16 మంది కాంగ్రెస్ శాసన సభ్యుల మీదా ఒకేసారి అనర్హత వేటు వేసి, ఒకేసారి ఉప ఎన్నికలకు తెరతీయాలని కాంగ్రెస్ పార్టీ అభిప్రాయపడుతోంది. అందుకు వేదిక సిద్ధం చేసి అభ్యర్థులను కూడా నిర్ణయం చేసినట్లయితే బావుంటుందన్న ఉద్దేశ్యంతో అనర్హత మీద సభాపతి జాప్యం చేస్తున్నట్టుగా సమాచారం. ఈ 16 మందితో పాటు ప్రరాపా కి చెందిన శోభా నాగిరెడ్డి మీద కూడా అనర్హత పడవచ్చు. దానితో 17 చోట్ల ఒకేసారి ఉప ఎన్నికలు జరిగే అవకాశం ఉన్నందువలన అన్ని పార్టీలూ తమ తమ వ్యహాల్లో మునిగితేలుతున్నాయి.
కాంగ్రెస్ పార్టీకి చెందిన 16 మంది శాసన సభ్యుల మీదా పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి నివేదికనిస్తూ, వారంతా అలా పార్టీకి వ్యతిరేకంగా పనిచేయటంలో తమ వైఫల్యమూ ఉందని తెలియజేసారు. శాసన సభ్యులను తమ పార్టీలో ఉంచుకోవటంలో తామే విఫలమయ్యామని రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నుంచి నివేదిక వెళ్ళటం విశేషం. అనర్హతల తీర్పు ఇచ్చేముందు కావలసినంత సమయం తీసుకోవచ్చు. దానికి కాలపరిమితేమీ లేదని అంటున్నారు. వెంటనే ఆ నిర్ణయం తీసుకోవచ్చు, లేదా అభ్యర్థులను పిలిచి వారి వైపు కథనాన్ని కూడా విని నిర్ణయం తీసుకోవచ్చు.
ఈ వెసులుబాటులో, ఎన్నికలకు సిద్దమవాలా వద్దా అన్నది కూడా నిర్ణయించుకుంటే దాన్ని బట్టి ఇతర కార్యక్రమాలుంటాయి. అంటే ఉప ఎన్నికలు జరగటమనేది సభాపతి నిర్ణయం మీద ఆధారపడి ఉంది కానీ, ఆ నిర్ణయం ఉప ఎన్నికలకు వెళ్ళాలా వద్దా, వెళ్తే ఎప్పుడు అన్న విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే నివేదకి మీద కేంద్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయం మీద ఆధారపడి ఉంది. అందువలన దీనిమీద అభ్యర్థులకంటే ఎక్కువ కాంగ్రెస్ పార్టీలోనూ, ఇతర పార్టీల్లోనూ ఎక్కువ ఉత్కంఠ నెలకొనివుంది.
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more