తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనం, సెంట్రల్ ఆస్పత్రి, అనెక్స్ భవనాల్లో ఇక సౌర వెలుగులు విరజిమ్మనున్నాయి. పరిపాలనా భవనం ప్రాంగణంలోని వీధి దీపాలకు కూడా సౌరవిద్యుత్నే ఉపయోగించనున్నారు. సంప్రదాయేతర ఇంధనవనరుల అభివృద్ధిలో భాగంగా టీటీడీ సొంతంగా సౌరవిద్యుత్ ఉత్పత్తికి చర్యలు చేపట్టింది. ఇందుకోసం రూ.1.25 కోట్లతో 100 కిలోవాట్ల సామర్థ్యం గల సౌరవిద్యుత్ ప్లాంటు పనులు పూర్తి కావచ్చాయి. చెన్నైకి చెందిన ఎల్అండ్ టీ లిమిటెడ్, ఏయోన్ రెనెవబుల్ ఎనర్జీ సొల్యూషన్స్ ప్రయివేట్ లిమిటెడ్, క్రక్స్ ఇండస్ట్రీస్ ఇండియా ప్రయివేట్ లిమిటెడ్ సంస్థల సహకారంతో విరాళంగా వచ్చిన సౌర విద్యుత్ పరికరాలు సమకూర్చుకున్నారు. ప్లాంట్ ఏర్పాటులో వీరి సహకారం తీసుకున్నారు.
టీటీడీ పరిపాలనా భవనానికి సుమారు 600 కిలోవాల్టుల విద్యుత్ అవసరమవుతోంది. ఇందులో 200 కిలోవాల్టులు వెలుతురు కోసం కాగా, మిగతా విద్యుత్ కార్యాలయ పనులకు వినియోగిస్తున్నారు. కేంద్రీయ వైద్యశాల, అనెక్స్ భవనం అసవసరాలకు నెలకు 1.2 లక్షల యూనిట్ల విద్యుత్ వినియోగిస్తున్నారు. ఇందుకోసం నెలకు రూ.8.40 లక్షలు చెల్లిస్తున్నారు. ఈ నేపథ్యంలో సౌర విద్యుత్ ప్లాంటును ఏర్పాటు చేసి విద్యుత్ ఖర్చును తగ్గించుకోవాలని టీటీడీ నిర్ణయించింది. దాతలు ముందుకు రావడంతో వారిచ్చిన విరాళాలతోనే ప్లాంటును నెలకొల్పింది. ఈ ప్లాంటుకు అయిన మొత్తం ఖర్చు రూ.1.25 కోట్లు. ఎల్అండ్టీ రూ.75 లక్షల విలువైన పరికరాలు, ఏయోన్ రెనెవబుల్ఎనర్జీ, క్రక్స్ ఇండస్ట్రీస్ కలిపి రూ.50 లక్షల విలువైన 50 కిలోవాట్ల విద్యుత్ ఉత్పత్తి సౌర ఫలకాలు, విరాళంగా అందించాయి. ఈ ప్లాంటు నుంచి సంవత్సరానికి రూ.10.50 లక్షల విలువైన సుమారు 1.50 లక్షల యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. ప్లాంటు కాలపరిమితి 25 ఏళ్లు. ఈ సౌరవిద్యుత్ ప్లాంటు ఏర్పాటుతో సంవత్సరానికి 100 టన్నుల కార్బన్ ఉద్గారాలు వాతావరణంలో కలవకుండా పర్యావరణాన్ని పరిరక్షించినట్లు అవుతుంది.
(And get your daily news straight to your inbox)
Apr 02 | టాలీవుడ్ లో సరికొత్త కథలకు, సరిగ్గా సరిగ్గాసరిపోయే హీరోగా ప్రభాస్ ముందు వరుసలో ఉంటాడు. ... Read more
Dec 26 | మరి కొన్ని రోజుల్లో కొత్త సంవత్సరం రాబోతుంది. ఆ రోజు కలియుగ దైవం అయిన ఏడుకొండల వాడిని దర్శించుకోవడానికి వచ్చే భక్తులకు టీటీడీ కండీషన్లు పెట్టింది. కొత్త సంవత్సరం రోజున తిరుమల శ్రీనివాసుని దర్శించుకునేందుకు... Read more
Dec 17 | ప్రపంచ ప్రసిద్ధి పొందిన తిరుమలేశుని లడ్డూ ప్రసాదంలో ఇనుప నట్టు ప్రత్యక్షం కావడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. కడప జిల్లా చక్రాయపేట మండలానికి చెందిన ఉపాధ్యాయుడు రామచంద్ర గండి క్షేత్రంలో ఈ లడ్డును కొనుగోలు చేశారు.... Read more
Dec 12 | పుట్టిన ఊరు, ఓటేసిన ఓటరు తీర్పునకు అనుకూలంగా నడుచుకునే వారు ఒకరైతే.. ఓటరు గీటరు నైజాన్తా.. అధిష్టానానికే మా ఓటు అని మరో ఎంపి చింతమోహన్. రాష్ట్ర విభజనపై కేంద్ర కేబినెట్ నిర్ణయంతో ప్రభుత్వం... Read more
Dec 07 | తిరుచానూరు పద్మావతి అమ్మవారి కార్తీకబ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈరోజు ఉదయం అమ్మవారి సారె ఊరేగింపు ఘనంగా జరుగింది. పెద్ద సంఖ్యలో భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తిరుపతి నుంచి అమ్మవారి సారె వెంబడి ఓ గరుడ... Read more