ఎమార్ కుంభకోణం మీద విచారణను 2005 నుంచి కాకుండా అంతకు ముందునుంచే జరగాలన్న దానిమీద ధర్మాసనం మండిపడింది. ఎమ్మెల్యే శంకరరావు వేసిన పిటిషన్ ఆధారంగా ఎమార్ కేసు మీద దర్యాప్తుకి ఆదేశించటం జరగిందని, దాని మీద సిబిఐ దర్యాప్తు చేసి చార్జ్ షీట్ కూడా దాఖలు చేసింది కదా ఇంకేం కావాలి అని జస్టిస్ దీపక్ ప్రశ్నించగా, ఎమార్ కేసు లో దర్యాప్తుని నిలిపివేయమని, అంతకు ముందు నుంచే విచారణ జరిపించమన పిటిషన్ పెట్టుకున్నవారి తరఫున వాదిస్తున్న న్యాయవాది రంజిత్ కుమార్, విచారణను 2005 నుంచి జరిగిన లావాదేవీల మీదనే విచారణ జరుగుతున్నదని, అలా కాకుండా అంతకుముందు నుంచే జరిపించాలని అనగా, న్యాయమూర్తులు ఈ విషయంలో ఒక సారి తీర్పుని మళ్ళీ చదవమని చెప్తూ, దర్యాప్తు జరిపించమని చెప్పటం జరిగిందే తప్ప ఎప్పటినుంచి చెయ్యాలన్నది అందులో లేదని అన్నారు.
దర్యాప్తు సంస్థ సిబిఐ తరఫున వాదిస్తున్న అదనపు సొలిసిటర్ జనరల్ మాట్లాడుతూ, దర్యాప్తు మీద కాలపరిమితేమీ విధించలేదని, పిటిషనర్ లు అంటున్నట్టుగా 2005 అని కానీ, వారు ప్రస్తుతం కోరుతున్నట్టుగా 2002 నుంచి అని కానీ ఆదేశించలేదని, 2000 సంవత్సరం నుంచే లావాదేవీలను దర్యాప్తు చేసి చార్జ్ షీట్ దాఖలు చెయ్యటం జరిగిందని అన్నారు.
చార్జ్ షీట్ ఫైలు చేసినందువలన పిటిషన్ ని కొట్టివేస్తున్నామని ధర్మాసనం తీర్పు ఇచ్చింది.
అలాగే సుప్రీం కోర్టులోనూ జగన్ కి ఎదురుదెబ్బే తగిలింది. పైవిధమైన ఎమార్ విషయంలో దర్యాప్తు అంతకు ముందునుంచే జరగాలని, ఇంకా, జగతి పబ్లికేషన్స్, నండూరి పవర్ సంస్థల మీద దర్యాప్తు నిలపివేయాలని వేసిన నాలుగు పిటిషన్లనూ సుప్రీం కోర్టు తోసిపుచ్చింది. హైకోర్టు ఆదేశం ప్రకారం దర్యాప్తు జరుగుతోందని, అందులో సుప్రీం కోర్టు జోక్యం కలుగజేసుకోదని చెప్తూ ఆ పిటిషన్లను సుప్రీం కోర్టు కొట్టివేసింది.
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more