దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి వల్లనే ఐఏఎస్ లకు ఈ గతి పడుతోందని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు మీడియా సమావేశంలో అన్నారు. తెదేపా హయాంలో ఐఏఎస్ లు జాతీయ స్థాయిలో గుర్తింపును పొందారని, ఇప్పుడు కాంగ్రెస్ హయాంలో జైళ్ళకు వెళ్తున్నారని ఆయన అన్నారు. వైయస్ రాజశేఖర రెడ్డి తన అవినీతికి ఐఏఎస్ లను బలిచేసారని, ఆయన ఒత్తిడికి తలవొగ్గిన అధికారులు ఇప్పుడు జైళ్ళల్లోకి పోతున్నారని చంద్రబాబు అన్నారు.
ఐఎఎస్ లు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని కలిసి తమ గోడు చెప్పుకుంటుంటే, ఆయన ఇచ్చిన సలహా ఏమిటంటే, జైళ్ళకి పోండి, బెయిల్ తీసుకోండి అని- ఇదీ ముఖ్యమంత్రి ఐఏఎస్ లపట్ల చూపిస్తున్న ప్రేమాభిమానాలు అంటూ చంద్రబాబు ముఖ్యమంత్రిని దుయ్యబట్టారు.
అయినా జైళ్ళకి పోవటానికి కూడా ఈ కాలంలో ఎవరూ సంకోచించటం లేదు. ఒక పెద్దమనిషైతే జైలుకి పోతూ విక్టరీ సంకేతాన్ని చూపిస్తున్నారు. ఆయన ముఖంలో సిగ్గూ లజ్జా అనేదేమీ కనపడలేదు అన్నారు చంద్రబాబు. రెవిన్యూ రికవరీ చట్టపరిధిలో అవినీతిలో అరెస్టైన పెద్దమనుషుల ఆస్తులను జప్తుచెయ్యాలని చంద్రబాబు అభిప్రాయపడ్డారు.
అయితే అదే పార్టీకి చెందిన బి గోపాల కృష్ణారెడ్డి, ఎమ్ వెంకటేశ్వరరావు మీడియా సమావేశాన్ని నిర్వహించి, సిబిఐ అరెస్ట్ చేసిన ఐఏఎస్ లు మంత్రుల మీద ఆరోపణలు చెయ్యటం సరికాదని, తమ బాద్యతలను దులిపేసుకుంటూ, అక్రమాలకు పాల్పడి దాన్ని తప్పించుకోవటానికి రాజకీయ నాయకుల మీదకు నెట్టేయటం చేస్తున్నారని విమర్శించారు.
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more