Terrorists target tirumala

Terrorists Target Tirumala, Terrorist by using Fakruddin Information, AP TN Police Joint Operation against Terrorist

Terrorists Target Tirumala

పక్కా సమాచారంతోనే-తిరుమలే తీవ్రవాదుల లక్ష్యం..?

Posted: 10/05/2013 07:06 PM IST
Terrorists target tirumala

చిత్తూరు జిల్లాలోని పుత్తూరులో తలదాచుకున్న తీవ్రవాదుల లక్ష్యం తిరుమల అయివుంటుందని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. శ్రీవారి గరుడోత్సవానికి చెన్నై నుండి వచ్చే గొడుగుల్లో బాంబులు అమర్చేందుకు వీరు కుట్ర పనినట్లు భావిస్తున్నారు. ఆలయంలోని ఓ పూజారి సాయంతో బాంబు అమర్చేందుకు తీవ్రవాదులు పన్నాగం పన్నినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. దీంతో ఆంధ్రప్రదేశ్ తమిళనాడు పోలీసులు అప్రమత్తమయ్యారు.

 

పక్కా సమాచారంతోనే...

తమిళనాడులో చెన్నయ్ ప్రత్యేక దర్యాప్తు బృందానికి ఈ మధ్యే పట్టుబడ్డ అల్ఉమ సంస్థకు చెందిన ఫకృద్దీన్ ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు పుత్తూరులో దాడులు నిర్వహించారని తెలుస్తోంది. కాగా అద్వానీ మధురై పర్యటన సందర్భంగా అల్‌ఉమ సభ్యులు బాంబు పేల్చేందుకు ప్రయత్నించి విఫలమయ్యారు. బెంగళూరు ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యాలయంపై దాడిలో ఈ సంస్థ పాత్ర ఉంది. అలాగే కోయంబత్తూరు వరుస పేలుళ్లు కూడా అల్‌ఉమ పనేనని పోలీసులు చెబుతున్నారు.

 

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles