మనిషి అన్నీ సదుపాయలతో ఎంతో సుఖం పొందుతున్నాడు. కానీ ఈ సదుపాయల వల్ల కొన్నింటిని కొల్పోతున్నాడు. కొత్త వాటికి అలవాటు పడిన మనిషి చాలా విలువైన వాటిని దూరమవుతున్నాడు. మనిషికి జ్ఞాపకశక్తి ఎంతో అవసరం. అలాంటి శక్తిని మనిషి కొల్పోతున్నాడు. మన జ్ఞాపకశక్తిని మనమే తగ్గించుకుంటున్నామా? అవుననే అంటున్నాయి తాజా అధ్యయనాలు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం రాకతో కంప్యూటర్లు, ఇంటర్నెట్. స్మార్ట్ఫోన్లు అందుబాటులోకి వచ్చాయి. దీంతో మనం మన మెదడుకు పనిపెట్టడం దాదాపు మానేశాము. మనకు తెలిసి మన మెదడులో నిక్షిస్తమైన సమాచారమైనా సరే మనం నెట్బ్రౌజ్ చేసి నిర్ధారించుకుంటున్నాము. సెల్ఫోన్లు అందుబాటులోకి రావడంతో మనకు అత్యంత సన్నిహితుల ఫోన్ నంబర్లను కూడా సెల్లో రికార్డు చేసుకుంటున్నామే తప్ప మన మెదడు పొరల్లో దాచుకోవడం మానేశాము. మనకు కావలసిన వారి బర్త్డేలు, మ్యారేజ్ యానివర్సరీలు వంటివి సెల్ఫోన్ గుర్తు చేయవలసిందే తప్ప మనకు మనంగా గుర్తుపెట్టుకోవడం లేదు.
అంతెందుకు ఏ రోజు కారోజు మనం చేయవలసిన విధులను కూడా సెల్ఫోన్ గుర్తుచేయవలసిందే! ఏ వానకు తడిసో, నీళ్లలో పడో సెల్ఫోన్ పాడైపోయిందంటే ఇక పాత ఫోన్ నెంబర్లన్నీ తుడిచిపెట్టుకుపోయినట్లే. సెల్పైనే ఆధారపడుతూ పోతే కొన్ని రోజులకు మెదడు మొద్దుబారిపోయి మనకు మనంగా గుర్తు పెట్టుకునేది ఏదీ ఉండదేమో! ఈ పరిస్థితి రాకుండా ఉండాలంటే ముందుగా మన మెదడుకు పని కల్పించాల్సి ఉంటుంది. మనకు అత్యంత ఆప్తుల ఫోన్ నెంబర్లను ఒక డైరీలో రాసుకుని మననం చేసుకోవడం వల్ల ఆ నెంబర్లు మన మెదడులో రికార్డయి పోతాయి. ఎన్ని సంవత్సరాలైనా అవి చెరిగిపోవు.
అలాగే ముఖ్యమైన వారి పుట్టినరోజులు, వివాహ వార్షికోత్సవాల వివరాలను ఒక డైరీలో నోట్ చేసుకుని రోజూ ఒకసారి చెక్ చేసుకుంటుంటే అవి ఎప్పుడు వచ్చేది మనకు గుర్తుండిపోతుంది. అలాగే రేపేం చేయాలో ఆలోచించి జ్ఞాపకం పెట్టుకోవడం ఒక సమస్య కానే కాదు. కంప్యూటర్లు, సెల్ఫోన్లు వంటివి లేని రోజుల్లో చురుగ్గా పనిచేసిన మన జ్ఞాపకశక్తి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో మరింత చురుగ్గా మారాలే తప్ప మొద్దుబారిపోకూడదు. అందుకే మన మెదడుకు రోజూ పనికల్పిద్దాం అంటున్నారు వైద్యులు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more