విజయవాడ దుర్గాపురంలోని ఘంటసాల వెంకటేశ్వరరావు ప్రభుత్వ సంగీత నృత్య కళాశాల ఆవరణలో గంధర్వ గాయకుడు ఘంటసాల విగ్రహాన్ని బహు భాషా గాయకుడు పిబి శ్రీనివాస్ ఆవిష్కరించారు. ఘంటసాల కుమార్తె మద్దూరి శ్యామల జ్యోతి ప్రజ్వలనతో సభ ప్రారంభమైంది. విశిష్ట అతిథిగా పాల్గొన్న ప్రముఖ సినీ దర్శకులు విశ్వనాథ్ మాట్లాడుతూ రవీంద్రుని విగ్రహంతో నెలకొని వున్న శాంతినికేతన్ లా, ఘంటసాల పేరుతో ఉన్న ఈ కళాశాల ప్రాంగణం ప్రశాంతతకు నిలయంగా ఉందని, తంబూర వాయిస్తున్న ఘంటసాల విగ్రహం ఎంతో నిండుదనాన్ని తెచ్చిందన్నారు. అంతేకాదు, దేవాలయ నిర్మాణం తర్వాత దేవతామూర్తుల విగ్రహ ప్రతిష్ట ఎంతటి శోభ సమకూర్చుతుందో సంగీత కళాశాలలో ఘంటసాల విగ్రహం తర్వాత అంతటి వెలుగొచ్చిందని ప్రముఖ సినీ దర్శకులు కాశీనాధుని విశ్వనాథ్ అన్నారు.
విగ్రహావిష్కర్త పీబీ శ్రీనివాస్ మాట్లాడుతూ అశేష ప్రజానీకాన్ని ఆకర్షించిన చిత్రాలను నిర్మించిన విశ్వనాథ్ దర్శకత్వంలో తాను పాడలేకపోయాననే బాధ చెల్లెలి కాపురం చిత్రంతో తీరిందన్నారు. ‘భలే మంచిరోజు’ పాట ఈ సందర్భానికి సరిగ్గా వర్తిస్తుందని అన్నారు. ఘంటసాల విగ్రహ ప్రదాత, ప్రముఖ పారిశ్రామికవేత్త కోగంటి సత్యనారాయణ స్వాగత వచనాలు పలికారు.
విగ్రహావిష్కరణకు మంత్రి కొలుసు పార్థసారథి హాజరయ్యారు. ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, వెలంపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్సీ ఐలాపురం వెంకయ్య, ప్రముఖ పారిశ్రామికవేత్త గోకరాజు గంగరాజు, సంగీత కళాశాల ప్రిన్సిపల్ కేఎస్ గోవిందరాజన్, ట్రేడ్ యూనియన్ నాయకులు జనక్ప్రసాద్ తదితరులు పాల్గొనగా, పద్మశ్రీ తుర్లపాటి కుటుంబరావు సభాధ్యక్షత వహించారు. కార్యక్రమాన్ని సుమధుర కళానికేతన్ వారు నిర్వహించారు.
ఇక, ఘంటసాల వెంకటేశ్వరరావు 90వ జయంతి సందర్భంగా జరిగిన రాష్ట్రస్థాయి ఘంటసాల పాటల పోటీల్లో విజేతలుగా కే విష్ణుప్రియ (ప్రథమ), కె పాత్రో (ద్వితీయ), షణ్ముఖి (తృతీయ) బహుమతిని పొందగా, పది కన్సొలేషన్ బహుమతులను కే విశ్వనాథ్ చేతులమీదుగా అందించారు.
...avnk
(And get your daily news straight to your inbox)
Dec 26 | విజయవాడ దివంగత మాజీ ఎమ్మెల్యే వంగవీటి రంగా 25వ వర్థంతి నగరంలో ఘనంగా జరిగింది. ఈయన వర్ధంతి సందర్భంగా ఆయన కుమారుడు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు అయిన వంగవీటి రాధ ఆయన విగ్రహానికి... Read more
Dec 18 | పార్టీలను బలోపేతం చేసుకోవడంలో తలమునకలుకావాల్సిన పార్టీలు విభజన, సమైక్య పోరులో మునిగి పోయాయి..ప్రజలను ఎన్నికల మూడ్లోకి తేవాల్సి ఉన్నప్పటికీ ఆ విధంగా చేసే పరిస్థితి కనిపించడంలేదు.. ఫలితంగా ప్రధాన రాజకీయ పార్టీలు మల్ల గుల్లాలు... Read more
Dec 17 | మున్సిపల్ కార్మికులు.. జిల్లాలోని పలు ప్రాంతాల్లో వీధులను శుభ్ర పరుస్తూ కష్టం చేస్తుంటారు.. వీరి కష్టానికి తగిన వేతనం మాత్రం అధికారులు ఇవ్వడం లేదు..తమకు వేతనాలివ్వలని కోరుతున్నా అధికారులు స్పందించడం లేదని కార్మికులు పేర్కొంటున్నారు.వేతనాలివ్వాలని... Read more
Dec 07 | ఆంధ్ర ప్రదేశ్ విభజనకు నిర్ణయం తీసుకున్నందుకు కాంగ్రెస్ పార్టీ కూర్చున్న కొమ్మనే నరుక్కుంటోందని పార్టీ కేంద్ర నాయకత్వంపై కిరణ్ కుమార్ విరుచుకుపడ్డారు. విజయవాడలో ఈరోజు సాయంత్రం జరిగిన పులిచింతల ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న కిరణ్... Read more
Dec 06 | రాష్ట్ర విభజనపై కేంద్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయాన్ని నిరసిస్తూ నేడు సీమాంధ్ర జిల్లాల బంద్కు ఏపీఎన్జీవోలు పిలుపునిచ్చారు. ఈ మేరకు విజయవాడలోని ఏపీఎన్జీవోల భవన్లో రాత్రి ఏర్పాటు చేసిన సమావేశంలో అశోక్బాబు మాట్లాడారు. సీమాంధ్ర... Read more