Ysr congress party leaders attack on bus

YSR Congress Party leaders.gif

Posted: 05/29/2012 03:47 PM IST
Ysr congress party leaders attack on bus

Kaveri-Travels-busవైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ అరెస్టుకు నిరసనగా  ఆదివారం అర్థరాత్రి రంగారెడ్డిజిల్లా ఇబ్రహీంపట్నం మండలంలో కొందరు దుండగులు బస్సుల విధ్వంసానికి పాల్పడ్డారు. ఓ ప్రైవేట్ బస్సుపై దాడి ఘటనలో డ్రైవర్ మృతి చెందాడు. హైదరాబాద్ నుంచి నెల్లూరు వెళుతున్న కావేరీ ట్రావెల్స్ బస్సు శేరిగూడకు చేరగానే కొందరు వ్యక్తులు రాళ్లతో దాడికి దిగారు. బస్సు అద్దాలు పగిలి డ్రైవర్ ఆంజనేయులు కళ్లలో గుచ్చుకున్నాయి. దీంతో అదుపుతప్పిన బస్సు మొదట ఓ చెట్టును, తర్వాత విద్యుత్ స్తంభాన్ని ఢీకొంది. ఈ బస్సును అదుపుచేసే ప్రయత్నంలో అదనపు డ్రైవర్ నాగగోపాల్‌రావు కూడా తీవ్రంగా గాయపడి బస్సులోనుంచి కిందపడి అక్కడికక్కడే మృతి చెందాడు.

ఆ సమయంలో బస్సులో 40మంది ప్రయాణికులు ఉన్నారు. నాగగోపాల్ బస్సును అదుపు చేయకపోతే ఘోర ప్రమాదం జరిగి ఉండేదని ప్రత్యక్ష సాక్షులు వెల్లడించారు. ఇదే ప్రాంతంలో మరో రెండు వాహనాలపైనా దాడులు జరగడంతో వైఎస్సార్‌సీపీ కార్యకర్తలే ఈ పని చేశారని పోలీసులు భావిస్తున్నారు.

ఈ దాడి పై స్పందించిన సీఎం కిరణ్ కుమార్ రెడ్డి దాడికి సంబంధించిన వివరాలను తెలపాలని డీజీపీని కోరారు. నేరస్తులను పట్టుకొని కఠిన శిక్ష వేయాలని ఆదేశించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Lanco infratech to sell its roads business
Tollywood legend actor ntr  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles