ఈ ఆర్థిక (2012-13)సంవంత్సరం జిల్లాలోని మందు బాబులు ఏకంగా వెయ్యికోట్ల రూపాయలకు మద్యాన్ని తాగేశారు. 'ఆంధ్రజ్యోతి' వివరాలను సేకరించింది. రాష్ట్రంలోనే మద్యం అమ్మకాలు ఎక్కువగా జరిగిన జిల్లాలో మన కృష్ణా జిల్లా ముందు వరుసలో ఉంది. జిల్లాకు చెందిన ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ నివేదికను ఇటీవలే ప్రభుత్వానికి పంపింది.జిల్లాలో మొత్తం 309 మద్యం దుకాణాలు, 168 బార్ అండ్ రెస్టారెంట్లు ఉన్నాయి. ప్రత్యేకంగా విజయవాడ నగరంలో 47 మద్యం దుకాణాలు, 127 బార్ అండ్ రెస్టారెంట్లు ఉన్నాయి. 2011-12 ఆర్థిక సంవత్సరంలో రూ.743.30 కోట్ల ప్రభుత్వానికి జిల్లా నుంచి ఆదాయం వచ్చింది. 2012-13లో ఈ ఏడాది 2012 ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి 2013 మార్చి నెలాఖరు నాటికి జిల్లా వ్యాప్తంగా 28 లక్షల 78 వేల 469 ఐఎంఎల్ మద్యం కేసుల అమ్మకాలు జరిగాయి. ఇదే సమయంలో 14 లక్షల 61 వేల 303 బీరు కేసులు అమ్ముడయ్యాయి. వీటి విలువ రూ.949.78 కోట్లు ఉంటుంది.అన్ని బ్రాండ్లకు పెరిగిన గిరాకీ 2011-12 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ప్రతి ఏటా అన్ని రకాల మద్యం బ్రాండ్లకు గిరాకీ పెరుగుతూనే ఉంది. 2011-12 ఆర్థిక సంవత్సరం కంటే 2012-13 ఆర్థిక సంవత్సరంలో ఐఎంఎల్ రకం మద్యం అమ్మకాలు సుమారు 17.09 శాతం పెరిగాయి. అలాగే బీరు కేసుల అమ్మకాలు సుమారు 34.40 శాతం పెరిగింది. మొత్తం మీద రెండు రకాల మద్యం అమ్మకాలు 2011-12 నుంచి 2012-13 ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి 27.78 శాతం మేర పెరిగిందని జిల్లా అధికారులు నుంచి ప్రభుత్వానికి నివేదిక పంపారు.
(And get your daily news straight to your inbox)
Dec 26 | విజయవాడ దివంగత మాజీ ఎమ్మెల్యే వంగవీటి రంగా 25వ వర్థంతి నగరంలో ఘనంగా జరిగింది. ఈయన వర్ధంతి సందర్భంగా ఆయన కుమారుడు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు అయిన వంగవీటి రాధ ఆయన విగ్రహానికి... Read more
Dec 18 | పార్టీలను బలోపేతం చేసుకోవడంలో తలమునకలుకావాల్సిన పార్టీలు విభజన, సమైక్య పోరులో మునిగి పోయాయి..ప్రజలను ఎన్నికల మూడ్లోకి తేవాల్సి ఉన్నప్పటికీ ఆ విధంగా చేసే పరిస్థితి కనిపించడంలేదు.. ఫలితంగా ప్రధాన రాజకీయ పార్టీలు మల్ల గుల్లాలు... Read more
Dec 17 | మున్సిపల్ కార్మికులు.. జిల్లాలోని పలు ప్రాంతాల్లో వీధులను శుభ్ర పరుస్తూ కష్టం చేస్తుంటారు.. వీరి కష్టానికి తగిన వేతనం మాత్రం అధికారులు ఇవ్వడం లేదు..తమకు వేతనాలివ్వలని కోరుతున్నా అధికారులు స్పందించడం లేదని కార్మికులు పేర్కొంటున్నారు.వేతనాలివ్వాలని... Read more
Dec 07 | ఆంధ్ర ప్రదేశ్ విభజనకు నిర్ణయం తీసుకున్నందుకు కాంగ్రెస్ పార్టీ కూర్చున్న కొమ్మనే నరుక్కుంటోందని పార్టీ కేంద్ర నాయకత్వంపై కిరణ్ కుమార్ విరుచుకుపడ్డారు. విజయవాడలో ఈరోజు సాయంత్రం జరిగిన పులిచింతల ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న కిరణ్... Read more
Dec 06 | రాష్ట్ర విభజనపై కేంద్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయాన్ని నిరసిస్తూ నేడు సీమాంధ్ర జిల్లాల బంద్కు ఏపీఎన్జీవోలు పిలుపునిచ్చారు. ఈ మేరకు విజయవాడలోని ఏపీఎన్జీవోల భవన్లో రాత్రి ఏర్పాటు చేసిన సమావేశంలో అశోక్బాబు మాట్లాడారు. సీమాంధ్ర... Read more