భారత దేశం ఎప్పుడు కూడా ప్రవాస జీవితం గడుపుతున్న టిబెటన్ల పట్ల ఉదారంగానే వ్యవహరిస్తోందని ఆయన అంటూ భారత దేశాన్ని గురువుగా, టిబెటన్లను శిష్యులుగా అభివర్ణించారు. 1951నుంచి తాను టిబెట్లో చైనా కమ్యూనిస్టు పార్టీకి చురుకైన కార్యకర్తగా ఉండేవాడినని, మిగతా వారిలాగానే తాను కూడా కపటిగా ఉండడం కోసమే తన టాలెంట్నంతా ఉపయోగించానని దలైలామా చెప్పారు. అయితే తాను భారత దేశానికి వచ్చిన తర్వాతే ఆ కపటం తనలో అంతరించిపోయిందని ఆయన చెప్పారు. భారత దేశాన్ని తన రెండో పుట్టినిల్లుగా చేసుకున్న గత 53 ఏల్ల కాలంలో టిబెటన్ల ఆధ్యాత్మిక గురువు దలైలామా ఉత్తర భారతీయులు ఎంతో ఇష్టంగా తినే దాల్- రోటీ పట్ల మక్కువ పెంచుకున్నారు. 1959లో టిబెట్ను వదిలిపెట్టి పారిపోయి వచ్చినప్పటినుంచి ధర్మశాలలో గడిపిన రోజులను దలైలామా గుర్తు చేసుకుంటూ, భారత దేశానికి వచ్చిన తర్వాత తాను నేర్చుకున్న గొప్ప విషయం ఏమిటంటే కపటం లేకుండా ఎలా ఉండావచ్చనేదని అన్నారు. భారత దేశానికి వచ్చి ఇనే్నళ్ల పాటు ఇక్కడ గడిపాక తాను భారతీయ సంస్కృతి, మతంనుంచి ఎన్నో విషయాలు నేర్చుకున్నానని కూడా ఆయన అంటూ, ఉత్తర భారతీయులకు ఎంతో ఇష్టంగా తినే దాల్-రోటీ పట్ల ఇష్టాన్ని పెంచుకోవడం వాటిలో ఒకటని చెప్పారు. తనకు అవకాశమొచ్చినప్పుడల్లా ఈ గొప్ప భారతీయ వంటకాన్ని రుచిచూస్తూ ఉంటానని కూడా ఆయన పిటిఐతో మాట్లాడుతూ చెప్పారు.
టిబెట్నుంచి పారిపోయి వచ్చినప్పటినుంచి వేలాది మంది టిబెట్లతో కలిసి దలైలామా ధర్మశాలలో ప్రవాస జీవితం గడుపుతున్న విషయం తెలిసిందే. భారత దేశాన్ని విద్యలకు కేంద్రంగా, బీహార్లోని ప్రాచీన నలంద విశ్వ విద్యాలయాన్ని బౌద్ధమత భాండాగారంగాను ఆయన తరచూ అభివర్ణిస్తుంటారు. బుద్ధుడి ఆశీస్సులు, బౌద్ధమత బోధనల కారణంగానే బీహార్ ఇప్పుడు అనివృద్ధి పథంలో పయనిస్తోందని బుద్ధుడి పేరుతో ఏర్పాటు చేసిన ఒక పార్కును ప్రారంభించడం కోసం తాను ఇటీవల పాట్నా వెళ్లినప్పుడు బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ తనతో అన్నారని ఆయన చెప్పారు.అయితే వాస్తవానికి బీహార్ బౌద్ధ మతానికి జన్మస్థానమని, మొత్తం ప్రపంచానికి ఈ గొప్ప మతానికి అందించిన ప్రదేశమని తాను ఆయనతో అన్నానని దలైలామా చెప్పారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more