఆరోపణలపై పిఎంఓ పంపిన లేఖ వాస్తవాలను కప్పిపుచ్చేదిగా ఉందన్నారు.
కిరణ్బేడీ ఆరోపణలను మంత్రి సల్మాన్ ఖుర్షీద్ తీవ్రంగా ఖండించారు. ‘అవినీతిపై ఉద్యమాన్ని వారు మంచి ఆలోచనతో ప్రారంభించారని మేం భావించాం. కానీ ఈ రోజు వ్యక్తిగత ఆరోపణలు, స్వలాభం కోసం దాన్ని వాడుకుంటున్నార’ని ఖుర్షీద్ ధ్వజమెత్తారు. ‘సమయం వచ్చినప్పుడు ఈ దేశం వారికి సరైన సమాధానం చెబుతుందని నమ్మకంతో ఉన్నాన’ని ఆయన స్పష్టం చేశారు.కాగా, హజారే బృందానికి తోడుగా బిజెపి కూడా యుపిఎ ప్రభుత్వంపై ధ్వజమెత్తింది. యుపిఎ ప్రభుత్వంపై వచ్చిన అవినీతి ఆరోపణలపై విచారణ జరపాలన్న అన్నా బృందం డిమాండ్కు బిజెపి వత్తాసు పలికింది. మన్మోహన్సింగ్ నిజాయితీపరుడైనప్పటికీ అవినీతి ఆరోపణలకు ఒక నాయకుడుగా ఆయన బాధ్యుడేనని స్పష్టం చేసింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more