ఉప ఎన్నికల్లో ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి టీడీపీ పడరాని పాట్లు పడుతోంది. మహబూబ్నగర్ జిల్లా నాగర్కర్నూల్లో ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న నాగం జనార్దన్డ్డిని ఓడించడానికి ఏకంగా ఓ ట్రస్టును ఏర్పాటు చేసి పెళ్లిళ్లకు, చావులకు విరాళాల పేరుతో డబ్బులు పంపిణీ చేస్తోంది. ఆత్మగౌరవం కోసం అవసరమైతే ఆస్తులైనా అమ్ముకుంటాం, కానీ సీమాంధ్రల డబ్బులు మాకొద్దని ఓ యువతి తెగేసి చెప్పింది. తన పెళ్లికి టీడీపీ నేతలు డబ్బులిస్తారంటే వద్దు అని తోసి పుచ్చింది. తెలకపల్లిలో సూర్య వెంక లక్ష్మి దంపతులు కూలి చేసుకుంటూ జీవిస్తున్నారు. వీరికి ముగ్గురు కూతుళ్లు, ఓ కుమారుడు ఉన్నారు. వీరి పెద్ద కూతురు కృష్ణవేణి ఇంటర్ చదువుకుంది. శ్రీరామనవమి తర్వాత ఆమె పెళ్లి చేయాలని పెద్దలు నిర్ణయించుకున్నారు.
కాగా ఈనెల 1న నాగర్కర్నూల్ అసెంబ్లీ ఉప ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో, ఎన్నికల ప్రచారంలో భాగంగా టీడీపీ నేతలు నియోజకవర్గంలో పెళ్లిళ్లు, చావులకు ఓ ట్రస్ట్ పేరుతో విరివిగా విరాళాలు అందిస్తున్నారు. ఇదే క్రమంలో కృష్ణవేణి పెళ్లికి కూడాసదరు పార్టీ నేతలు డబ్బులు ఇస్తామని చెప్పారు. అయితే ముందు వెంక కుటుంబం టీడీపీలో చేరాలని, అప్పుడే డబ్బులు ఇస్తామని రాయబారం పంపారు. దీన్ని ఆ కుటుంబం తిరస్కరించింది. అయితే పెళ్లికి ఆర్థిక సాయం చేస్తామని చెప్పగా కృష్ణవేణి, సహా కుటుంబ సభ్యులంతా మండిపడ్డారు. సీమాంధ్ర పార్టీల డబ్బుతో పెళ్లి చేసుకొని తానెలా సుఖ పడతానని ఆ యువతి డబ్బులు తీసుకోనని తెగేసి చెప్పింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more