సైనిక దళాల కదలికలు ‘అనుమానాస్పదంగా’ ఉన్నాయంటూ ‘ది ఇండియన్ ఎక్స్ప్రెస్’ పత్రిక ప్రచురించిన కథనం పూర్తి నిరాధార మైందని, ప్రజల్ని భయపెట్టేందుకేనని ప్రధానమంత్రి, రక్షణ మంత్రి తెలిపారు. సైనిక దళాలపై బుధవారం ఆ పత్రిక ప్రచురించి కథనం వెలువ డిన కొన్ని గంటల తర్వాత ప్రధానమంత్రి కార్యాలయం (పిఎంఓ) ఒక ప్రకటన విడుదల చేసింది. మీడియా నివేదికను ప్రామాణికంగా తీసుకోకూడదని ప్రధానమంత్రి ఆ ప్రకటనలో పేర్కొన్నారు. ‘సైన్యాధ్యక్ష పదవికి అత్యున్నత స్థాయి ఉంది. దాని హుందాతనానికి భంగం వాటిల్లేపని ఏదీ చేయకూడదు’ అని మన్మోహన్సింగ్ వ్యాఖ్యానించారు.
ప్రభుత్వానికి ముందు సమాచారం అందజేయకుండా భారత సైన్యం జనవరి 16న రెండు యూనిట్లను న్యూఢిల్లీ వైపు తరలించిందని ది ఇండియన్ ఎక్స్ప్రెస్ ప్రచురించింది. తన వయసుకు సంబంధించిన వివాదంపై సైన్యాధ్యక్షుడు వికె సింగ్ సుప్రీంకోర్టులో పిటిషన్ వేసిన కొన్ని గంటల తర్వాత ఈ సంఘటన జరిగిందని తన దర్యాప్తులో వెల్లడైందని ఇండియన్ ఎక్స్ప్రెస్ పేర్కొంది.భారత సైన్యం కూడా ‘ఆ కథనం వట్టి చెత్త’ అంటూ తోసిపుచ్చింది. సైనిక దళాలు తరలి వెళ్లడం సాధారణంగా జరిగే ప్రక్రియేనని తెలిపింది. ‘ఆ కథనం పూర్తిగా నిరాధారమైంది’ అని రక్షణమంత్రి ఏకే ఆంటోనీ చెప్పారు.‘సైనిక దళాలు అలా తరలివెళ్లడం అసాధారణమేం కాదు. సైన్యం దీనిపై వివరణ ఇచ్చింది. సైనికదళాల దేశభక్తి పట్ల మాకు నమ్మకం ఉంది’ అని ఆంటోనీ విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యానికి తలవంపులు తెచ్చే, బలహీనపరిచే ఏ పనినీ సైనికదళాలు చేయవని రక్షణమంత్రి స్పష్టం చేశారు.
లేనిపోని వివాదాలు సృష్టించవద్దని ఆంటోనీ ఈ సందర్భంగా మీడియాను కోరారు. ‘జాతి భద్రత, భారత సైనిక దళాలకు సంబంధించి మనం వివాదాలు సృష్టించి వినోదించలేం. అలా చేయవద్దని నా విన్నపం. సైనిక దళాల గౌరవాన్ని, హుందాతనాన్ని గౌరవించాలని అభ్యర్థిస్తున్నాను’ అని ఆంటోనీ విజ్ఞప్తిచేశారు.‘స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ప్రకారం చెక్ మొబిలైజేషన్కోసం ఫార్మేషన్ స్థాయిలో సాధారణ శిక్షణ ఉంటుంది. క్రమబద్ధమైన విరామంలో దాదాపు అన్ని సైనిక యూనిట్లూ ఈ ప్రక్రియను పాటిస్తాయి. ఒకసారి యూనిట్ సామర్థాన్ని తనిఖీ చేసిన తర్వాత దళాల్ని వెనక్కు పిలిపిస్తారు. ఈ సందర్భంలో కూడా నిబంధన ప్రకారం దళాల్ని వెనక్కు పిలిపించాం. పొగమంచు వంటి ప్రతికూల వాతావరణ పరిస్థితులు న్నప్పుడు సైనిక దళాలు ఎక్కడికైనా తరలి వెళ్లగలవా? అని నిర్ధారిం చుకునేందుకు వాటి సామర్థ్యాన్ని పరీక్షిస్తాం’ అని భారత సైన్యం తెలిపింది.
ఇలా ఉండగా... ఈ కథనంపై వివాదం సృష్టించి రాజకీయ ప్రయోజనం పొందాలని ప్రతిపక్షం ప్రయత్నించింది. ఆ నివేదిక ప్రకారం రక్షణమంత్రి ఏకే ఆంటోనీని తొలగించాలని భారతీయ జనతాపార్టీ పట్టుపట్టింది. ఈ సంఘటనకు రక్షణమంత్రి బాధ్యత వహించాలని బీజేపీ నాయకుడు బల్బీర్ పుంజ్ అన్నారు. ప్రధాని మన్మోహన్సింగ్ దీనిపై వివరణ ఇవ్వాలని గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్రమోడీ డిమాండ్ చేశారు. ‘సైనిక దళాలపై ఇండియన్ ఎక్స్ప్రెస్ కథనం చదవండి. ప్రజలు విశ్వాసం కోల్పోకుండా ప్రధాని స్పష్టమైన వివరణ ఇవ్వాలి’ అని మోడీ కోరారు. జరిగిన పార్లమెంటరీ కమిటీ సమావేశంలో అనేకమంది ఎంపీలు కూడా ఎక్స్ప్రెస్ కథనం గురించి ప్రస్తావించారు. సమావేశంలో వాడి-వేడి చర్చ జరిగింది.
హిసార్ హర్యానాలోని మెకానైజ్డ్ ఇన్ఫెంట్రీ నుంచి జనవరి 16న కీలకమైన ఒక మిలిటరీ యూనిట్ అనూహ్యంగా తరలిపోయిందని ఇంటెలిజెన్స్ ఏజెన్సీల్ని పేర్కొంటూ ఇండియన్ ఎక్స్ప్రెస్ ప్రచురించింది. ఈ ఇన్ఫెంట్రీ 48 ట్యాంక్ ట్రాన్స్పోర్టర్లున్న, రష్యాలో తయారైన సాయుధ పోరాట వాహనాల్ని తీసుకెళ్లిందని సాధారణ పర్యవేక్షణల్లో ధ్రువపడిందని ఆ కథనం పేర్కొంది. ఆగ్రా కేంద్రంగా విధి నిర్వహణ చేస్తున్న 50 పారా బ్రిగేడ్ కూడా తరలివెళ్లిందని ఎక్స్ప్రెస్ రాసింది. ఇదంతా రక్షణమంత్రికి తెలియజేశారని, వెంటనే టెర్రర్ ఎలర్ట్ను జారీ చేసి ఓల్డ్ కంటింజెన్సీ ప్లాన్ను అమలు చేశారని, ఆ ప్రకారం వాహనాల్ని మరింతగా పోలీసులు తనిఖీ చేస్తారని, వాహనాల కదలిక కూడా నెమ్మదిగా సాగుతుందని ఆ పత్రిక పేయం
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more