హైదరాబాద్ జూబ్లిహాలులో జరుగుతున్న కలెక్టర్ల సమావేశం సాక్షిగా సీఎం కిరణ్ కుమార్ ఏకంగా తన కేబినెట్ లో ఉన్న మంత్రులను అవమానించారు. ఆ సమావేశంలో కూడా కిరణ్ తన ఆధిపత్యాన్ని పదర్శించి మంత్రులను అవమానించడమే కాకుండా, ఆయన అభాసుపాలయ్యారు. కలెక్టర్ల సమావేశంలో మధ్యాహ్న భోజనం తర్వాత శాంతిభద్రతలపై సమీక్ష పెట్టారు.
సమావేశం నిర్వహణలో కీలకపాత్ర పోషించే మంత్రితో పాటు డీఎల్ రవీంద్రారెడ్డి, వట్టి వసంతకుమార్, మరో ఏడుగురు మంత్రులు ఆ సమావేశానికి వెళ్లారు. వెళ్లేముందు.. ఒక మంత్రి అక్కడే ఉన్న అధికారిని వాకబు చేశారు. "మేం ఈ సమావేశానికి వెళ్లవచ్చా? ప్రొటోకాల్ ఇబ్బంది ఉందా?'' అని ఆరాతీశారు. ఎలాంటి ఇబ్బందిలేదని, రాకూడదన్న నిబంధన లేదని, కుర్చీలు కూడా వేశార ని ఆ అధికారి చెప్పారు. కాసేపటికే చేనేత మంత్రి శంకర్రావు కూడా ఆ సమావేశంలో వెళ్లి కూర్చున్నారు. సమావేశ ఎజెండాను మంత్రులకు అందించారు. మంత్రులు వాటిని చదవడం మొదలుపెట్టారు. ఈలోగా సీఎం కిరణ్ సమావేశ మందిరంలోకి వచ్చారు. మంత్రులను చూస్తూ... " అన్నా! శాంతిభద్రతలు నేను హోం మంత్రే కదా సమీక్షించాల్సింది'' అన్నట్లు సమాచారం. దీంతో మంత్రులు ఒక్కరొక్కరుగా లేచి బయటకు వచ్చారు. శంకర్రావు మాత్రం అప్పటికీ అలాగే కూర్చున్నారు. ఈ విషయాన్ని గమనించిన సీఎం కార్యాలయ అధికారి బినయ్కుమార్ మంత్రి శంకర్రావు దగ్గరికి వెళ్లి.. బయటకు వెళ్లాలని విజ్ఞప్తిచేశారు. నేను వెళ్ళను డీజీపీతో మాట్లాడాలని అక్కడే కూర్చున్నారు. చిరవరికి ఆయననుకూడా బయటికి పంపించారు.ఈ పరిణామంపై ఒకరిద్దరు మంత్రులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. మరి ఈ పరిణామం ఎటూ వైపుకు దారితీస్తుందో చూడాలి.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more