ఒకాయన కాంట్రాక్టరు, మరొకాయన ఇంజినీరు. ఇద్దరూ క్రికెటర్లే. 77 సంవత్సరాల మాజీ ఇండియన్ కేప్టన్ నారీ కాంట్రాక్టర్ ఒకాయన, మరోకాయన ఫారుఖ్ ఇంజినీర్ మాజీ ఓపెనింగ్ బ్యాట్స్ మన్. హైద్రాబాద్ లో జరిగిన పార్సీ కమ్యూనిటి ఫెస్టివల్ కి హాజరైన వీరిరువరూ ప్రస్తుత బ్యాట్స్ మన్ ల స్థానంలో యువక రక్తం రావాలని తమ అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. గతంలో ఆట బాగా ఆడినవారికి దక్కవలసిన గౌరవం ఒకెత్తు. కానీ వయసు మీరిపోతున్నప్పుడు వారి స్థానంలో యువకులను నిలబెట్టి క్రికెట్ ని కాపాడుకోవటం మరో ఎత్తని వారు అన్నారు. వయసనేది తప్పని సరిగా మీదపడేదే. ఆట ఆడుతున్నప్పుడు కీలకమైన నిర్ణయాన్ని తీసుకోవటంలో క్షణకాలం ఆలస్యమైనా అది చాలా నష్టాన్ని కలిగిస్తుందని కాంట్రాక్టర్ అన్నారు. 1955 నుంచి 1962 వరకూ ఆయన 31 టెస్ట్ మ్యాచ్ లు ఆడారు. సచిన్ బ్యాటింగ్ లోపాలను, లక్ష్మణ్ సేహ్పాగ్ లు క్యాచ్ లు వదిలిపెట్టటాన్ని, ద్రవిడ్ బౌలౌట్ అవటాన్ని గుర్తుచేస్తూ, ఇవన్నీ క్షీణిస్తున్న వారి ఆటకి సంకేతాలు అని అన్నారు.
భారత జట్టు అన్నిటికీ సిద్ధపడి ఉందని కానీ సవాళ్ళను ఎదుర్కోవటానికి సిద్ధంగా ఉందని కాని అనిపించటంలేదు. దాని ఫలితమే 3-0 అంటూ, ఆస్ట్రేలియా తో ఆడిన తాజా టెస్ట్ ల పరిణామాన్ని గుర్తుచేలారు ఇంజినీరు. ఈయన 1961 నుంచి 1975 వరకు క్రికెట్ లో వికెట్ కీపర్ గానూ ఓపెనింగ్ బ్యాట్స్ మన్ గానూ రాణించారు. ఆస్ట్రేలియన్ల బౌలింగ్ మరీ అంత ఆడలేనంత స్థాయిలో ఏమీ లేదని ఇంజినీర్ అన్నారు. మొత్తానికి నిరుత్సాహపరచిన ఆట అన్నారాయన. ధోనిని చూస్తే, అతన్ని తప్పుపట్టటం కాదు కానీ వికెట్ కీపింగ్ స్థాయి బాగా పడిపోయింది అని కూడా ఇంజినీర్ అన్నారు.
కొత్తముఖాలు రావటంతో పాటు ఈలోపులో పాతవాళ్ళు కూడా పాత తప్పులలోంచి పాఠాలు నేర్చుకోవటం, తనవంతు పూర్తి ప్రమేయంతో ఆడటం ఇదీ ఇప్పుడు మనం ఆశించదగ్గది అని అన్నారిరువురూ.
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more