ఎట్టకేలకు కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం కరుణించింది. రాష్ట్ర ప్రభు త్వం ఉద్యోగులకు నూతన సంవత్సర కానుక గా డీఏను ప్రకటించింది. కొంతకాలంగా ప్రభుత్వ ఉద్యోగులు ఎదురు చూస్తున్న కరువుభత్యం (డీఏ) పెంపునకు ముఖ్యమంత్రి కిరణ్కుమార్రెడ్డి ఆమోదం తెలిపారు. 2011 జులై 1వ తేదీ నుండి అమలయ్యే విధంగా 5.992 శాతం మేరకు డీఏను పెంచుతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు కరువు భత్యం 35.952 శాతానికి చేరుతుందని సీఎం కార్యాలయం బుధవారంనాడు విడు దల చేసిన ప్రకటనలో స్పష్టం చేశారు. ఈ పెంపు వల్ల రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెలా రూ. 116.42 కోట్ల చొప్పున, ఏడాదికి 1397 కోట్ల రూపాయలు అదనంగా వెచ్చించాల్సి ఉంటుందని తెలిపారు. డీఏ పెంపుదలపై ఉద్యోగ సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి. డీఏ పెంపు నిర్ణయంలో కొంత ఆలస్యం జరిగినప్పటికీ 5.992 శాతం మేరకు పెంచుతూ ప్రభుత్వం తాజాగా తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామన్నారు. ఈ మేరకు టీఎన్జీవో నాయకులు కె.స్వామిగౌడ్, దేవీప్రసాద్లు ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలియజేశారు. ఇదే విధంగా 42 రోజులపాటు జరిగిన సకల జనుల సమ్మె కాలాన్ని సెలవు కాలంగా మంజూరు చేయాలని వారు ఈ సందర్భంగా కోరారు. అలాగే ఉద్యోగుల హెల్త్కార్డులపై వెంటనే నిర్ణయం తీసుకోవాలని టీఎన్జీవో నేతలు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more