గాలి జనార్దన రెడ్డిని హాజరుపరచిన బెంగళూరు సిటీ సివిల్ కోర్టు రణరంగంగా మారింది. కోర్టు ఆవరణలో గాలి దుమారమే చెలరేగింది. లాయర్లు మీడియా ప్రతినిధుల మీద దాడి చేసారు కోర్టు ప్రాంగణంలో లాయర్లు మీడియా వాళ్ళని విచక్షణారహితంగా కొట్టారు. రాళ్ళతో దాడిచేసారు. లాయర్ల రాళ్ళ దాడిలో పోలీసులకు కూడా గాయాలయ్యాయి. దానితో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకుని రావటానికి ముందు గాలిలో కాల్పులు జరిపారు. ఈ ఘటనలో డిసిపి రమేష్ కి కూడా గాయాలయ్యాయి. ఒక లాయరు కావాలని డిసిపి దగ్గరికెళ్ళి అతని మీద దాడిచేసినట్టుగా ప్రత్యక్ష సాక్షి కథనం. ఈఘటనలో జర్నలిస్ట్ లు, పోలీసులు కూడా తీవ్రంగా గాయపడ్డారు. లాయర్ల దాడిలో 30 కెమెరాలకు, కొన్ని టివి ఛానెల్స్ కి చెందిన 6 ఓబీ వ్యాన్ లకు నష్టం సంభవించింది.
అసలింతకీ గాలి జనార్దన రెడ్డికీ ఈ లాయర్ల దాడికి సంబంధమేమిటంటే, గాలి ప్రమేయం ఇందులో ఏమీ లేదు. గాలి ని ఈ రోజు ఆ కోర్టులో ప్రవేశపెడతారని, దానికి మీడియా భారీగా మోహరిస్తుందని తెలుసు. అందుకే లాయర్లంతా ముందే వేసుకున్న పథకం ప్రకారం మీడియా మీద వారి వాహనాలు, మనుషుల మీద రాళ్ళ వర్షం కురిపించి అక్కడ వాతావరణాన్నంతా రణరంగంగా మార్చివేసారు. పోలీసులనూ వదలలేదు. జర్నలిస్ట్ లు పోలీసులనే లక్ష్యంగా పెట్టుకుని కొందరు ప్రైవేటు గూఁడాలను కూడా తయారుగా పెట్టుకుని ఈ దాడికి దిగినట్టుగా సమాచారం. గాయపడిన వారిలో కొందరు హాస్పిటల్ లో ఐసియు లో పెట్టవలసినంత తీవ్రంగా గాయపడ్డారు. ఈ దాడికి లాయర్లు పూర్తి తయారీలోనే వచ్చారని తెలుస్తోంది.
దాడికి చేసుకున్న పథకం సరే. కానీ లాయర్ల ఆగ్రహానికి కారణమేమిటి.
జనవరి 17న లాయర్ల సమ్మె వలన బెంగళూరులో ట్రాఫిక్ జామ్ అయిన సందర్భంగా నగరవాసులకు కలిగిన అసౌకర్యాన్ని మీడియా బాగా కవర్ చేసింది. ముఖ్యంగా ఆసందర్భంలో ప్రసవవేదన పడుతున్న ఒక స్త్రీ , అలాంటి ఎందరో వారి పనుల మీద పోతున్న వారంతా పడ్డ కష్టాలను కెమేరాలలో బంధించి టివిలో చూపించటంతో మీడియా మీద ఆగ్రహం చెందిన లాయర్లు వాళ్ళకి గుణపాఠం చెప్పాలనుకున్నారు. సమయం కోసం వేచి చూసారు. ఈసారి గాలి పుణ్యమాంటూ సిటీ సివిల్ కోర్టు దగ్గర అందరూ దొరుకుతారని తెలుసు. లాయర్లుగా అక్కడికి అందరూ చేరుకోవచ్చు. అలాగే పోలీసులమీద కూడా ఎప్పటినుంచో కుర్రుగా ఉన్న లాయర్లు వీరిరువురిమీదా కసితీరా దాడిచేసారు.
లంచ్ టైం అవటంతో శాంతవాతావరణం ఏర్పడింది కానీ వాళ్ళ కసి పూర్తిగా తీరినట్టుగా కనిపించటం లేదు అంతా పూర్తిగా అణిగిన సంకేతాలు కనిపించటంలేదు.
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more