టీమిండియా మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్.. తన అద్బుత ప్రదర్శనలతో భారత క్రికెట్ జట్టుకు ఎన్నో మరువలేని విజయాలను అందించాడు. ప్రస్తుతం పార్లమెంటు సభ్యుడిగా కూడా కొనసాగుతున్న ఆయన ఆటను ఇన్నాళ్లకు గుర్తించిన ఢిల్లీ జిల్లా క్రికెట్ అసోసియేషన్.. ఆయనకు ఆరుదైన గౌరవాన్ని అందించాలని నిర్ణయించింది. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ తరువాత ఈ అరుదైన ఘనతను అందుకోబొతున్న మాజీ క్రికెటర్ గౌతముడే కావడం విశేషం.
ఇంతకీ ఆ గౌరవం ఏంటంటే.. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ (అంతకుముందు ఫిరోజ్ షా కోట్ల మైదానం) స్టేడియంలోని ఓ స్టాండుకు గౌతమ్ గంభీర్ పేరు పెట్టనున్నారు. ఈ మేరకు తాజాగా దిల్లీ జిల్లా క్రికెట్ అసోసియేషన్(డీడీసీఏ) నిర్ణయించింది. ఇప్పటికే ఈ స్టేడియంలోని ఓ స్టాండ్కి టీమిండియా సారథి విరాట్ కోహ్లీ పేరు పెట్టారు. కోహ్లీ గౌరవార్థం ఈ ఏడాది సెప్టెంబరులో దీనికి సంబంధించిన వేడుక కూడా నిర్వహించారు. తాజగా గంభీర్ కు కూడా అటువంటి గౌరవమే లభించనుంది.
దీనిపై డీడీసీఏ సంయుక్త కార్యదర్శి రాజన్ మంచండా మాట్లాడాతూ.. టీమిండియాకు గౌతమ్ గంభీర్ చేసిన సేవలకు ఈ విధంగా కృతజ్ఞతలు తెలియజేయాలని భావిస్తున్నామని చెప్పారు. ఇందుకు డిడీసీఏ కౌన్సిల్ కూడా పచ్చజెండా ఊపిందని తెలిపారు. నిజానికి స్టాండ్కి గంభీర్ పేరు పెట్టాలనే ప్రతిపాదన ఎప్పటి నుంచో ఉందని.. కాకపోతే దానికి కాస్త విరామం వచ్చిందని.. ఇప్పుడు దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. వచ్చే రంజీట్రోఫీ సీజన్ నుంచే ఈ స్టాండ్ అందుబాటులోకి వస్తుందని ఆయన తెలిపారు.
టీమిండియాలో తిరుగులేని ఓపెనర్ గా రాణించిన గంభీర్ గతేడాది క్రికెట్లో అన్ని ఫార్మాట్ల నుంచి వైదొలిగారు. తర్వాత బీజేపి పార్టీలో చేరి రాజకీయాల్లో సరికొత్త ఇన్నింగ్స్ ప్రారంభించారు. ప్రస్తుతం ఈస్ట్ ఢిల్లీకి ఎంపీగా ఉన్నారు. తాను ఆటలో వున్నా లేకున్నా.. నిత్యం టీమిండియా క్రికెట్ పై తన స్పందనను తెలియజేస్తూ.. తన ఆనందాన్ని, ఆవేదనను పంచుకుంటున్న గంభీర్.. ఇటీవలే విరాట్ కోహ్లీ సేనకు పరిపూర్ణ బౌలింగ్ విభాగం ఉందని అభిప్రాయపడిన విషయం తెలిసిందే. టీమిండియా ఇటీవల మ్యాచులలో ప్రత్యర్థి జట్టును అలౌట్ చేయడానికి కూడా కారణమిదేనని పేర్కొన్నాడు.
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్స్ట్రైకర్ ఎండ్లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more