కావాలనే 2జి కేసులో సిబిఐ దర్యాప్తుని కొందరి విషయాల్లో జాప్యం చెయ్యటం, నీరు గార్చటం, బలహీనంగా చెయ్యటం చేస్తున్నారని మాజీ టెలికాం మంత్రి దయానిధి మారన్ విషయంలో ఉద్దేశ్యపూర్వకంగానే నిదానంగా నడిపిస్తున్నారని, కేంద్ర న్యాయశాఖామాత్యులు సల్మాన్ ఖుర్షీద్ ఈ కేసులో జోక్యం చేసుకుంటున్నారని, సుప్రీం కోర్టులో వేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యానికి స్పందించిన సుప్రీం కోర్టు జనవరి 20 కి జస్టిస్ జిఎస్ సింఘ్వి, జస్టిస్ ఎ.కె.గంగూలీ లతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టనుంది. ఈ లోపులో దాని మీద వివరణ కోరుతూ కేంద్ర ప్రభుత్వానికి, సిబిఐకి, ఇడి కి జనవరి 5 న సుప్రీం కోర్టు ఇచ్చిన నోటీసులకు కేంద్ర ప్రభుత్వం ఈ క్రింది విధంగా జవాబిచ్చింది.
"మంత్రుల జోక్యమనేది నిరాధారమైన ఆరోపణ. ఒక్కొక్కరికి ఒక్కో అభిప్రాయముండవచ్చు. అంత మాత్రం చేత ఒకరి అభిప్రాయం వలన నేర విచారణలో మార్పు కలుగుతుందని, స్వాన్, రిలయన్స్ సంస్థల మీద కేసు బలహీనమవుతుందని చేసే ఫిర్యాదు నిరాధారమైనది. ఎస్సిలార్, లూప్ సంస్థలకు న్యాయశాఖా మంత్రి కొమ్ముకాస్తున్నారన్న అభియోగాన్ని మేము ఖండిస్తున్నాం. సిబిఐ, న్యాయాలయాలలో ఉన్న ఈ కేసు మీద స్వచ్ఛంద విచారణ జరుగుతుంది.
ఈ పిటిషన్ వేసిన వ్యక్తులకు, చట్టబద్ధంగా నియామకులైన ఉన్నత పదవులు బాధ్యతలు కలిగినవారిమీద అభియోగాలు మోపటం అలవాటైపోయింది. కోర్టులో వేసిన కేసు మూలంగా విపరీత మైన ప్రచారం జరుగుతుంది కాబట్టి ప్రభుత్వ ప్రతిష్ట మీద దెబ్బతీసే ప్రయత్నంలో ఇది ఒక భాగమే అన్నది స్పష్టమౌతోంది.
కావాలనే బాధ్యతాయుతమైన పదవులలో ఉన్నవారి పేరు పెట్టి, సిబిఐ లాంటి దర్యాప్తు సంస్థలను తప్పుపట్టి ఆరోపణలు గుప్పించటం ఈ పిటిషన్ వేసిన వారికి (అడ్వకేట్ ప్రశాంత్ భూషణ్ సహా) ఒక నిత్యకృత్యంగా తయారైందన్నది సర్వ విదితమే."
చివరగా, "పిటిషన్ వేసినవారు, అందరూ అవినీతిపరులేనన్న తమకున్న సందేహంతో, కేసు విచారణ జరుపుతున్న సంస్థలమీద నిఘా పెట్టే అధికారిగా తమకు తాము నియమించుకుంటున్నారు. సిబిఐ కానీ ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ మీద కానీ ఏ ప్రభుత్వ శాకా జోక్యం చేసుకోవటానికి వీలుపడదు. అన్నిటికన్నా ముఖ్యంగా ఈ పిటిషన్ వేసినవారికి అసలే అవకాశం లేదు."
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more