రచ్చబండ గ్రామసభల్లో సమైక్యవాదుల ఆందోళనలు కొనసాగుతూనే వున్నాయి. ఈరోజు వెదురుకుప్పంలో నిర్వహించిన రచ్చబండ కార్యక్రమం వైసీపీ శ్రేణుల ఆగ్రహంతో రచ్చరచ్చగా మారింది. సమైక్యాంధ్ర ఉద్యమం తగ్గిందని వేదికపై నుంచి కాంగ్రెస్ నాయకుడొకరు చేసిన ప్రసంగాన్ని సాకుగా తీసుకొని వైసీపీ నాయకులు విరుచుకుపడ్డారు. సభా వేదిక కోసం ఏర్పాటు చేసిన షామియానాను పీకి పడేశారు. వేదికపైకి కుర్చీలు విసిరి కొట్టారు. అడ్డు వచ్చిన పోలీసులను నెట్టిపడేశారు.
వైసీపీ శ్రేణుల ఆగ్రహానికి హడలిపోయిన మహిళలు భయంతో పరుగులు తీశారు. రచ్చబండ కార్యక్రమంలో ఇలాంటి సమస్యలు తలెత్తకుండా సీఎం సోదరుడు కిషోర్కుమార్రెడ్డి తెలివిగా వ్యవహరించారు. పీలేరు నియోజకవర్గ పరిధిలోని వాల్మీకిపురం,గుర్రంకొండ రచ్చబండ వేదికలపై నుంచి ఆయన సమైక్యాంధ్ర నినాదాలు చేసి ప్రజలను శాంతింపజేసి సభలను మొదలు పెట్టారు. రొంపిచర్ల రచ్చబండ కార్యక్రమాన్ని ఆ మండలానికి చెందిన వైసీపీ సర్పంచులు బహిష్కరించడంతో ఇద్దరు తెలుగుదేశం సర్పంచ్లతో మొక్కుబడిగా సభను ముగించారు.
గంగాధర నెల్లూరు ఎమ్మెల్యే కుతూహలమ్మ అధ్యక్షతన వెదురుకుప్పంలో ఈరోజు మధ్యాహ్నం జరిగిన రచ్చబండ కార్యక్రమం పథకం ప్రకారం రణరంగంగా మారింది. ఈ కార్యక్రమాన్ని అడ్డుకోవాలనే ధ్యేయంతో వైసీపీ శ్రేణులు అక్కడికి చేరుకోగా గమనించిన పోలీసులు వారిని వేదికకు దూరంగా నిలువరించారు. ఎమ్మెల్యే జోక్యం చేసుకొని వారిని సభ వద్దకు అనుమతించండని పోలీసులకు సూచించడంతో వైసీపీ శ్రేణులు వేదిక వద్దకు చేరుకున్నాయి. సభనుద్దేశించి పీఏసీఎస్ డైరెక్టర్, కాంగ్రెస్ నాయకుడు భీమ శంకర్రెడ్డి మాట్లాడిన మాటలతో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.సమైక్య ఉద్యమ తీవ్రత చల్లబడింది అనడంతో వైసీపీ శ్రేణులు రెచ్చిపోయాయి. సమైక్య నినాదాలు చేస్తూ వేదికపైకి దూసుకొచ్చిన కార్యకర్తలు షామియానాను పీకేశారు. వేదికపైకి కుర్చీలు విసిరారు. అడ్డుకోవడానికి ప్రయత్నించిన పోలీసులతో తోపులాటకు దిగారు.
(And get your daily news straight to your inbox)
Apr 02 | టాలీవుడ్ లో సరికొత్త కథలకు, సరిగ్గా సరిగ్గాసరిపోయే హీరోగా ప్రభాస్ ముందు వరుసలో ఉంటాడు. ... Read more
Dec 26 | మరి కొన్ని రోజుల్లో కొత్త సంవత్సరం రాబోతుంది. ఆ రోజు కలియుగ దైవం అయిన ఏడుకొండల వాడిని దర్శించుకోవడానికి వచ్చే భక్తులకు టీటీడీ కండీషన్లు పెట్టింది. కొత్త సంవత్సరం రోజున తిరుమల శ్రీనివాసుని దర్శించుకునేందుకు... Read more
Dec 17 | ప్రపంచ ప్రసిద్ధి పొందిన తిరుమలేశుని లడ్డూ ప్రసాదంలో ఇనుప నట్టు ప్రత్యక్షం కావడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. కడప జిల్లా చక్రాయపేట మండలానికి చెందిన ఉపాధ్యాయుడు రామచంద్ర గండి క్షేత్రంలో ఈ లడ్డును కొనుగోలు చేశారు.... Read more
Dec 12 | పుట్టిన ఊరు, ఓటేసిన ఓటరు తీర్పునకు అనుకూలంగా నడుచుకునే వారు ఒకరైతే.. ఓటరు గీటరు నైజాన్తా.. అధిష్టానానికే మా ఓటు అని మరో ఎంపి చింతమోహన్. రాష్ట్ర విభజనపై కేంద్ర కేబినెట్ నిర్ణయంతో ప్రభుత్వం... Read more
Dec 07 | తిరుచానూరు పద్మావతి అమ్మవారి కార్తీకబ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈరోజు ఉదయం అమ్మవారి సారె ఊరేగింపు ఘనంగా జరుగింది. పెద్ద సంఖ్యలో భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తిరుపతి నుంచి అమ్మవారి సారె వెంబడి ఓ గరుడ... Read more