పని వత్తిడి మూలంగా టివి న్యూస్ రీడిర్ ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన వనస్థలిపురం పోలీస్స్టేషన్ పరిదిలో చోటు చేసుకుంది. సంఘటనకు సంబందించి ఎసై్స వెంకటనారాయణ తెలిపిన వివరాల ప్రకారం...ఒడిషా రాష్ట్రానికి చెందిన సత్యసచిపట్నాయక్ (27) ఈనెల 5వ తేదీన నగరానికి వచ్చి నగర శివారులోని రామోజీ ఫిల్మ్ సిటీలో ఒడిషా చానల్లో న్యూస్ రీడిర్గా ఉద్యోగంలో చేరాడు. వనస్థలిపురం పోలీస్స్టేషన్ పరిధిలోని ద్వారకామయినగర్లో మరో ఇద్దరు మిత్రులతో కలిసి అద్దెకు ఉంటున్నాడు. వారం రోజులు విధులకు వెళ్లి వచ్చిన పట్నాయక్ విధుల నుంచి తిరిగి వచ్చి ఇంట్లో ఉన్న ఫ్యాన్కు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.
బయటికి వెల్లి రాత్రి ఇంటికి వచ్చిన పట్నాయక్ రూమ్లోని మిత్రులు లోపటి నుంచి గడియ పెట్టి ఉండడం గమనించి పిలిచినా పలకకపోవడంతో ఇంటి యజమానిని పిలిచారు. అనుమానం వచ్చిన యజమానికి పోలీసులకు సమాచారం అందించాడు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు తలుపులు పగుల గొట్టి ఫ్యాన్కు వేలాడి ఉన్న పట్నాయక్ మృతదేహాన్ని దించి పంచానామా నిర్వహించి పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న ఎసై్స వెంకటనారాయణ దర్యాప్తు చేస్తున్నారు. అయితే అతను చనిపోవటం పై అనేక అనుమానాలు వస్తున్నాయి. అతను ప్రేమలో విఫలంల అయ్యాడని కొందరు ప్రజలు అంటున్నారు. మరికొందరు .. ఎవరో అతన్ని చంపి ఊరి వేశారని అంటున్నారు. అయితే అతని స్నేహితులు మాత్రం .. ఈ మద్య కాలంలో .. యాజమాన్యంతో గోడవలు జరిగాయాని అంటున్నారు. ఏదీ నిజమో, ఏదీ అబద్దమో తెలియాక పోలీసులు దర్యాప్తు చేసే పనిలో బిజీగా ఉన్నారని తెలుస్తుంది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more