అటుతిరిగి ఇటుతిరిగి మద్యం సిండికేట్ల మీద ఎసిబి చేసిన దాడుల్లో ఎక్సైజ్ శాఖామాత్యులు మోపిదేవి వెంకట రమణ పేరు బయటపడింది. ఆయనకు ముడిపులు అందినట్టుగా సిండికేట్ల రికార్డ్ లలో తేలింది. దానితో ప్రతిపక్షాల్లో కలకలం, పాలకపక్షంలో కలవరం చెలరేగింది.
తాను ఉన్నతమైన కుటుంబం నుంచి వచ్చానని, ఎంతో క్రమశిక్షణతో పెరిగానని ఇలాంటి చిల్లర పనులు చెయ్యవలసిన అవసరం తనకు లేదని, అసలు తనకు ముడుపులు చెల్లించానంటున్న మనిషెవరో కూడా తనకి తెలియదని మోపిదేవి మీడియా ముందు చెప్పుకొచ్చారు. తనమీద గనక ఆధారాలతో నేరారోపణ జరిగితే తాను వెంటనే రాజీనామా చేస్తానని ఆయన అన్నారు.
ఇదిలా ఉండగా తెలుగుదేశం పార్టీ ఆయన మీద ఆధారాలతో సహా నిందారోపణ చేసింది. 22 సంవత్సరాల మోపిదేవి కుమారుడు రాజీవ్ పోయిన సంవత్సరం క్రెడెన్స్ వెంచర్ కాపిటల్ పేరుతో భాగస్వామ్య సంస్థనోదాన్ని రిజిస్టర్ చేయించారు. నెల లోపులోనే ఆ సంస్థకు ఇన్ బేవ్ ఇంటర్నేషనల్ అనే సంస్థ బ్లాక్ ఈగల్ బీర్ ని మన రాష్ట్రంలో పంపిణీ చెయ్యటానికి హక్కులను ధారాదత్తం చేసింది. ఎంతో అనుభవమున్న సంస్థలెన్నో ఉన్నా మంత్రి కుమారుడికి ఈ పంపిణీ హక్కలు దక్కాయంటే అవి ముడుపులు కాక మరేమిటని తెదెపా నాయకులు ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వం నుంచి పనులు చేయించుకోవటం, ఇలా దొడ్డిదారిన వ్యాపరంలో లాభాలు వచ్చేట్టుగా చెయ్యటం ఒకప్పుడు గుట్టు చప్పుడు కాకుండా జరిగేది కానీ ఇప్పుడది అందరికీ తెలిసిన విధానమైపోయింది.
తెదేపా ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య ఈ విషయంలో ప్రభుత్వ వైఖరిని తప్పు పడుతూ, ఎక్సైజ్ అధికారులకో న్యాయం, మంత్రులకో న్యాయమా అని ప్రశ్నిస్తున్నారు.
అయితే తెదేపా ఎమ్మెల్యే వెంకట వీరయ్య పేరు కూడా లంచాల జాబితాలోకి వచ్చిందని తెలిసి, ప్రతిపక్షంలో ఉన్నవాళ్ళకి లంచమెందుకిస్తారు, అయినా మేము పార్టీ పరంగా విచారణ చేసి తగు చర్య తీసుకుంటామని వర్ల రామయ్య అన్నారు.
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more