దక్షిణ భారతదేశంలోనే ప్రయాణికులకు ‘‘వెల్లూర్’’ ఒక ప్రముఖ పర్యాటక కేంద్రంగా గుర్తించబడింది. ఈ ప్రాంతంలో పురాతనకాలం నుంచి వున్న కట్టడాలు, దేవాలయాలు, ద్రావిడ నాగరికతలను సంబంధించిన చారిత్రాత్మక కట్టడాలు ఇక్కడ వున్నాయి. హిందూ సంస్కృతీ, సంప్రదాయాలను వెదజల్లే అద్భుతమైన నగరంగా దీనిని పేర్కొంటారు. ఈ ప్రాంతానికి ‘ఫోర్ట్ సిటీ ఆప్ తమిళనాడు’ (తమిళనాడు కోట నగరం) అని పేరు కూడా వుంది.
ఇక్కడున్న చారిత్రాత్మక కట్టడాల గురించి ఒకసారి మనం చర్చించుకుందాం....
వెల్లూర్ పోర్ట్ : ఇది పూర్తిగా గ్రానైట్ రాయితో చేయబడిన ఒక కళాత్మకమైన కట్టడం. ప్రయాణికులు దీనికి వీక్షించడానికి లక్షలలో వస్తుంటారు. ఇది ఒక హాట్-స్పాట్ వంటిది.
మ్యూజియం : వెల్లూరులో వుండే రాష్ట్ర ప్రభుత్వ మ్యూజియం ఎంతో ఆకర్షితమైనది. ఇక్కడ పురాతన కాలంలో రాజులు వుపయోగించిన వస్త్రాభరణాలు, నాగరికతకు సంబంధించిన కళలు చాలా వున్నాయి. ఇక్కడున్న ఫ్రెంచ్ బంగళా ఒక స్మారక చిహ్నం. దీనినే పెర్ల్ ప్యాలెస్ లేదా ముతుమండపం అని కూడా అంటారు.
మహమ్మదీయ మసీదు : ఇక్కడ కేవలం హిందూ కట్టడాలే కాకుండా ముస్లిం సోదరులకు సంబంధించిన చారిత్రాత్మక కట్టడాలు కూడా వున్నాయి. అందులో ముఖ్యమైంది ఈ మహమ్మదీయ మసీదు. దీనిని వీక్షించడానికి కూడా చాలామంది పర్యాటకులు వస్తుంటారు.
గోల్డెన్ టెంపుల్ : ప్రస్తుతకాలంలో భారతదేశంలో పేరుగాంచిన దేవాలయాలలో ది గోల్డెన్ టెంపుల్ ఒకటి. ఇది మొత్తం 1500 కిలోల బంగారంతో కట్టించారు. ఈ ఆలయం శ్రీ శక్తి అమ్మ పేరుతో కట్టించారు. ఇది మొత్తం 1.8 కిలోమీటర్ల వరకు విస్తీర్ణంలో వ్యాపించి వుంది. దీనిని ది గోల్డెన్ టెంపుల్ ఆఫ్ వెల్లూర్ అని అంటారు. ఈ ప్రాంతం చుట్టుపక్కల సందర్శించడానికి హిందూ దేవాలయాలు, మఠాలు చాలానే వున్నాయి.
రీసెర్చ సెంటర్ : ప్రముఖ చర్చులైన యజమ్త్పిఒన్ కాతెద్రాల్, 150 సంవత్సరాల కిందటి సెయింట్ జాన్స్ చర్చులు వున్నాయి. ఇక్కడున్న రీసెర్చ్ సెంటర్ భారతదేశ మొదటి మూలకరణ పరిశోధన కేంద్రంగా పిలవబడుతుంది.
జూలాజికల్ పార్క్ : పిల్లల నుండి పెద్దల వరకు ప్రతిఒక్కరికి ఎంతో ఇష్టమైన పర్యాటక కేంద్రం ఈ జూలాజికల్ పార్క్. ఇది అమిర్తి నది సమీపంలో జవాడు కొండల దగ్గర వుంది.
గ్రేట్ వార్ : స్వాతంత్ర్య పోరాటంలో బ్రిటీష్ వారికి వ్యతిరేకంగా వెల్లూర్ ఎల్లప్పుడూ ముందంజలో వుంది. ఆ ఉద్యమంలో సైనికులు ఉపయోగించిన యుద్దసామాగ్రి వెల్లూర్ కోటలో వున్నాయి.
మొత్తం భారతదేశంలో వెల్లూరు ప్రాంతం తోలు ఎగుమతి చేయడంలో ప్రముఖ స్థానంలో వుంది. అంతేకాదు.. ఇక్కడ విస్ఫోటకాలకు సంబంధించిన పేలుడు పదార్థాలను కూడా తయారు చేస్తారు.
(And get your daily news straight to your inbox)
Apr 24 | ప్రస్తుతకాలంలో వాహనాల వాడకం విపరీతంగా పెరిగిపోయింది. యుక్తవయస్కుల నుంచి 60 ఏళ్లు పైబడినవారు కూడా ప్రతిఒక్కరు కారును నడుపుతున్నారు. అదేవిధంగా యాక్సిడెంట్లు కూడా ఎక్కడబడితే అక్కడ జరుగుతున్నాయి. అయితే తాజాగా నిర్వహించిన సర్వేల్లో.. యాక్సిడెంట్లలో... Read more
Mar 24 | ఆధ్యాత్మిక ప్రదేశాల నుంచి ఎంతో సుందరమైన ప్రకృతి దృశ్యాలదాకా గుజరాత్ రాష్ట్రం నానాటికీ అభివృద్ధి చెందుతూనే వుంది. సంస్కృతి సంప్రదాయాలపరంగా, వ్యాపారపరంగా, విహరించడానికి అనుగుణంగా ఈ ప్రదేశం ప్రతిఒక్కరిని ఆకర్షిస్తూనే వుంది. ప్రముఖ నటుడయిన... Read more
Mar 21 | మన భారతదేశంలో వున్న అన్ని ప్రదేశాలలో గర్వించదగ్గ ప్రాంతాలలో దేశ రాజధాని అయిన ఢిల్లీ ఒకటి. ఇక్కడికి విహరించడానికి ప్రపంచంలోని అనేక దేశాల పర్యాటకులు విచ్చేస్తుంటారు. ఢిల్లీలో ఆకర్షించే ప్రాంతాలు చాలానే వున్నాయి. ఢిల్లీ... Read more
Mar 17 | మొత్తం ప్రపంచంలోనే భారతదేశంలో ఎంతో అద్భుతమైన హిమాలయ శ్రేణుల గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఈ ప్రాంతం ఎప్పుడూ పర్యాటకులతో నిండి వుంటుంది. చిన్న, పెద్ద, వయస్సుతో ఎటువంటి తేడా లేకుండా ప్రతిఒక్కరు... Read more
Mar 10 | ఒరిస్సా రాష్ట్రంలోని మూడు ప్రసిద్ధ పర్యాటక ప్రదేశాలలో ‘గోపాల్పూర్’ ఒకటి. ఇది ఒరిస్సాలోని దక్షిణ సరిహద్దులైన్లపై వున్న ఒక కోస్తా పట్టణం. ఇది బంగాళఖాతానికి చాలా సమీపంలో వుండడంవల్ల ఎంతో ప్రసిద్ధి చెందింది. కాలంతో... Read more