ప్రమాదాలు తలెత్తినప్పుడు మాట్లాడుకోవటం, తూతూమంత్రంగా నివారణ చర్యలు చేపట్టడం మినహా చర్యలు సూన్యం కావటంతో తిరుమల మొదటి ఘాట్ ప్రమాదాలకు నెలవుగా మారుతోంది. ముఖ్యంగా అవ్వాచారి కోన వద్ద తరుచూ ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. తాజగా ఈ తెల్లవారుజామున మరో పెద్ద ప్రమాదం సంభవించింది. నెల్లూరు జిల్లా కావలి మండలం కర్ణపాలెంకు చెందిన శ్రీనివాస్ అనే భక్తుడు ప్రమాదవశాత్తు కాలు జారి లోయలో పడిపోయాడు. దాదాపు 100 అడుగుల లోతులో అతను పడిపోవడంతో శ్రీనివాస్ ను రక్షించేందుకు టిటిడి విజిలెన్స్ అధికారులతో పాటు, ఆక్టోపస్ పోలీసులు చాలా శ్రమపడాల్సి వచ్చింది. అదృష్టవశాత్తు భక్తుడిని పైకి తీసుకురాగలిగారు. ప్రస్తుతం శ్రీనివాస్ రుయా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. రెండేళ్ల క్రితం అవ్వాచారి లోయ వద్ద ప్రమాదాల నివారణకు రక్షణ ప్రణాళిక సిద్ధం చేసినా ఇప్పటి వరకు అది అమలు కాలేదు. ఫలితంగా దేవుడి పుణ్యం మాటదేవుడెరుగు, భక్తుల ప్రాణాలమీదకొస్తుంది.
...avnk
(And get your daily news straight to your inbox)
Apr 02 | టాలీవుడ్ లో సరికొత్త కథలకు, సరిగ్గా సరిగ్గాసరిపోయే హీరోగా ప్రభాస్ ముందు వరుసలో ఉంటాడు. ... Read more
Dec 26 | మరి కొన్ని రోజుల్లో కొత్త సంవత్సరం రాబోతుంది. ఆ రోజు కలియుగ దైవం అయిన ఏడుకొండల వాడిని దర్శించుకోవడానికి వచ్చే భక్తులకు టీటీడీ కండీషన్లు పెట్టింది. కొత్త సంవత్సరం రోజున తిరుమల శ్రీనివాసుని దర్శించుకునేందుకు... Read more
Dec 17 | ప్రపంచ ప్రసిద్ధి పొందిన తిరుమలేశుని లడ్డూ ప్రసాదంలో ఇనుప నట్టు ప్రత్యక్షం కావడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. కడప జిల్లా చక్రాయపేట మండలానికి చెందిన ఉపాధ్యాయుడు రామచంద్ర గండి క్షేత్రంలో ఈ లడ్డును కొనుగోలు చేశారు.... Read more
Dec 12 | పుట్టిన ఊరు, ఓటేసిన ఓటరు తీర్పునకు అనుకూలంగా నడుచుకునే వారు ఒకరైతే.. ఓటరు గీటరు నైజాన్తా.. అధిష్టానానికే మా ఓటు అని మరో ఎంపి చింతమోహన్. రాష్ట్ర విభజనపై కేంద్ర కేబినెట్ నిర్ణయంతో ప్రభుత్వం... Read more
Dec 07 | తిరుచానూరు పద్మావతి అమ్మవారి కార్తీకబ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈరోజు ఉదయం అమ్మవారి సారె ఊరేగింపు ఘనంగా జరుగింది. పెద్ద సంఖ్యలో భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తిరుపతి నుంచి అమ్మవారి సారె వెంబడి ఓ గరుడ... Read more