Poor voter turnout for mlc elections

mlc elections at vijayawada, mlc election. graduate, constituency in krishna and guntur districts,

Poor voter turnout for MLC elections.The polling for Krishna-Guntur districts Graduates constituency MLC elections concluded peacefully on Thursday. The polling percentage stands at 45.53 per cent

Poor-voter.gif

Posted: 02/22/2013 01:09 PM IST
Poor voter turnout for mlc elections

Poor voter turnout for MLC elections

పట్టభద్రుల నియోజకవర్గానికి జరిగిన ఎన్నిక పట్ల ఓటర్లు అనాసక్తి ప్రదర్శించారు. కృష్ణా, గుంటూరు జిల్లాల్లోని అన్ని పోలింగ్ కేంద్రాలలో ఇదే పరిస్థితి ఉంది. 2,19,000 ఓటర్లకుగాను కేవలం 1,00,070 మంది ఓటర్లు మాత్రమే తమ ఓటు హక్కు వినియోగించుకోవడంతో ఫలితం సందిగ్ధంగా మారింది. తెలుగుదేశం పార్టీ అభిమానులు తమ అభ్యర్థి చిగురుపాటి వరప్రసాద్ మెజారిటీ తగ్గినా గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేస్తున్నారు. పోలింగ్ సరళిని బట్టి కృష్ణాజిల్లాలో చిగురుపాటికి సీపీఎం బలపరిచిన బొడ్డు నాగేశ్వరరావు గట్టిపోటీ ఇచ్చారని తెలుస్తోంది. ఉపాధ్యాయ వర్గాల నుంచి నాగేశ్వరరావుకు ఎక్కువగా ఓట్లు పడ్డాయి.  పట్టణాలతో పోలిస్తే గ్రామీణ ప్రాంతాలు ఎక్కువగా ఉన్న డివిజన్లలో ఓటింగ్ శాతం మెరుగ్గా ఉంది. నూజివీడు డివిజన్‌లో అత్యధికంగా 54.59 శాతం నమోదు కాగా, అత్యల్ప ఓటింగ్ విజయవాడలో నమోదు అయింది. ఎమ్మెల్సీ ఎన్నికలలో ఎవరు గెలిస్తే ఏమిటిలే అన్న భావనతో ఓటర్లు పోలింగ్‌కు దూరంగా ఉన్నట్టు కనిపిస్తోంది.

Poor voter turnout for MLC elections

సిట్టింగ్ అభ్యర్థి అయిన చిగురుపాటి అభిమానులు గత ఎన్నికలలో పనిచేసినంత హుషారుగా ఈసారి చేయలేదు. ఆ ఎన్నికలలో దాదాపు ప్రతి ఓటరును వ్యక్తిగతంగానో, ఫోన్ మెసేజ్ రూపంలోనో పలకరించి ఓట్ల కోసం అభ్యర్థించారు.గెలుపు మనకేనన్న ధీమాతోనో, మరో కారణంవల్లనో ఉదాసీనంగా పనిచేశారు. గత ఎన్నికలలో కనబడిన అంకితభావం, పట్టుదల ఈసారి వారి ప్రచారంలో లేవు. టీడీపీ అభిమానులలో చాలామంది ఓటింగ్‌కు వెళ్ళపోకవడానికి ఇదొక కారణం. బొడ్డు నాగేశ్వరరావు గెలుపు కోసం సీపీఎం అనుబంధ సంస్థలు, ఉపాధ్యాయ సంఘాలు చాపకింద నీరులా పనిచేశాయి. దీంతో గెలుపు ఓటములపై స్పష్టత కనిపించడం లేదు. పోలింగ్ శాతం తగ్గడంతో రాజకీయ పరిశీలకులు కూడా ఖచ్చితమైన అంచనాలకు రాలేకపోతున్నారు. మొత్తం 19 మంది అభ్యర్థులు రేస్‌లో ఉన్నప్పటికీ పోటీ ఇద్దరి మధ్యే అన్నది సుస్పష్టం. గత ఎన్నికలలో చిగురుపాటి, డాక్టర్ సమరంపై పెద్ద తేడాతో గెలిచారు. ఈసారి వామపక్షాలు, బీజేపీ రంగంలో ఉండడంతో ఫలితం ఎలా ఉండబోతోందన్నది ఎవరూ చెప్పలేకపోతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Samineni udayabhanu
Mlc elections at vijayawada  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Vangaveeti radha get emotional at vijayawada

    ఘనంగా వంగవీటి రంగ వర్థంతి

    Dec 26 | విజయవాడ దివంగత మాజీ ఎమ్మెల్యే వంగవీటి రంగా 25వ వర్థంతి నగరంలో ఘనంగా జరిగింది. ఈయన వర్ధంతి సందర్భంగా ఆయన కుమారుడు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు అయిన వంగవీటి రాధ ఆయన విగ్రహానికి... Read more

  • Who is the samaikyandhra hero

    వీరిలో సమైక్య హీరో ఎవరు ?

    Dec 18 | పార్టీలను బలోపేతం చేసుకోవడంలో తలమునకలుకావాల్సిన పార్టీలు విభజన, సమైక్య పోరులో మునిగి పోయాయి..ప్రజలను ఎన్నికల మూడ్‌లోకి తేవాల్సి ఉన్నప్పటికీ ఆ విధంగా చేసే పరిస్థితి కనిపించడంలేదు.. ఫలితంగా ప్రధాన రాజకీయ పార్టీలు మల్ల గుల్లాలు... Read more

  • Vijayawada municipality fails to pay employees their salaries

    ప్రతి జిల్లాకో మెడికల్ కాలేజీ-వేతనాలివ్వండి మహాప్రభో.

    Dec 17 | మున్సిపల్ కార్మికులు.. జిల్లాలోని పలు ప్రాంతాల్లో వీధులను శుభ్ర పరుస్తూ కష్టం చేస్తుంటారు.. వీరి కష్టానికి తగిన వేతనం మాత్రం అధికారులు ఇవ్వడం లేదు..తమకు వేతనాలివ్వలని కోరుతున్నా అధికారులు స్పందించడం లేదని కార్మికులు పేర్కొంటున్నారు.వేతనాలివ్వాలని... Read more

  • Cm kiran fire on congress high command

    ఒక్కసారి చదువుకోండి:సిఎం కిరణ్

    Dec 07 | ఆంధ్ర ప్రదేశ్ విభజనకు నిర్ణయం తీసుకున్నందుకు కాంగ్రెస్ పార్టీ కూర్చున్న కొమ్మనే నరుక్కుంటోందని పార్టీ కేంద్ర నాయకత్వంపై కిరణ్ కుమార్ విరుచుకుపడ్డారు. విజయవాడలో ఈరోజు సాయంత్రం జరిగిన పులిచింతల ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న కిరణ్... Read more

  • Ashok babu fire on seemandhra leaders

    చేతకానితనం వల్లే ఇలా జరిగింది?

    Dec 06 | రాష్ట్ర విభజనపై కేంద్ర కేబినెట్‌ తీసుకున్న నిర్ణయాన్ని నిరసిస్తూ నేడు సీమాంధ్ర జిల్లాల బంద్‌కు ఏపీఎన్‌జీవోలు పిలుపునిచ్చారు. ఈ మేరకు విజయవాడలోని ఏపీఎన్‌జీవోల భవన్‌లో రాత్రి ఏర్పాటు చేసిన సమావేశంలో అశోక్‌బాబు మాట్లాడారు. సీమాంధ్ర... Read more