అనంతపురం జిల్లా పెనుగొండ కాళేశ్వర స్వామి కిడ్నీ, లివర్ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయన్ను పరిస్థితి విషమించడంతో నిన్న రాత్రి బెంగలూరులోని కొలంబియా ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. తీవ్ర అనారోగ్యంతో భాదపడుతున్న ఆయన (38) ఈరోజు బెంగుళూరులో కన్నుమూశారు. బాబా మరణాన్ని ఆ ఆస్పత్రి వైద్యులు అధికారికంగా ధృవీకరించారు. సాయి కాళేశ్వర్ అసలు పేరు సుబ్రహ్మణ్యం. ఆయన కడప జిల్లా మాధవరంలో జన్మించారు. బుక్కపట్నంలో ప్రాథమిక విద్యను అభ్యసించారు. పెనుగొండలో ఇంటర్ చదివారు. ఆపై ఆధ్యాత్మిక రంగంపై దృష్టి సారించి బాబాగా మారారు. కడప జిల్లాకు చెందిన న్యాయవాది కూతురు శిల్పతో ఆయనకు వివాహం జరిగింది. బాబాకు నవ్యశ్రీ అనే మూడేళ్ల కూతురు ఉంది.
కాలేశ్వర్ బాబా విద్య, వైద్య, సామాజిక రంగంలో చెరగని ముద్ర వేశారు. వెయ్యి కోట్ల రూపాయలతో మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రికి శ్రీకారం చుట్టారు. ప్రస్తుతం ఆ ప్రాజెక్టు పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. స్థానిక ప్రజల ఉపాధి కోసం లీ జీన్స్ భారీ ప్రాజెక్టును పెనుగొండకు తీసుకొచ్చిన ఘనత ఆయనదే. మరోవైపు పెనుగొండ నిజయోజకవర్గంలో ప్రజలకు సురక్షిత మంచినీరు అందించేందుకు కోట్లాది రూపాయలు వెచ్చించారు. ఇటీవలే పెనుగొండ నీటి అవసరాలకు గ్రామ పంచాయితీకి కోటి రూపాయల విరాళం అందించారు. వందలాది జంటలకు ఉచిత సామూహిక వివాహాలు చేశారు.
ఈయన మరణంతో పెనుగొండలో విషాద చాయాలు అమలుకున్నాయి. ఈయన మరణవార్త విన్న భక్తులు వేలాదిగా పెనుగొండకు తరలివస్తున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more