తిరుమల తిరుపతి దేవస్థానం, రాష్ట్రదేవాదాయశాఖ ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న మనగుడి కార్యక్రమం మూడో విడత రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభమైంది. టీటీడీ ఈవో ఎంజీ గోపాల్ తిరమలలో ప్రారంభించారు. ప్రజల్లో ఆధ్యాత్మిక భావనలు పెంచడానికి ప్రవేశపెట్టిన ఈ కార్యక్రమాన్ని ఇప్పటికి రెండు విడతలుగా విజయవంతంగా నిర్వహించారు. గత ఏడాది ఆగస్టు 2న 13,342 ఆలయాల్లో జరగ్గా, రెండో విడత నవంబరు 28న కార్తీకపౌర్ణమిన 17,536 ఆలయాల్లో నిర్వహించారు. మూడో విడతగా 21,142 దేవాలయాల్లో నిర్వహిస్తారు. ఇందుకు సంబంధించి తిరుమల నుంచి ఇటీవల టీటీడీ వస్త్రాలు, సారె, కంకణాలు అన్ని దేవాలయాలకు పంపారు. దాదాపు 2 కోట్ల కంకణాలు భక్తులకు ఉచితంగా పంపిణీ చేయనున్నారు. అత్యధికంగా పశ్చిమగోదావరి జిల్లాలోని 4,854 దేవాలయాల్లో ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు
ఈ రోజు తిరుపతి వేంకటేశ్వరుని సన్నిధిలో జరిగే మనగుడి కార్యక్రమానికి భక్తులు తండోపతండాలుగా వస్తారని ఆశించారు. కానీ సమైక్యాంధ్ర ఉద్యమం దానికి తూట్లు పొడిచింది, ఆలయ ఆదాయానికీ గండిపడింది. ముందుగా అనుకున్నారు కనుక కార్యక్రమాన్నైతే ప్రారంభించారు కానీ అది గుడిలో కాక బడిలో జరిగింది.
ఒడి, బడి, గుడి- అన్నిట్లోనూ మనిషి తన జీవితంలో అవసరమైనవి పొందుతాడు. వీటిలో గుడి మొక్కుబడి అయింది.
తల్లి ఒడిలోకి వచ్చిన మనిషి మమకారం, ప్రేమ, ముద్దు ముద్దు మాటలు నేర్చుకుని, లేచి నిలబడటం జరుగుతుంది. బడిలో ఓనమాలతో మొదలై బ్రతుకుతెరువుకు కావలసిన విద్యను అభ్యసించటం జరుగుతుంది. ఇక గుడిలో ఆధ్యాత్మిక ఎత్తులను అధిరోహించటం జరిగి బ్రతుకు తెరువు కాదు, అసలు బ్రతుకంటే ఏమిటో తెలుసుకోవటం జరుగుతుంది.
కానీ గుడికి మనం ఇచ్చేది చిట్టచివరి ప్రాధాన్యత. చెయ్యవలసిన పనులు ఎక్కువైపోయి సమయం వాటన్నిటికీ సరిపోనప్పుడే కొన్ని పనులు ప్రాధాన్యతలను సంతరించుకుంటాయి, కొన్ని చేసుకోవు. అలా ప్రాధాన్యతలలో చివర్లో నిలబడేది గుడి. జీవితంలో ఏదైనా కోరుకోవటానికి, లేదా ఆటవిడుపు కోసం గుడులకు వెళ్ళేవారే ఎక్కువమందైపోయారు. అందుకే గుడికి పోవటం మొక్కుబడి అయింది. మొక్కుబడి అన్నది నిజానికి మనం దేవుడికి ఇది చేస్తాను అని మొక్కుకుని చేసే పని. కానీ కాలక్రమంలో మొక్కుబడి అంటే యాంత్రికంగా చెయ్యటం అనే అర్థం వచ్చింది ఎందుకంటే మనలో చాలా మంది గుడిలో కానీ ఇంట్లో కానీ పూజ చేసేది యాంత్రికంగానే కనుక. అందుకే యాంత్రికంగా, అనాలోచితంగా, శ్రద్ధ చూపకుండా, చెయ్యాలి కాబట్టి చేసాం, అని చేసే పనికి మొక్కుబడిగా చెయ్యటం అనే అర్థం వచ్చింది.
తిరుమల తిరుపతి దేవస్థానముల చేత ఏర్పాటు చెయ్యబడ్డ ధర్మ ప్రచార పరిషత్, ధర్మాదాయ దేవాదాయ శాఖ వారితో కలిసి రచించిన మనగుడికి నుడికారం జరిగింది ఆగస్ట్ 11 న అది ఈ రోజు శ్రావణ పౌర్ణమితో అంతమవుతోంది.
భక్తుల సమక్షంలో ఘనంగా జరగవలసిన గుడిలోని పారిశుద్ధ్య కార్యక్రమం జరగలేదు కాబట్టి ఈ రోజు తిరుపతిలో జరిగిన మనగుడి కార్యక్రమం కూడా మొక్కుబడిగా జరిగిందని చెప్పుకోవచ్చు. అయితే ఈ మధ్యలో రాష్ట్రంలో అనేక ఆలయాల్లో జరిగిన మనగుడి కార్యక్రమం మాత్రం విజయవంతమయ్యాయి.
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Apr 02 | టాలీవుడ్ లో సరికొత్త కథలకు, సరిగ్గా సరిగ్గాసరిపోయే హీరోగా ప్రభాస్ ముందు వరుసలో ఉంటాడు. ... Read more
Dec 26 | మరి కొన్ని రోజుల్లో కొత్త సంవత్సరం రాబోతుంది. ఆ రోజు కలియుగ దైవం అయిన ఏడుకొండల వాడిని దర్శించుకోవడానికి వచ్చే భక్తులకు టీటీడీ కండీషన్లు పెట్టింది. కొత్త సంవత్సరం రోజున తిరుమల శ్రీనివాసుని దర్శించుకునేందుకు... Read more
Dec 17 | ప్రపంచ ప్రసిద్ధి పొందిన తిరుమలేశుని లడ్డూ ప్రసాదంలో ఇనుప నట్టు ప్రత్యక్షం కావడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. కడప జిల్లా చక్రాయపేట మండలానికి చెందిన ఉపాధ్యాయుడు రామచంద్ర గండి క్షేత్రంలో ఈ లడ్డును కొనుగోలు చేశారు.... Read more
Dec 12 | పుట్టిన ఊరు, ఓటేసిన ఓటరు తీర్పునకు అనుకూలంగా నడుచుకునే వారు ఒకరైతే.. ఓటరు గీటరు నైజాన్తా.. అధిష్టానానికే మా ఓటు అని మరో ఎంపి చింతమోహన్. రాష్ట్ర విభజనపై కేంద్ర కేబినెట్ నిర్ణయంతో ప్రభుత్వం... Read more
Dec 07 | తిరుచానూరు పద్మావతి అమ్మవారి కార్తీకబ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈరోజు ఉదయం అమ్మవారి సారె ఊరేగింపు ఘనంగా జరుగింది. పెద్ద సంఖ్యలో భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తిరుపతి నుంచి అమ్మవారి సారె వెంబడి ఓ గరుడ... Read more