అధికారంలో ఉన్న వాళ్లు తలచుకుంటే ఏమైనా చేయవచ్చని కమలాపురం ఎమ్మెల్యే జి.వీరశివారెడ్డి నిరూపించారు. రూ.కోటి విలువైన స్థలం, భవనాన్ని లక్షకే కొట్టేశారు. ప్రొద్దుటూరు వ్యవసాయ మార్కెట్ యార్డులో గతం లో వీరశివారెడ్డి లెసైన్స్డ్ ఏజెంట్గా వ్యవహరించేవా రు. 1971లో మార్కెట్యార్డులో ఉన్న స్థలాన్ని ఏజెం ట్లకు అప్పగించేందుకు బహిరంగ వేలం నిర్వహించా రు. స్థలం కొనుగోలు చేసిన మెత్తం 49మంది కమీషన్ ఏజంట్లలో 38 మంది డబ్బు మొత్తాన్ని చెల్లించి స్థలాలను రిజిస్ట్రేషన్ చేయించుకోగా, డబ్బు చెల్లించని కారణంగా 11మందికి స్థలాలు రిజిస్ట్రేషన్ కాలేదు. వీరిలో ప్లాటు నంబర్ 31 హక్కుదారుడు వీరశివా కూడా ఉన్నారు.
తదనంతర కాలంలో ఈ యార్డులో కమీషన్ ఏజంట్లు తమ వ్యాపారాన్ని వదిలేశారు. దీంతో, ఇక ఆ 11మందిలో ఎవరికీ అధికారులు స్థలాలను రిజిస్ట్రేషన్ చేయించలేదు. అయితే, వీరశివారెడ్డి మాత్రం అధికార పార్టీ ఎమ్మెల్యేగా ఇప్పుడు తన పలుకుబడితో మార్కెటింగ్ శాఖ నుంచి స్థలం రిజిస్ట్రేషన్ కోసం అనుమతి తెచ్చుకున్నారు. 4.82 సెంట్ల స్థలాన్ని అప్పటి కమీషన్ ఏజెంట్లు రూ.3150కి కొనుగోలు చేయగా, ఇప్పుడు కూడా అదే ధరతో స్థలాన్ని కొనుగోలు చేశారు. ఈ స్థలంలో మార్కెట్ కమిటీ నిర్మించిన భవనానికి కూడా ప్రభుత్వ అంచనా ప్రకారం మరో రూ.63,375లు ఇచ్చి రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. ప్రస్తుతం బహిరంగ మార్కెట్ అంచనా ప్రకారం స్థలంతో పాటు భవనం విలువ కలిపి దాదాపు రూ.కోటి ఉండగా, వీరశివారెడ్డి లక్ష లోపు విలువ కట్టిదక్కించుకోవడం గమనార్హం.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more