నేటి ఫాస్ట్ జనరేషన్ లో ఏ విధంగా అయితే సాంకేతికరంగం చాలా వేగంగా అభివృద్ధి చెందుతోందో.. అదేవిధంగా ఆర్థికపరిస్థితులు చాలా మార్పులు వస్తున్నాయి. ఒకనాడు తక్కువ ధరలో లభించే వస్తువులు... తరువాత ఒకేసారి గణనీయంగా పెరిగిపోతున్నారు. ముఖ్యంగా ఇల్లు, స్థలాలు, ఇతర వస్తువులు తదితరుల్లోనే ధరల్లో ఎక్కువ మార్పులు వస్తున్నాయి. అంతెందుకు.. ఇటీవలకాలంలో ఐక్యరాజ్యసమితి ఆర్థిక మందగమనం గురించి సంచలనాత్మకమైన వ్యాఖ్య చేసింది. ‘‘ప్రపంచం త్వరలో మరో ఆర్థిక మంద్యాన్ని ఎదుర్కోబోతోంది. ఈసారి ప్రభావం గతంలోకన్నా మరింతగా వుండవచ్చు’’ అని హెచ్చరికను జారీ చేసింది. అన్నట్టు.. ఐరాస ఇచ్చిన హెచ్చరికలను బాగానే గమనిస్తే.. ఇటువంటి ఆర్థిక మందగమనం గతంలోనూ ఏర్పడింది. దీనివల్ల అప్పట్లో చాలా సమస్యలను ఎదుర్కోవడమే కాకుండా... పెట్టుబడుల విషయంలో, భవిష్యత్ విషయంలో ఒక గుణపాఠం కూడా నేర్పించింది.
ఇటువంటి పరిస్థితియే మరోసారి ఏర్పడితే మాత్రం.. అప్పుడు దానిని భరించడం అంత సామాన్య విషయమైతే చచ్చినా కాదు. అందుకే ఇటువంటి వాటిని దృష్టిలో పెట్టుకుని కష్టార్జితాన్ని ఏ విధంగా మదుపు పెట్టువాలనేది కీలకంగా తయారైంది. అలాంటప్పుడు సంపాదించిన కష్టార్జితాన్ని అనవసరంగా ఖర్చు చేయకుండా ఎలా మదుపు చేసుకోవాలో కొన్ని ప్రత్యేక ప్రణాళికలను ఏర్పాటు చేసుకుంటే మంచిది. అలాగే.. అలాగే మనం పెట్టే పెట్టుబడులలో, మ్యూచువల్ ఫండ్లలో, ఫిక్స్డ్ డిపాజిట్లలో వైవిధ్యంగా వుండేలా చూసుకుంటే చాలామంచిదని నిపుణులు పేర్కొంటున్నారు. ఇటువంటి విషయాలను జాగ్రత్త తీసుకోవడం వల్ల మనం భవిష్యత్ లో వచ్చే కష్టాలను చాలా సులభంగా అధిగమించవచ్చు. అయితే అందులో పాటించాల్సిన నియమాలను మనం కొన్ని తెలుసుకోవాల్సి వుంది.
ప్రస్తుతకాలంలో ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి కాబట్టి.. మనం చేసే ఏ చిన్న ఉద్యోగం అయినా క్రమం తప్పకుండా ఎంతోకొంత డబ్బును మదుపు చేసుకోవాలి. మన సంపాదన మరీ తక్కువయితే ఇలా చేయడం కొంచెం కష్టమే. అయితే అనవసరమైన ఖర్చులకు డబ్బులను తగలబెట్టకుండా.. సమయానుసారం డబ్బులను మదుపు చేసుకోవాలి. ఇలా క్రమం తప్పకుండా చేసుకుంటే.. తర్వాతి కాలంలో ఎటువంటి ఇబ్బందులు వచ్చినా వాటిని అధిగమించవచ్చు. ఏదైనా ఒక పెట్టుబడి పెట్టినా.. అందులో కూడా క్రమంతప్పకుండా పొదుపు చేసుకోవాలి.
కొంతమంది ఏదైనా ఒక మదుపు పథకంలో డబ్బు జమ చేశాక.. కొంతకాలానికే దానిని నిలిపివేయడం లేదా మదుపు చేసిన డబ్బును వెనక్కి తీసుకోవడం చేస్తారు. ఇలా చేస్తే భవిష్యత్ లో వచ్చే పరిణామాలను ఎదుర్కోవడం చాలా కష్టం. మనకు ఎన్ని కష్టాలు వచ్చినా సరే.. మదుపు చేస్తున్న డబ్బులను కదిలించకుండా వుండాలి. పెట్టుబడుల నుంచి వచ్చే రాబడినే అవసరాలకు ఉపయోగించుకోవాలి. అవసరమైన రాబడిని కూడా తిరిగి పెట్టుబడులు పెట్టుకుంటే మరీ మంచిది. దీంతో మన డబ్బులు ఇంకా పెరగడానికి చాలా ఆస్కారముంటుంది.
సాధారణంగా కొన్ని కంపెనీలలో బోనస్ లు, జీతం పెంచడం లేదా ఇతర ప్రోత్సాహకాలు ఉద్యోగస్తులకు కల్పిస్తుంటారు. అలా వచ్చిన ఆ డబ్బులను నేరుగా ఖర్చులకు కాకుండా కొంత డబ్బును మదుపు చేసుకోవాలి. కాని కొందరైతే ఇలా డబ్బు అందిన ప్రతీసారి అనవసరమైన వస్తువులను కొనుగోలు చేసి కష్టాలను కొని తెచ్చుకుంటున్నారు. అదెలా అంటే.. ముందుగానే వున్న టీవీని ఎంతోకొంత డబ్బులకు ఇతరులకు అమ్మివేసి, ఎక్కువ ఖరీదైన వాటిని తెచ్చుకుంటారు. ఒక్క టీవీనే కాదు... ఇంకా ఇతరత్ర సామానులు తెచ్చుకుంటుంటారు. దీంతో వారి గృహాలంకరణ అయితే బాగానే వుండొచ్చు కానీ... భవిష్యత్ లో వచ్చే కష్టాలను అధిగమించడం చాలా ఘోరంగా వుంటుంది.
కొందరు తమ ఆర్థిక పరిస్థితి కంటే ఎక్కువ డబ్బులను పెట్టుబడులకు వెచ్చిస్తుంటారు. ఇలా చేయడం మంచిదే.. కానీ మొత్తం సొమ్మును ఒకేదానిలో పెట్టేయకూడదు. వైవిధ్యమైన పెట్టుబడులు పెట్టడం వల్ల.. ఒకదానిలో వచ్చే నష్టాన్ని మరొకదానితో పూరించవచ్చు. అప్పుడు మనం ఎటువంటి కష్టాలు వచ్చినా.. సులభంగా వాటిని అధిగమించగలం. ఇంకొంతమంది ఏదైనా ఒక వస్తువు ఎక్కువ లాభాన్ని చేకూరుస్తుందన్న నెపంతో అప్పులు చేసి మరీ పెట్టుబడులు పెట్టుకుంటున్నారు. ఇప్పుడున్న ఆర్థికమాంద్య పరిస్థితుల్లో ఇటువంటి తప్పులు (అప్పులు) చేయకూడదు. కాలంమారుతున్న కొద్దీ వస్తువు విలువ కూడా మారుతుంటుంది. దాని విలువ పెరగవచ్చు లేదా తరగవచ్చు. కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లోనైనా సరే.. వున్న డబ్బుతోనే పెట్టుబడులు పెట్టుకోవాలే తప్ప అప్పులు మాత్రం చేయకూడదు.
(And get your daily news straight to your inbox)
Jun 04 | సంసార సాగరంలో దంపతుల మధ్య అప్పుడప్పుడు కోపతాపాలు రావడం సర్వసాధారణం. అందుకని వాటిని పదే పదే ఆలోచించుకుంటూ పోతే.. జీవితమే బోరింగ్గా ఉంటుంది. అందుచేత భార్య భర్తపై కోప్పడినా, భర్త భార్యపై కోప్పడినా.. కాస్త... Read more
Jun 03 | కొందరు వ్యక్తులు అధిక కొలెస్ట్రాల్ సమస్యతో బాధపడుతుంటారు. దీనికి సంబంధించి ఆరోగ్య చిట్కాలు పాటించకుంటే.. ఊబకాయంతోపాటు గుండె సంబంధిత వ్యాధులు తీవ్రమవుతాయి. ఇంకా ఇతర హానికారక వ్యాధులు సంభవించే అవకాశముంది. ఇలా కాకుండా కొలెస్ట్రాల్... Read more
May 28 | ఉద్యోగస్తులు టీ బ్రేక్ సమయంలో రకరకాల స్నాక్స్ తీసుకుంటుంటారు. చాలామంది స్నాక్స్ గా బిస్కెట్లు, బర్గర్లు, ఇంకా ఇతర జంక్ ఫుడ్లు తీసుకుంటారు. అయితే.. వాటిని ప్రతిరోజూ తీసుకుంటే మాత్రం ఆరోగ్య సమస్యలు తప్పవు.... Read more
May 27 | ఆరోగ్యాన్ని మెరుగుపరిచే పోషకాహారాల్లో పనసపండు ఒకటి! ఇందులో మానవ శరీరానికి కావలసిన పోషకాలు పుష్కలంగా వుంటాయి. అవి.. శరీరంలో శక్తిని పెంచి, వివిధరకాల వ్యాధుల నుంచి ఉపశమనం కలిగించడంలో సమర్థవంతంగా పనిచేస్తాయి. ఇంతకీ.. ఈ... Read more
May 25 | సాధారణంగా ప్రకృతి సహజంగా లభించే పండ్లలో పోషక విలువలు అధికంగా వుంటాయి. అలాంటి పండ్లలో లిచీ ఫ్రూట్ కూడా ఒకటి! ఇందులో ఎన్నో పోషకాలు, మినరల్స్ వుంటాయి. అవి.. ఆరోగ్యాన్ని మెరుగుపర్చడంలో సమర్థవంతంగా పనిచేస్తాయి.... Read more