వలవేస్తే చేప పడకపోతే నిరాశ కలుగుతుంది. చేపలు సరిపడా పడితే ఆ రోజు పంటే. అదే, మనుషులను అమాంతం మింగేసే పెద్ద పెద్ద మొసళ్ళు, తిమింగలాలు పడితే, ఏం చెయ్యాలో తెలియని పరిస్థితి. అదే పరిస్థితి అవినీతి నిరోధక శాఖకు ఎదురైంది. మద్యం సిండికేట్ల రహస్యాలను ఛేదించటానికి ఉరకలు వేసిన ఏసిబికి దొరికిన ఆధారాలు ఆ శాఖను నివ్వెరపరుస్తున్నాయి. ఈ సిండికేట్ల వెనకనున్న శాసనసభ్యలు, మంత్రివర్యులు, వారి బంధుగణాల పేర్ల వివరాలతో ఏం చెయ్యాలో దిక్కు తోచని పరిస్థితిలో ఎసిబి శాఖలో అదనపు డిజి భూపతి బాబు, ప్రధాన కార్యదర్శి పంకజ్ త్రివేదీని ఆశ్రయించారు. ఆ వివరాలన్నిటినీ బయటపెడితే ప్రభుత్వం ఇబ్బందుల్లో పడే పరిస్థితి ఉందని ఆయన ప్రధాన కార్యదర్శికి వివరించారు. అవినీతిలో భాగం ఉన్న శాసనసభ్యులమీద కేసులు నమోదు చెయ్యటానికి అవసరమైన న్యాయ సలహాలను తీసుకోగా, ప్రభుత్వం ఇరుకనపడిపోవటం ఖాయమని చెప్తున్నారని, అందువలన మార్గదర్శనం చెయ్యమని ఐజి ప్రధాన కార్యదర్శిని కోరినట్టుగా సమాచారం.
మద్యం సిండికేట్లనుండి వచ్చే ముడుపులు కేవలం అధికార పార్టీ శాసన సభ్యులు, మంత్రులకే ముట్టుతున్నందు వలన, వారి పేర్లను బయటపెట్టటం ఎలాగా అని ఎసిబి సందేహిస్తోంది. వ్యూహాత్మకంగా పలు ప్రాంతాల్లో ఒకేసారి దాడి చేసిన ఎసిబి వలవేసి పట్టుకోవటంలో సఫలీకృతమైనా, ఆ తర్వాత ఏం చెయ్యాలన్నది పాలుపోని పరిస్థితిలో కొట్టుమిట్టాడుతోంది. అదే, రాజకీయ నాయకులు, అధికారులు కాకుండా వేరే వ్యాపారస్తులు ఇందులో ఉండివుంటే పరిస్థితి వేరుగా ఉండేది. ఈ పాటికి కోర్టుకి లాగటం, జైల్లో వెయ్యటం, బెయిల్ మంజూరుకి అభ్యంతరాలు తెలపటం ఉండేది.
ఈ లోపు, సిండికేట్ కార్యాలయాలు అప్రమత్తమయ్యాయి. డోన్ లోని మద్యం సిండికేట్ కార్యాలయం మూసివేసారు. చాలా ప్రాంతాల్లో సిండికేట్ కార్యాలయాలు మూసివేయటం, ఖాతా పుస్తకాలను తారుమారు చెయ్యటం చేస్తున్నారు. అందుకు రాజకీయ నాయకులు, ఎక్సైజ్ అధికారుల నుండి ఒత్తిడిలు రావటమే కారణమని తెలుస్తోంది. ఇది ఎటునుంచి ఎటుపోతుందో ఎవరి మీద వేటుపడుతుందో అని సంబంధిత నాయకులంతా భయం భయంగా ఉన్నారు..
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more