ఇవాళ ఏడు అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరుగుతుండగా అందరి నజర్ నెల్లూరు జిల్లా కోవూరు అసెంబ్లీ స్థానంపైనే ఉంది. ఇందులో ఎవరిది గెలుపు, ఎవరికి ఎక్కడ, ఎన్ని ఓట్లు వస్తాయి అనేదానిపై జోరుగా బెట్టింగులు సాగుతున్నాయి. దీంతో కోవూరు అసెంబ్లీ స్థానం ఫలితంపై రాష్ట్రంలోనే కాకుండా దేశ వ్యాప్తంగా సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. కాంగ్రెస్ పార్టీతో విభేదించి కొత్తగా పార్టీని ఏర్పాటు చేసిన వైఎస్.జగన్మోహన్ రెడ్డి సత్తా ఎంత ఉందో యావన్మందికీ తెలిసివచ్చేది ఈ స్థానం నుంచే కావటంతో ఈ ప్రాముఖ్యత ఏర్పడింది. కొవూరు నియోజకవర్గంలో అభ్యర్థులపై విశాఖపట్టణం, ఒంగోలు, విజయవాడ, కరీంనగర్, కడప, అనంతపురం, చిత్తూరు తదితర పట్టణాల్లో పందెం రాయుళ్లు భారీ ఎత్తునే బెట్టింగులు జరుపుతున్నారు.
ఈ స్థానం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్.జగన్మోహన్ రెడ్డి తరపు అభ్యర్థిగా నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి పోటీ చేస్తుండగా, టీడీపీ తరపున సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థిగా పోలంరెడ్డి శ్రీనివాస్ రెడ్డిలు పోటీ చేస్తున్నారు.
కాగా, కోవూరు నియోజకవర్గం బుచ్చిరెడ్డిపాలెం మండలం పురంధపురంలో ఓటర్లు పోలింగ్ బహిష్కరించారు. ఓట్లు వేసేందుకు ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు రాలేదు. దాదాపు 350 ఓటర్లు ఈ గ్రామంలో ఉన్నారు. పోలింగ్ కేంద్రంలో ఏజెంట్లు మినహా ఎవరూ కనిపించలేదు. అయితే ఇదంతా టీడీపీ కుట్ర అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆరోపిస్తుండగా, తమ గ్రామంలో ఏ పార్టీ ఇప్పటి వరకు సమస్యలను తీర్చడం లేదని, అవి తీర్చిన తర్వాతే ఓట్లు వేస్తామని అక్కడి ప్రజానీకం చెబుతోంది.
ఇదిలా ఉంటే, ఉపఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి భన్వర్లాల్ తెలిపారు. వెబ్కెమేరాల ద్వారా ఎన్నికల సరళిని పరిశీలిస్తున్నామని ఆయన చెప్పారు. అవసరమైన చోటకి సీనియర్ అధికార్లను పంపిస్తామని తెలిపారు. సాయంత్రం ఐదు గంటల వరకూ క్యూలో ఉన్న ప్రతిఒక్కరికీ ఓటు వేసే అవకాశం ఉందని భన్వర్లాల్ చెప్పారు. ప్రతిఒక్కరు విధిగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఆయన కోరారు.
...avnk
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more