ఎంతో నైపుణ్యం కలిగిన ఇంజినీరింగ్ సిబ్బందిని ఖాళీగా కూర్చోబెట్టి మరీ జీతాలు చెల్లిస్తుండటం హెచ్ఎండీఏకే చెల్లింది. ఈ విభాగంపై ఏటా రూ.2కోట్ల మేరకు జీతభత్యాలకు వెచ్చిస్తున్నారు. ఆ మేరకు పని లేదు. గతంలో చేపట్టిన హుస్సేన్సాగర్ ప్రక్షాళన, పీవీ ఎక్స్ప్రెస్ వే ర్యాంపులు, కూకట్పల్లి ఆర్వోబీ నిర్మాణం పనులు మాత్రమే సాగుతున్నాయి. వీటి పర్యవేక్షణకు మూడోవంతు సిబ్బంది సరిపోతారు. ప్రస్తుతం నడుస్తున్న ప్రాజెక్టులు కూడా పూర్తయితే... ఇక పనే ఉండదన్న ఉద్దేశంతో కావాలనే వాటి నిర్మాణాన్ని స్లో డౌన్ చేసినట్లు వినవస్తోంది. ఫలితంగా హుస్సేన్సాగర్లో ఎప్పుడో పూర్తికావాల్సిన నాలాల పూడికతీత పనులు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే చందంగా ఉన్నాయి. మియాపూర్లో తలపెట్టిన భారీ బస్ టెర్మినల్కు అతీగతీ లేదు.
చేతుల్లో కొత్త ప్రాజెక్టు లేదు.. నడుస్తున్న ప్రాజెక్టులు పెండింగ్లో పడ్డాయి. ఖజానా ఖాళీ. ఆర్థిక వనరుల సముపార్జనకు అవకాశం ఉన్నా ఆ దిశగా ఒక్క అడుగు పడట్లేదు. కొత్త ప్రాజెక్టులను రూపకల్పన చేయాల్సిన ఇంజినీరింగ్ విభాగానికి అసలు పనే లేకుండాపోయింది. ఎస్ఈ స్థాయి అధికారులు సైతం గోళ్లు గిల్లుకుంటూ ఖాళీగా కూర్చుంటున్నారు. ఇదీ.. హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్ఎండీఏ) ప్రస్తుత దుస్థితి. నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దాల్సిన హెచ్ఎండీఏకి అసలు ఉనికే ప్రశ్నార్థకంగా మారింది. గడచిన నాలుగేళ్లుగా కొత్త ప్రాజెక్టుల రూపకల్పన,అమలు లేకపోవడంతో కీలకమైన ఇంజినీరింగ్ విభాగం నిర్వీర్యం అంచుకు చేరువైంది. ఔటర్ రింగ్రోడ్డు, పీవీ ఎలివేటెడ్ ఎక్స్ప్రెస్ వే, హుస్సేన్సాగర్ ప్రక్షాళన ప్రాజెక్టుల తర్వాత ఇంతవరకు మరే ఇతర ప్రాజెక్టులు చేపట్టలేదు. చీఫ్ ఇంజినీర్ పర్యవేక్షణలో సుమారు 55మంది సాంకేతిక సిబ్బందితో పనిచేస్తున్నట్లు రికార్డులు చూపిస్తున్నాయి. సీఈ 1, ఎస్ఈ1, ఈఈలు 7, డీఈలు 14, ఏఈలు 12 మొత్తం 35 మంది ఇంజినీరింగ్ విభాగంలో విధులు నిర్వర్తిస్తున్నారు. ఔటర్ రింగ్ రోడ్డు ప్రాజెక్టులో ఏడుగురు ఈఈలు, ఎస్ఈ 1, సీజీఎం 1, మరో 10 మంది ఏఈలతో కలిపి మొత్తం 55 మంది ఉన్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more