కార్తీకమాసం కావడంతో క్రుష్ణాజిల్లా కొండపల్లి ఖిల్లా, ఫెర్రీలు కిటకిటలాడుతున్నాయి. వివిధ ప్రాంతాలకు చెందిన ఉద్యోగ సంఘాలు, కుల సంఘాలు, విద్యా సంస్థలకు చెందిన విద్యార్థులు వనబోజన కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. మూడు, నాల్గు ఆదివారాలల్లో సందర్శకుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.
అయితేచ పర్యాటక కేంద్రమైన ఖిల్లాపై కనీసం మంచినీటి వసతి కూడా లేకపోవడంతో పర్యాటకులు ఇబ్బందులు పడుతున్నారు. కొండపైకి బస్ సౌకర్యం కల్పించాలని ఏళ్ల తరబడి ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నా ఆర్టీసీ అధికారులు స్పందించడం లేదు. దీంతో సొంత వాహనాలు లేనివారు కాలి నడకన కొండపైకి వచ్చేందుకు నానా తంటాలు పడాల్సి వస్తోంది.
ఇబ్రహీంపట్నం ఫెర్రిలో కూడా సరైన వసతులు లేక పర్యాటకులు ఇబ్బందులు పడుతున్నారు. కనీసం స్వచ్ఛంద సంస్థలైనా స్పందించి పర్యాటక ప్రాంతాల్లో మంచినీటి సౌకర్యాలు కల్పించాలని పలువురు కోరుతున్నారు. కాగా ఫెర్రిలో వాసవీ సేవా సమితి ఆధ్వర్యంలో జరిగిన వన సమారాధనలో ఎన్టీటీపీఎస్ ఉద్యోగులు పాల్గొన్నారు.
మరోపక్క కొండపల్లి ఖిల్లాపై అసాంఘిక కార్యకలాపాలు జరుగుతుంటే కనీసం ఇటువంటి సమయాల్లో కూడా పోలీసు నిఘా లేకపోవడంపై పర్యాటకులు ఇబ్బందులు పడుతున్నారు. ఖిల్లాకు యువతులను తీసుకువచ్చే యువకులపై వచ్చే యువతీ యువకులపై కొందరు పోకరీలు దాడులు చేసి వారి నుంచి నగదు, నగలు తీసుకుపోవడం సంఘటనలు జరుగుతున్నాయి. అక్కడక్కడా జూద కార్యకలాపాలు కూడా జరుగుతున్నట్లు తెలిసింది. ఖిల్లా సందర్శనకు వచ్చే వారిలో కొందరు మద్యం సేవించి మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తునట్లు కూడా ఫిర్యాదులు కూడా వస్తున్నాయి. ఖిల్లా, ఫెర్రి ప్రాంతాల్లో మప్టీలో పోలీసు బృందాలను నియమించాలని పర్యాటకులు కోరుతున్నారు.
...avnk
(And get your daily news straight to your inbox)
Dec 26 | విజయవాడ దివంగత మాజీ ఎమ్మెల్యే వంగవీటి రంగా 25వ వర్థంతి నగరంలో ఘనంగా జరిగింది. ఈయన వర్ధంతి సందర్భంగా ఆయన కుమారుడు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు అయిన వంగవీటి రాధ ఆయన విగ్రహానికి... Read more
Dec 18 | పార్టీలను బలోపేతం చేసుకోవడంలో తలమునకలుకావాల్సిన పార్టీలు విభజన, సమైక్య పోరులో మునిగి పోయాయి..ప్రజలను ఎన్నికల మూడ్లోకి తేవాల్సి ఉన్నప్పటికీ ఆ విధంగా చేసే పరిస్థితి కనిపించడంలేదు.. ఫలితంగా ప్రధాన రాజకీయ పార్టీలు మల్ల గుల్లాలు... Read more
Dec 17 | మున్సిపల్ కార్మికులు.. జిల్లాలోని పలు ప్రాంతాల్లో వీధులను శుభ్ర పరుస్తూ కష్టం చేస్తుంటారు.. వీరి కష్టానికి తగిన వేతనం మాత్రం అధికారులు ఇవ్వడం లేదు..తమకు వేతనాలివ్వలని కోరుతున్నా అధికారులు స్పందించడం లేదని కార్మికులు పేర్కొంటున్నారు.వేతనాలివ్వాలని... Read more
Dec 07 | ఆంధ్ర ప్రదేశ్ విభజనకు నిర్ణయం తీసుకున్నందుకు కాంగ్రెస్ పార్టీ కూర్చున్న కొమ్మనే నరుక్కుంటోందని పార్టీ కేంద్ర నాయకత్వంపై కిరణ్ కుమార్ విరుచుకుపడ్డారు. విజయవాడలో ఈరోజు సాయంత్రం జరిగిన పులిచింతల ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న కిరణ్... Read more
Dec 06 | రాష్ట్ర విభజనపై కేంద్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయాన్ని నిరసిస్తూ నేడు సీమాంధ్ర జిల్లాల బంద్కు ఏపీఎన్జీవోలు పిలుపునిచ్చారు. ఈ మేరకు విజయవాడలోని ఏపీఎన్జీవోల భవన్లో రాత్రి ఏర్పాటు చేసిన సమావేశంలో అశోక్బాబు మాట్లాడారు. సీమాంధ్ర... Read more