ప్రస్తుత బిజీ ప్రపంచంలో ప్రతిఒక్కరు నిద్రకోసం ఎన్నో అవస్థలు పడుతున్న విషయం వాస్తవమే! ఆఫీసు పని ఒత్తిడి వల్ల, ఇతర కారణాల వల్ల సరిగ్గా ఐదారు గంటలు కూడా నిద్రకోసం కేటాయించలేకపోతున్నారు. దేశంలో నిర్వహించిన సర్వేల ప్రకారం వెల్లడైన సమాచారమేమిటంటే.. దాదాపు 30 శాతం మంది ప్రజలు నిద్రలేక కలతనిద్రతో బాధపడుతున్నారని తెలిసింది. అటువంటివారు సరైన నిద్రకోసం నిద్రమాత్రలు ఎక్కువ మోతాదులో తీసుకుంటున్నారు. రానురాను కాలక్రమంలో నిద్రసమస్యలు మరీ ఎక్కువయిపోతున్న తరుణంలో పెద్దవయస్కులతోపాటు యుక్తవయస్సులో వున్నవారు కూడా నిద్రమాత్రలు ఎక్కువగా తీసుకుంటున్నారని పరిశోధనల బాగంగా వెల్లడైంది. అయితే వీటిని రెగ్యులర్ గా తీసుకుంటే మాత్రం చాలా ఎక్కువ ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని నిపుణులు చెబుతున్నారు. సమయానుకూలంగా అప్పుడప్పుడు నిద్రమాత్రలు తీసుకోవడంలో తప్పు లేదుగానీ.. నిద్రలేదన్న నెపంతో మోతాదుకంటే ఎక్కువగా తీసుకంటే అంతే సంగతులు!
నిద్రమాతలు మొదటగా తీసుకుంటే.. అది మెదడులోని ‘‘డొపమైన్’’ అనే రసాయక ద్రవాన్ని ఉత్సాహంగా, ఉత్తేజంగా పనిచేయడంలో సహాయపడుతుంది. దీంతో మనుషులు కూడా తమతమ కార్యకలాపాలు ఉత్సాహంగా త్వరగా ముగించేసుకుని, నిద్రమత్తులోకి జారిపోతాడు. దీనిని ఒక్కసారి తీసుకుంటే చాలు.. మళ్లీ మళ్లీ తీసుకోవాలని మెదడు ప్రేరేపిస్తుంది. దాంతో మళ్లీ మళ్లీ నిద్రమాత్రలు తీసుకోవాలని అనిపిస్తుంది. కానీ అలా చేయడం చాలా ప్రమాదకరం. వైద్యుడి సలహాలు తీసుకోకుండా వీటిని రెగ్యులర్ గా వాడితే ఎన్నో ఇబ్బందులను ఎదుర్కోవలసి వస్తుంది. నిద్ర సమస్య ఎక్కువగా వుంటే వైద్యుడి సలహామేరకు చాలా తక్కువ మోతాదులో నిద్రమాత్రలు తీసుకుంటే మంచిది! 15 రోజులకు మించి ఎక్కువ వాడకూడదు. అలావాడితే వీటివల్ల కలిగే నష్టాలేమిటో తెలుసుకుందాం...
1. ప్రతిరోజూ నిత్రమాత్రలు తీసుకుంటే.. శ్వాసప్రక్రియకు ఇబ్బంది కలిగిస్తుంది. గాఢ శ్వాస లేకుండా చేస్తాయి. వీటివల్ల అస్తమా రోగం త్వరగా సోకుతుంది.
2. ఈ మాత్రలను తరుచుగా తీసుకోవడం వల్ల నిద్రపోవాలనే ధ్యాసే ఎక్కువగా వుంటుంది. ఆ నేపథ్యంలో ఆకలి కూడా అంతగా వుండదు. అంటే ఇవి ఆకలిని చంపేస్తాయి. ఫలితంగా జీర్ణక్రియ కూడా మందగిస్తుంది.
3. మాత్రలు తీసుకోగానే నిద్రమత్తులోకి జారిపోతారు. దీంతో ఉదయాన్నే లేవడానికి ఎన్నో ఇబ్బందులు పడాల్సి వస్తుంది. లేచిన తర్వాత కొద్దిసేపటి వరకు అలసట, దాహం వంటివి కలుగుతాయి. బలహీనంగా మారిపోతారు. చూపు కూడా మందగిస్తుంది. ఇటువంటి సమస్యల నుంచి తేరుకోవడానికి ఉదయం సమయంలో ఎక్కువ టైం పడుతుంది.
4. రోజురోజుకీ ఈ నిద్రమాత్రల ప్రభావం పెరుగుతూ వుంటుంది. తీసుకోకపోయినా.. మత్తుగా వున్నట్లు అనిపిస్తుంది. అప్పుడు కళ్లు తిరుగుతున్నట్లుగానో, తల తీవ్రంగా బాధిస్తున్నట్లుగానూ అనిపిస్తూ వుంటుంది.
5. రోజు ఈ మాత్రలను తీసుకుంటే ఒకానొక సమయంలో వీటి పవర్ ఎక్కువగా పెరిగిపోతుంది. దీంతో శరీరం పూర్తిగా బలహీనపడుతుంది. ఫలితంగా వణుకు ప్రారంభం అవుతుంది.
AS
(And get your daily news straight to your inbox)
Jun 04 | సంసార సాగరంలో దంపతుల మధ్య అప్పుడప్పుడు కోపతాపాలు రావడం సర్వసాధారణం. అందుకని వాటిని పదే పదే ఆలోచించుకుంటూ పోతే.. జీవితమే బోరింగ్గా ఉంటుంది. అందుచేత భార్య భర్తపై కోప్పడినా, భర్త భార్యపై కోప్పడినా.. కాస్త... Read more
Jun 03 | కొందరు వ్యక్తులు అధిక కొలెస్ట్రాల్ సమస్యతో బాధపడుతుంటారు. దీనికి సంబంధించి ఆరోగ్య చిట్కాలు పాటించకుంటే.. ఊబకాయంతోపాటు గుండె సంబంధిత వ్యాధులు తీవ్రమవుతాయి. ఇంకా ఇతర హానికారక వ్యాధులు సంభవించే అవకాశముంది. ఇలా కాకుండా కొలెస్ట్రాల్... Read more
May 28 | ఉద్యోగస్తులు టీ బ్రేక్ సమయంలో రకరకాల స్నాక్స్ తీసుకుంటుంటారు. చాలామంది స్నాక్స్ గా బిస్కెట్లు, బర్గర్లు, ఇంకా ఇతర జంక్ ఫుడ్లు తీసుకుంటారు. అయితే.. వాటిని ప్రతిరోజూ తీసుకుంటే మాత్రం ఆరోగ్య సమస్యలు తప్పవు.... Read more
May 27 | ఆరోగ్యాన్ని మెరుగుపరిచే పోషకాహారాల్లో పనసపండు ఒకటి! ఇందులో మానవ శరీరానికి కావలసిన పోషకాలు పుష్కలంగా వుంటాయి. అవి.. శరీరంలో శక్తిని పెంచి, వివిధరకాల వ్యాధుల నుంచి ఉపశమనం కలిగించడంలో సమర్థవంతంగా పనిచేస్తాయి. ఇంతకీ.. ఈ... Read more
May 25 | సాధారణంగా ప్రకృతి సహజంగా లభించే పండ్లలో పోషక విలువలు అధికంగా వుంటాయి. అలాంటి పండ్లలో లిచీ ఫ్రూట్ కూడా ఒకటి! ఇందులో ఎన్నో పోషకాలు, మినరల్స్ వుంటాయి. అవి.. ఆరోగ్యాన్ని మెరుగుపర్చడంలో సమర్థవంతంగా పనిచేస్తాయి.... Read more