బ్రహ్మోత్సవాల్లో తుది ఘట్టం శ్రీవారి చక్రస్నానం వైభవంగా ముగిసింది. ఇవాళ మంగళవారం తెల్లవారుజామున స్వామివారి ప్రథమ ఆయుధమైన సుదర్శన చక్రానికి వేద పండితులు పుష్కరిణిలో మూడుసార్లు స్నానమాచరింపజేశారు. ఆ వెంటనే భక్తులంతా గోవిందనామ స్మరణ చేస్తూ పుష్కరిణిలో పుణ్యస్నానాలు చేశారు. అంతకు ముందు తొమ్మిది రోజులుగా వివిధ వాహనాలపై విహరించిన మలయప్ప స్వామి, ఉభయ దేవేరుల విగ్రహాలు, చక్ర పెరుమాళ్లను పుష్కరిణికి తీసుకువచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పంచామృతాలతో తిరుమంజనం నిర్వహించి స్వామి వారికి ధూపదీపాలతో ఆరాధించారు. తులసీమాలల ధారణ చేసి నక్షత్ర హారతి సమర్పించారు. చక్రస్నాన వీక్షణం- సర్వ పాపహరణం అంటారు. అందుకే ఈ అపూర్వఘట్టాన్ని చూసేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు పుష్కరిణికి తరలివచ్చారు. ఈ ఉదయం నాలుగు గంటల నుంచే పుష్కరిణి సమీపంలోకి భక్తులను అనుమతించారు. డీజీపీ దినేష్రెడ్డి ఈ వేడుకల్లో పాల్గొన్నారు.
తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు మంగళవారంతో ముగియనున్నాయి. ఉదయం చక్రస్నానం, రాత్రి 7 నుంచి 9 గంటల వరకు తిరుచ్చి ఉత్సవం జరగనున్నాయి. వీటితో తొమ్మిది రోజులపాటు జరిగిన బ్రహ్మోత్సవ సంబరాలు ముగుస్తాయి. కాగా, గతంలో కన్నా ఈసారి నిర్వహించిన బ్రహ్మోత్సవంలో భక్తుల సంఖ్య పెరిగిందని టీటీడీ ఈవో ఎల్వీ సుబ్రహ్మణ్యం తెలిపారు. ఈ సారి బ్రహ్మోత్సవాల్లో 4.75 లక్షల మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారని, 17 లక్షల 20 వేల లడ్డూ విక్రయం జరిగిందని ఆయన తెలిపారు. ఈ బ్రహ్మోత్సవాల్లో 27 టన్నుల పూలను భక్తులు విరాళంగా ఇచ్చారని, 9 రోజుల హుండీ ఆదాయం రూ.12.93 కోట్లని మీడియా సమావేశంలో ఈవో ఎల్వీ సుబ్రహ్మణ్యం వెల్లడించారు.
...avnk
(And get your daily news straight to your inbox)
Apr 02 | టాలీవుడ్ లో సరికొత్త కథలకు, సరిగ్గా సరిగ్గాసరిపోయే హీరోగా ప్రభాస్ ముందు వరుసలో ఉంటాడు. ... Read more
Dec 26 | మరి కొన్ని రోజుల్లో కొత్త సంవత్సరం రాబోతుంది. ఆ రోజు కలియుగ దైవం అయిన ఏడుకొండల వాడిని దర్శించుకోవడానికి వచ్చే భక్తులకు టీటీడీ కండీషన్లు పెట్టింది. కొత్త సంవత్సరం రోజున తిరుమల శ్రీనివాసుని దర్శించుకునేందుకు... Read more
Dec 17 | ప్రపంచ ప్రసిద్ధి పొందిన తిరుమలేశుని లడ్డూ ప్రసాదంలో ఇనుప నట్టు ప్రత్యక్షం కావడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. కడప జిల్లా చక్రాయపేట మండలానికి చెందిన ఉపాధ్యాయుడు రామచంద్ర గండి క్షేత్రంలో ఈ లడ్డును కొనుగోలు చేశారు.... Read more
Dec 12 | పుట్టిన ఊరు, ఓటేసిన ఓటరు తీర్పునకు అనుకూలంగా నడుచుకునే వారు ఒకరైతే.. ఓటరు గీటరు నైజాన్తా.. అధిష్టానానికే మా ఓటు అని మరో ఎంపి చింతమోహన్. రాష్ట్ర విభజనపై కేంద్ర కేబినెట్ నిర్ణయంతో ప్రభుత్వం... Read more
Dec 07 | తిరుచానూరు పద్మావతి అమ్మవారి కార్తీకబ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈరోజు ఉదయం అమ్మవారి సారె ఊరేగింపు ఘనంగా జరుగింది. పెద్ద సంఖ్యలో భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తిరుపతి నుంచి అమ్మవారి సారె వెంబడి ఓ గరుడ... Read more