శాసనసభ బడ్జెట్ సమావేశాలు ఇవాళ (సోమవారం) ప్రారంభమయ్యాయి. ఉదయం 9 .30 గంటలకు పాత అసెంబ్లీ హాల్లో ఉభయ సభల్ని ఉద్దేశించి గవర్నర్ నరసింహన్ ప్రసంగించారు. టీఆర్ఎస్, టీడీపీ నిరసనతో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను నుంచి వాకౌట్ చేశాయి. మొదట గవర్నర్ హడావుడిగా తన ప్రసంగాన్ని కొనసాగించారు. సభ నుంచి విపక్ష సభ్యులు వెళ్లిపోయాక'రిలాక్స్డ్' గా ప్రసంగాన్ని వినిపించారు.
ప్రభుత్వ ప్రాధాన్యతల్ని గవర్నర్ తన 35 నిమిషాల ప్రసంగంలో చాటిచెప్పారు. జనగణమన పూర్తయ్యాక వెంటనే సభలో జై తెలంగాణ నినాదాలు మార్మోగాయి. గవర్నర్ ప్రసంగం పత్రాల్ని విపక్ష సభ్యులు చించేశారు. వాటిని గవర్నర్పైకి విసిరే ప్రయత్నం చేశారు. చుట్టు నిలిచిన సెక్యూరిటీ సిబ్బంది ఆ కాగితాలు గవర్నర్పై పడకుండా పట్టుకున్నారు. కాగా గవర్నర్ తన ప్రసంగాన్ని తెలుగులో ప్రారంభించి....తెలుగులోనే ముగించారు.
కాగా, గవర్నర్ ప్రసంగం మీద టీడీపీతో పాటు విపక్షాలన్నీ మండిపడ్డయి. సొంత డబ్బాకొట్టుకున్నట్టుందని వామపక్షాలు, జగన్ వర్గం ఎమ్మెల్యేలు ఆరోపించారు. విభజన అంశం లేదంటూ టీఆర్ఎస్ వ్యాఖ్యానించింది.
అనంతరం స్పీకర్ నాదెండ్ల మనోహర్ అధ్యక్షతన బీఏసీ సమావేశం జరిగింది. వివిధ పార్టీల ఫ్లోర్ లీడర్లు హాజరు కాగా ఈ సమావేశానికి టీడీపీ గైర్హాజరు అయ్యింది. బడ్జెట్ సమావేశాలు నేటి నుంచి ప్రారంభం అయిన నేపథ్యంలో సభలో ఏయే అంశాలపై చర్చించాలనే వాటిపై బీఏసీలో ఖరారు చేశారు. ఈనెల 17న ఆర్ధిక మంత్రి ఆనం రామనారాయణరెడ్డి అసెంబ్లీలో బడ్జెట్ ను ప్రవేశపెడతారు. మార్చి నెలాఖరు వరకు ఈ బడ్జెట్ సమావేశాలు కొనసాగుతాయి
...avnk
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more