చరిత్రాత్మక టైటానిక్ నౌక మునిగిన ప్రమాదం జరిగి శత వసంతాలు పూర్తవుతున్న సందర్భంగా.. కాకతాళీయంగా ఈ ప్రమాదం ఎలా జరిగింది, ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడిన వారి సమాచారంతో కూడిన అనేక కొత్త పుస్తకాలు మార్కెట్లోకి వచ్చాయి. భయంకరమైన ఈ టైటానిక్ నౌక ప్రమాదానికి సంబంధించి గత రెండు నెలలుగా అనేక కొత్త పుస్తకాలు వెలువడ్డాయి. 1912లో జరిగిన ఈ ప్రమాదంపై ఇది వరకే వెలువడిన పుస్తకాలు పునర్ముద్రణతో మళ్లీ మార్కెట్లోకి వచ్చాయి.
వీటిలో ‘టైటానిక్, ఫస్ట్ అకౌంట్స్’ పేరిట వెలువడిన పుస్తకం ఒకటి. పెంగ్విన్ ప్రచురించిన ఈ పుస్తకాన్ని టిమ్ మాల్టిన్, నికోలాస్ వేడ్ ఎడిట్ చేశారు. లారెన్స్ బీస్లీ, మార్గరెట్ బ్రౌన్, అర్చిబాల్డ్ గ్రేసీ, కార్లోస్ ఎఫ్ హర్డ్ వంటి ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడిన, ప్రత్యక్ష సాక్షుల వాంగ్మూలాలను ఈ పుస్తకంలో పొందుపరిచారు. చరిత్రకారుడు ఫ్రానెసస్ విల్సన్ వెలువరిచిన ‘హౌ టు సర్వైవ్ ద టైటానిక్: ద సింకింగ్ ఆఫ్ జె బ్రూస్ ఇస్మే’ పుస్తకం టైటానిక్ ప్రమాదం, తదనంతర పరిణామాలను కూలంకషంగా వివరించింది.
Titanic memorial passengers Carmel Bradburn and Andreas Storic from Adelaide dressed in period Edwardian costumes posing in a replica of the Titanic dining room. Picture:.. Supplied
హార్పర్ కోలిన్స్ ప్రచురించిన పుస్తకంలో 1912 ఏప్రిల్ 14న టైటానిక్ నౌక సముద్రంలో ఓ మంచుకొండను ఢీకొన్న సమయంలో చోటు చేసుకున్న సన్నివేశాలను వివరించింది. చావడానికి సిద్ధమైన వెయ్యి మంది పురుషులు తమ చివరి సిగరెట్ వెలిగించుకున్నారని పేర్కొంది. అప్పటికే మహిళలు, పిల్లలతో నిండి ఉన్న లైఫ్బోట్లోకి నౌక యజమాని ఇస్మాయ్ దూకేశాడని తెలిపింది. (చిత్రం) టైటానిక్ నౌక మునిగిపోయి సుమారు వంద సంవత్సరాలు అవుతున్న సందర్భంగా ఆ ప్రమాదంలో మృతి చెందిన వారి బంధువులు ఆ నౌక ఏ ప్రదేశంలో మునిగిందో చూడడానికి బయల్దేరారు. ‘ఎంఎస్ బాల్మోరల్ టైటానిక్ మెమోరియల్ క్రూయిజ్ షిప్’ వీరిని తీసుకొని ఇంగ్లాండ్లోని సౌతాంప్టన్ నుంచి బయల్దేరింది. టైటానిక్ ప్రమాదంలో మరణించిన వారి బంధువులు నౌకలోంచి సముద్రాన్ని తిలకిస్తున్నప్పటి చిత్రమిది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more