Minister pallam raju

Minister Pallam Raju.GIF

Posted: 03/26/2012 02:58 PM IST
Minister pallam raju

Pallam-Rajuకేంద్ర రక్షణ శాఖ సహాయ మంత్రి పల్లం రాజు సిగ్గుతో తల దించుకుంటున్నాడు. అంత పెద్ద తప్పు ఇతనేం చేశాడు అనే సందేహం రానీయకండి.  ఈయన ఏపీ భవన్ లో జరిగిన ఉగాది వేడుకలకు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...రాష్ట్రంలో ఎన్నికల ఖర్చును చూసి తాను సిగ్గుతో తల వంచుకుంటున్నానని అన్నారు. దేశంలో ఎన్నికల ఖర్చు అత్యధికంగా ఉన్న రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నిలవటం బాధాకరమని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో ఎన్నికల ఖర్చు మితిమీరటం మంచి పరిణామం కాదని, ప్రజాస్వామ్యాన్ని బలపరచాలంటే దాన్ని తగ్గించాలని, అప్పుడే రాష్ట్రం, దేశం అభివృద్ధి చెందుతాయని పళ్లంరాజు చెప్పారు.

కాగా, మౌలిక సదుపాయాల్లో రాష్ట్ర అభివృద్ధి గురించి దేశం మొత్తం తెలుసుకుందని, కానీ, రాష్ట్ర సాంస్కృతిక, ఆధ్యాత్మిక గొప్పదనాన్ని కూడా దేశానికి తెలియజేయాల్సి ఉందన్నారు. తెలుగు జాతి సంస్కృతి, ఆధ్యాత్మిక సంస్కృతిని ప్రతిబింబించేలా నడుచుకోవాలని ఢిల్లీలోని తెలుగు ప్రజలకు సూచించారు. ఆంధ్రప్రదేశ్ అంటే ఏపీ భవన్‌లో లభించే బిర్యానీ మాత్రమే కాదనే విషయం ఢిల్లీ వాసులు తెలుసుకునేలా తెలుగు సంస్కృతిని  ప్రతిబింబింప జేయాలన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Vexesion may be the way of suicide
Naxalites entering  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles