తెలంగాణ నోట్ వ్యతిరేకంగా.. సీమాంద్రలో..ఉద్యమం ఉవ్వెత్తున్న ఎగిసిపడింది. సీమాంద్ర బంద్ దెబ్బ తిరుపతి పై బాగా చూపించింది. తిరుపతి ఎంపీ చింతామోహన్ ఇంటికి కరెంట్ కట్ చేశారు. రాష్ట్ర విభజనకు నిరసనగా చింతామోహన్ రాజీనామా చేయాలని విద్యుత్ ఉద్యోగులు డిమాండ్ చేశారు. ఆయన నివాసానికి విద్యుత్ శాఖ సిబ్బంది విద్యుత సరఫరాను నిలిపివేశారు. రూ. 3.50 లక్షల రూపాయలు బకాయిలు పడ్డారని అందుకే కరెంటు కట్ చేశామని విద్యుత్ సిబ్బంది పేర్కొంటున్నారు.
ఇబ్బందుల్లో భక్తులు..
శ్రీవారికి సమైక్య సెగ తాకింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కేంద్రం కెబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడాన్ని నిరసిస్తూ బంద్ పాటిస్తున్నారు. దీనితో తిరుపతి నుండి తిరుమలకు వెళ్లే బస్సులు నిలిచిపోయాయి. తిరుగుతున్న పలు బస్సులను సమైక్యవాదులు అడ్డుకుని టైర్లలో నుండి గాలిని తీసేశారు. దీనివల్ల కొండపైనే సుమారు 40వేల మంది భక్తులు పడిగాపులు పడుతున్నారు. గమ్యస్థానాలకు ఎలా వెళ్లాలో అర్థం కావడం లేదని భక్తులు ఆందోళన చెందుతున్నారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయలేక టిటిడి చేతులేత్తిసింది. తిరుపతిలోని పలు కూడళ్లలో ఉన్న నేతల ఫ్లెక్సీలను సమైక్యవాదులు చించేశారు.
తిరుపతి అలిపిరి వద్ద భారీగా సమైక్యవాదులు చేరుకుని ఆందోళన చేస్తున్నారు. రెవెన్యూ శాఖకు చెందిన ఉద్యోగులు, ఎపిఎన్జిఓలు, వివిధ పార్టీలకు చెందిన నేతలు అలిపిరి వద్ద బైఠాయించారు. దీనితో వాహనాలు ఎక్కడికక్కడనే నిలిచిపోయాయి. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని మాజీ ఎమ్మెల్యే వెంకటరమణ డిమాండ్ చేశారు. మొత్తం 48గంటల పాటు బంద్ పాటిస్తున్నట్లు సమైక్యవాదులు పేర్కొన్నారు. వాహనాలు లేకపోవడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రాష్ట్రం సమైక్యంగా ఉంచే వరకు తాము పోరాడుతామని సమైక్యవాదులు స్పష్టం చేస్తున్నారు. మంత్రలు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
దిగ్భందం
జిల్లాలో సమైక్యాంధ్రకు మద్దతుగా ఆందోళనలు ఉధృతమవుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా జాతీయ రహదారులను సమైక్యవాదులు దిగ్భందించారు. తిరుపతిలో శంకరంబాడి కూడలి వద్ద రహదారిని దిగ్భందించి వాహనాలను అడ్డుకున్నారు. దీంతో తిరుమలకు వెళ్లే ఆర్టీసీ బస్సులతో పాటు ప్రైవేటు వాహనాలు కూడా నిలిచిపోయాయి.
(And get your daily news straight to your inbox)
Apr 02 | టాలీవుడ్ లో సరికొత్త కథలకు, సరిగ్గా సరిగ్గాసరిపోయే హీరోగా ప్రభాస్ ముందు వరుసలో ఉంటాడు. ... Read more
Dec 26 | మరి కొన్ని రోజుల్లో కొత్త సంవత్సరం రాబోతుంది. ఆ రోజు కలియుగ దైవం అయిన ఏడుకొండల వాడిని దర్శించుకోవడానికి వచ్చే భక్తులకు టీటీడీ కండీషన్లు పెట్టింది. కొత్త సంవత్సరం రోజున తిరుమల శ్రీనివాసుని దర్శించుకునేందుకు... Read more
Dec 17 | ప్రపంచ ప్రసిద్ధి పొందిన తిరుమలేశుని లడ్డూ ప్రసాదంలో ఇనుప నట్టు ప్రత్యక్షం కావడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. కడప జిల్లా చక్రాయపేట మండలానికి చెందిన ఉపాధ్యాయుడు రామచంద్ర గండి క్షేత్రంలో ఈ లడ్డును కొనుగోలు చేశారు.... Read more
Dec 12 | పుట్టిన ఊరు, ఓటేసిన ఓటరు తీర్పునకు అనుకూలంగా నడుచుకునే వారు ఒకరైతే.. ఓటరు గీటరు నైజాన్తా.. అధిష్టానానికే మా ఓటు అని మరో ఎంపి చింతమోహన్. రాష్ట్ర విభజనపై కేంద్ర కేబినెట్ నిర్ణయంతో ప్రభుత్వం... Read more
Dec 07 | తిరుచానూరు పద్మావతి అమ్మవారి కార్తీకబ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈరోజు ఉదయం అమ్మవారి సారె ఊరేగింపు ఘనంగా జరుగింది. పెద్ద సంఖ్యలో భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తిరుపతి నుంచి అమ్మవారి సారె వెంబడి ఓ గరుడ... Read more