వెస్టిండీస్ పర్యటనలో భారత్ టీ20 సిరీస్ క్లీన్స్వీప్ చేసి అదరగొట్టింది. మూడో టీ20లో పంత్ నాటౌట్ గా నిలిచి (42 బంతుల్లో 65)చెలరేగడంతో టీమిండియా ముచ్చటగా మూడో టీ 20లోనూ విజయాన్ని సాధించి విండీస్ ను క్లీన్ స్వీప్ చేసింది. అయితే మ్యాచ్ అనంతరం ఓపెనర్ రోహిత్శర్మ.. వికెట్కీపర్, బ్యాట్స్మన్ రిషబ్ పంత్ను ఇంటర్వ్యూ చేశాడు,
ఈ వీడియో క్రికెటర్లు ఎవరో రికార్డ్ చేయగా.. దానిని తన ట్విట్టర్ ఖాతాలో బీసీసీఐ పోస్ట్ చేసింది. ఈ ట్వీట్ కు యువ స్పిన్నర్ యుజువేంద్ర చాహల్ తనదైన శైలిలో సరదా వ్యాఖ్యలు జోడించి రీట్వీట్ చేశాడు. దీంతో చాహల్ లోని ఈ యాంగిల్ ను కూడా చూసిన నెట్ జనులు, క్రికెట్ అభిమానులు వహ్ వా అంటూ కితాబిస్తుండగా, మరికోందరు మాత్రం బిసిసిఐ పైనే వ్యంగాస్త్రాలు సంధిస్తావా.? అంటూ వార్న్ చేస్తున్నారు. ఇంతకీ ఆయన చేసిన కామెంట్ ఏమిటంటే.. ‘మిస్సింగ్ మీ’ (నన్ను కోల్పోతున్నారు) అంటూ బీసీసీఐని ఉద్దేశించి వ్యాఖ్యానించాడు.
సహజంగా చాహల్ టీవీ ద్వారా అతడే టీమిండియా ఆటగాళ్లని ఇంటర్వ్యూ చేసి ఆ వీడియోలను అభిమానులతో పంచుకుంటాడు. ఈసారి రోహిత్ తన పాత్ర పోషించాడు. దీంతో అతడు సరదాగా ట్వీట్ చేశాడని తెలుస్తోంది. పంత్ వీడియోలో మాట్లాడుతూ.. తన ఆటమీద నమ్మకముందని, అందుకు తగ్గట్టే కొన్ని మ్యాచ్ల్లో రాణించకపోయినా మూడో టీ20లో మంచి బ్యాటింగ్ చేశానని చెప్పుకొచ్చాడు. తొలుత మంచి భాగస్వామ్యం నిర్మించాక ఆఖరి ఓవర్లలో చెలరేగాలని నిర్ణయించుకున్నట్లు పంత్ పేర్కొన్నాడు.
మరోవైపు టీ20 సిరీస్లో ఆడని చాహల్ వన్డే సిరీస్కు ఆడే అవకాశం ఉంది. ఇప్పటికే అతడు జట్టుతో కలిశాడు. నేటి నుంచి విండీస్ X భారత్ జట్ల మధ్య మూడు వన్డేల సిరీస్ ప్రారంభంకానుంది. ప్రపంచకప్ తర్వాత టీమిండియా వన్డే ఆడటం ఇదే తొలిసారి. టీ20 సిరీస్లాగే వన్డే సిరీస్ను గెలుపొందాలని కోహ్లీసేన పట్టుదలగా కనిపిస్తుంది. ధావన్, రోహిత్, కోహ్లీతో పాటు రాహుల్, రిషబ్పంత్తో బ్యాటింగ్ లైనప్ బలంగా ఉంది.
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్స్ట్రైకర్ ఎండ్లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more