ప్రధానంగా నగరంలోనే కార్పొరేట్ విద్యా సంస్థలకు చెందిన బ్రాంచీలకు పేరుతోపాటు అదనపు ఆకర్షణగా 'ముద్దు' పేర్లను పెడుతున్నారు. 'టెక్నో, ఒలింపియాడ్, స్మార్ట్స్, గ్లోబల్ ఇ - టెక్నో కాన్సెప్ట్, ఐఐటీ వంటి పేర్లతో నగరంలో కోకొల్లలుగా పాఠశాలలు వెలిశాయి. వీటిపై అధికారులు పెద్దగా దృష్టిపెట్టకపోవడంతో ప్రతి ఏటా ఇటువంటి పాఠశాలల సంఖ్య పెరిగిపోతోంది. వీధికొకటి ఇలాంటివి వెలుస్తున్నాయి. ఆపేర్లతో మభ్యపెడుతూ తల్లిదండ్రుల వద్ద నుండి అధికంగా ఫీజులను పిండుకుంటున్నాయి. ఒక్క విజయవాడ నగరంలోనే ఇటువంటివి 144 బ్రాంచీలు ఉన్నాయి. ఇవన్నీ కార్పొరేట్ విద్యా సంస్థలకు చెందినవే. జిల్లావ్యాప్తంగా చూస్తే 250 పాఠశాలలపైగా అదనపు పేర్లతో ఉన్నాయి. ఈవిద్యా సంవత్సరమే ఒక్క విజయవాడ నగరంలోనే 35 బ్రాంచీలను ఆయా కార్పొరేట్ విద్యా సంస్థలు ప్రారంభించనున్నాయి.
ఒక పాఠశాల పేరుతో ప్రభుత్వ గుర్తింపు పొంది ఆ తరువాత ఎటువంటి అనుమతులూ లేకుండా బ్రాంచీలు ఏర్పాటు చేస్తున్నారు. ఆయా పాఠశాలల్లో ఫలితాలెలా ఉన్నా ఇటువంటి అందమైన పేర్లతో విద్యార్థులను, వారి తల్లిదండ్రులను ఆకర్షించి అడ్మిషన్లు జరుపుతున్నాయి. వందల కోట్లు గడిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇటీవల కార్పొరేట్ విద్యా సంస్థల యాజమాన్యాలకు జిల్లా విద్యాశాఖ హెచ్చరికలు జారీ చేసింది. అదనపు పేర్లను వెంటనే తొలగించాలని కోరింది. జూన్ 12వ తేదీలోగా వీటిని తొలగించని ఆయా పాఠశాలల గుర్తింపు రద్దు చేస్తామని హెచ్చరించింది. పాఠశాలలు తెరిచిన తరువాత కూడా ఇటువంటి పేర్లు ఉంటే సంబంధిత ఏరియా, జిల్లా విద్యాశాఖాధికారులపై చర్యలు తీసుకుంటామని పాఠశాల విద్యాశాఖ కూడా తమ సిబ్బందిని హెచ్చరించింది. దీంతో జిల్లా విద్యాశాఖాధికారులు ఇప్పటికే తమ కింద స్థాయి అధికారులకు ఈ సమాచారాన్ని పంపారు. పాఠశాలలకు ఎటువంటి అదనపు పేర్లు ఉండకూడదని 1993 నుండే నిబంధన అమల్లో ఉంది.
దీనికి సంబంధించి జిఓ నెంబరు 90ని కూడా విడుదల చేశారు. అయితే కార్పొ'రేటు' సంస్థలు తమ పలుకుబడితో దీనిని నిర్వీర్యం చేస్తున్నాయి. అయితే విద్యాహక్కు చట్టం అమలులోకి రావడంతో ఇటువంటి నిబంధనలను అమలు చేసేందుకు విద్యా శాఖ కసరత్తు ప్రారంభించింది. ఇక నుండి ఎక్కడైనా ఇటువంటి పేర్లతో పాఠశాలలు కొత్తగా ప్రారంభించినా లేదా ఇప్పటికే ఉన్నా లేదా ప్రారంభించడానికి ప్రయత్నించినా సంబంధిత విద్యాశాఖాధికారులను ప్రభుత్వం వివరణ కోరనుంది. పాఠశాల విద్యాశాఖ నుండి ఉత్తర్వులు రాగానే జిల్లాలో తొలిసారిగా విజయవాడ నగరంలోనే విజయవాడ ఉప విద్యాశాఖాధికారి ఎం.వి.కృష్ణారెడ్డి తన సిబ్బందితో శనివారం సాయంత్రం కొన్ని పాఠశాలలపై దాడులు నిర్వహించారు. టెక్నో, ఒలింపియాడ్ అని పేర్లు ఉన్న పాఠశాలల బోర్డులపై రంగులు వేయించారు.
పాఠశాలలు తెరచేలోగా ఇంకా మిగిలిన పాఠశాలల బోర్డులపై అదనపు పేర్లను తొలగించాలని ఆదేశాలు జారీ చేశారు. అయితే ఇటువంటి దాడులు ఒక్క రోజు మాత్రమే కాకుండా నిరంతరం జరిపితేనే కార్పొరేట్ విద్యా సంస్థల్లో చలనం వస్తుందని పలువురు అంటున్నారు. పలు కార్పొరేట్ విద్యా సంస్థలపై అధికారులు దాడులు చేయడంతో ఉలిక్కిపడిన యాజమాన్యాలు పైరవీలు ప్రారంభించాయి. ఇప్పటికే జిల్లా అధికారులపై ఉన్నతాధికారుల ద్వారా ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అయితే విద్యాశాఖాదికారులు మాత్రం తమకు పూర్తి అధికారులు ఉన్నాయని, సోమవారం కూడా దాడులు జరుగుతాయని ప్రకటించారు. అయితే వీటిని ఆపేందుకు మాత్రం కార్పొరేట్ సంస్థలు శతవిధాలా ప్రయత్నిస్తున్నాయి.
(And get your daily news straight to your inbox)
Dec 26 | విజయవాడ దివంగత మాజీ ఎమ్మెల్యే వంగవీటి రంగా 25వ వర్థంతి నగరంలో ఘనంగా జరిగింది. ఈయన వర్ధంతి సందర్భంగా ఆయన కుమారుడు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు అయిన వంగవీటి రాధ ఆయన విగ్రహానికి... Read more
Dec 18 | పార్టీలను బలోపేతం చేసుకోవడంలో తలమునకలుకావాల్సిన పార్టీలు విభజన, సమైక్య పోరులో మునిగి పోయాయి..ప్రజలను ఎన్నికల మూడ్లోకి తేవాల్సి ఉన్నప్పటికీ ఆ విధంగా చేసే పరిస్థితి కనిపించడంలేదు.. ఫలితంగా ప్రధాన రాజకీయ పార్టీలు మల్ల గుల్లాలు... Read more
Dec 17 | మున్సిపల్ కార్మికులు.. జిల్లాలోని పలు ప్రాంతాల్లో వీధులను శుభ్ర పరుస్తూ కష్టం చేస్తుంటారు.. వీరి కష్టానికి తగిన వేతనం మాత్రం అధికారులు ఇవ్వడం లేదు..తమకు వేతనాలివ్వలని కోరుతున్నా అధికారులు స్పందించడం లేదని కార్మికులు పేర్కొంటున్నారు.వేతనాలివ్వాలని... Read more
Dec 07 | ఆంధ్ర ప్రదేశ్ విభజనకు నిర్ణయం తీసుకున్నందుకు కాంగ్రెస్ పార్టీ కూర్చున్న కొమ్మనే నరుక్కుంటోందని పార్టీ కేంద్ర నాయకత్వంపై కిరణ్ కుమార్ విరుచుకుపడ్డారు. విజయవాడలో ఈరోజు సాయంత్రం జరిగిన పులిచింతల ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న కిరణ్... Read more
Dec 06 | రాష్ట్ర విభజనపై కేంద్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయాన్ని నిరసిస్తూ నేడు సీమాంధ్ర జిల్లాల బంద్కు ఏపీఎన్జీవోలు పిలుపునిచ్చారు. ఈ మేరకు విజయవాడలోని ఏపీఎన్జీవోల భవన్లో రాత్రి ఏర్పాటు చేసిన సమావేశంలో అశోక్బాబు మాట్లాడారు. సీమాంధ్ర... Read more