అసిస్టెంట్ డైరెక్టర్ గా కెరీర్ ప్రారంభించిన రాజ్ తరుణ్.. ‘ఉయ్యాల జంపాలా’ సినిమాతో హీరోగా అవతారమెత్తాడు. ఆ చిత్రం మంచి విజయం సాధించడంతో ఇతనికి ‘సినిమా చూపిస్త మావా’ ఆఫర్ దక్కింది. ఆ చిత్రం కూడా ఘనవిజయం సాధించడంతో రాజ్ కి క్రేజ్ బాగానే పెరిగిపోయింది. ప్రస్తుతం ‘కుమారి 21ఎఫ్’ సినిమా షూటింగ్ లో బిజీగా వున్న ఈ కుర్ర హీరో.. అప్పుడే మరో బంపరాఫర్ కొట్టేశాడని సమాచారం. ఇటీవల దర్శకురాలిగా అవతారమెత్తిన నటి రేవతి దర్వకత్వంలో రూపొందనున్న ఓ సినిమాలో రాజ్ తరుణ్ హీరోగా నటించనున్నాడని తెలిసింది.
పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ‘గాయం’ చిత్రంలో నటించిన కథానాయిక రేవతి ఇప్పుడు దర్శకురాలిగానూ తన అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది. ఇప్పటికే పలు సందేశాత్మక చిత్రాలకు దర్శకత్వం వహించిన ఈమె.. ప్రస్తుతం పూరీ జగన్నాధ్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘మా అమ్మ మహాలక్ష్మీ’ చిత్రంలో ఓ ప్రధాన పాత్రలో నటిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆమె తాను సిద్ధం చేసుకున్న ఓ కథను పూరీకి వినిపించిందట. ఆ కథ బాగుండటంతో.. తాను స్ర్కీన్ ప్లే రెడీ చేస్తానని, ఆమెను దర్శకత్వం వహించమని పూరీ సూచించాడని చెబుతున్నారు. ఇంకో విశేషం ఏమిటంటే.. పూరీ స్వయంగా నిర్మించనున్న ఈ ప్రాజెక్టుకు హీరోయిన్ ఛార్మీ కూడా సహనిర్మాతగా వ్యవహరించనుంది. ఇప్పటికే ‘జ్యోతిలక్ష్మీ’ సినిమాతో నిర్మాతగా మారిన ఛార్మి.. మరోసారి ఈ సినిమా ద్వారా తన అదృష్టాన్ని పరిక్షించుకోనుంది.
ఈ సినిమాలో హీరోగా కొందరిని పరిశీలించిన అనంతరం చివరికి రాజ్ తరుణ్ ని ఎంపిక చేసినట్లు తెలిసింది. వరుస విజయాలతో దూకుడు మీదున్న ఈ హీరో ఫ్యామిలీ ఆడియెన్స్ ను మెప్పించడంలోనూ సక్సెస్ అయ్యాడు కాబట్టి.. అతడినే తమ సినిమాలో హీరోగా తీసుకుందామని వారు ఫిక్స్ అయ్యారని చెప్పుకుంటున్నారు. బ్యూటీఫుల్ మెసేజ్ ఓరియెంటెడ్ సినిమాగా ఈ ప్రాజెక్టు రూపొందనుందని తెలిసింది. త్వరలోనే అన్ని వివరాలు తెలియనున్నాయి.
AS
(And get your daily news straight to your inbox)
Jun 17 | రవితేజ తో మొదటి సినిమా తీసి ‘షాక్’ తగిలించుకున్న వర్మ శిష్యుడు హరీష్ శంకర్. రెండో మూవీ గబ్బర్ సింగ్ తో బ్లాక్ బస్టర్ ను అందుకోవటమే కాదు.. దాదాపు పదేళ్లుగా పవన్ అభిమానులు... Read more
Jan 06 | "పక్కింటి కుర్రాడే" అనిపించే లుక్స్... "మనలాగే ఆలోచిస్తున్నాడే" అని ప్రతీ అబ్బాయి రిలేట్ చేసుకునేలా పెర్ఫార్మెన్స్... వరుస సినిమాలు, వరుస హిట్లు, సినిమా సినిమా కీ వేరియేషన్, పాత్ర - పాత్ర కీ వెరైటీ...... Read more
Nov 24 | దక్షిణాది సినీపరిశ్రమలో మ్యూజిక్ డైరెక్టర్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న దేవీశ్రీప్రసాద్.. కథానాయకుడిగా పరిచయం కానున్నాడనే వార్తలు గతంలో బాగానే చక్కర్లు కొట్టాయి. ఇప్పటికీ ఆయా సందర్భాల్లో ఆ వార్తలు వినిపిస్తూనే వున్నాయి.... Read more
Nov 20 | ప్రస్తుతరోజుల్లో ప్రేక్షకులు సినిమాల్లో కొత్తదనాన్ని కోరుకుంటున్నారు. కేవలం కథ మాత్రమే కాదు.. మ్యూజిక్ లో కొత్త బీట్స్ కావాలంటూ డిమాండ్ చేస్తున్నారు. అవే డప్పులు, అదే పాత స్టైల్లో వుండే పాటలు కాకుండా.. నేటి... Read more
Nov 19 | కోలీవుడ్, బాలీవుడ్ లలో భారీ హిట్లు సాధించిన సినిమాలను రీమేక్ చేయడంపై తెలుగు హీరోలు ఇటీవల ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. ముఖ్యంగా కెరీర్ కాస్త గాడిలో పడిన స్టార్ హీరోలే ఈ తరహా ఆలోచనలు... Read more