భారత యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్ని నాలుగో స్థానంలో ఇకపై ఆడించకపోవడమే మంచిదని దిగ్గజ క్రికెటర్ లిటిల్ మాస్టార్ సునీల్ గవాస్కర్ అభిప్రాయపడ్డాడు. వెస్టిండీస్తో పోర్ట్ ఆఫ్ స్పెయిన్ వేదికగా ఆదివారం రాత్రి ముగిసిన మ్యాచ్లో నెం.4లో ఆడిన రిషబ్ పంత్ 35 బంతుల్లో 20 పరుగులు చేసి పేలవంగా బౌల్డయ్యాడు. కానీ.. నెం.5లో వచ్చిన శ్రేయాస్ అయ్యర్ 68 బంతుల్లో 5 ఫోర్లు, ఒక సిక్స్ సాయంతో 71 పరుగులతో సత్తాచాటాడు. దీంతో.. శ్రేయాస్ని ఇకపై నెం.4లో ఆడించాలని గవాస్కర్ సూచించాడు.
‘నా అంచనా ప్రకారం రిషబ్ పంత్ కూడా మహేంద్రసింగ్ ధోనీ తరహాలో ఐదు లేదా ఆరో స్థానంలోనే బ్యాటింగ్కి సరిపోతాడు. ఫినిషర్గా మ్యాచ్ల్ని ముగించడానికి అతని బ్యాటింగ్ స్టైల్ చక్కగా నప్పుతుంది. ఇంకా చెప్పాలంటే.. పంత్ సహజ సిద్ధమైన ఆటే పవర్ హిట్టింగ్. ఒకవేళ భారత్ జట్టుకి రోహిత్ శర్మ, శిఖర్ ధావన్, విరాట్ కోహ్లీ భారీ స్కోరుతో మెరుగైన ఆరంభమిచ్చి.. 40-45 ఓవర్ల మధ్య నెం.4 బ్యాట్స్మెన్ క్రీజులోకి వెళ్లాల్సి వస్తే..? అప్పుడు రిషబ్ పంత్ని పంపించాలి.
అలాకాకుండా.. 30-35 ఓవర్ల మధ్య నెం.4 బ్యాట్స్మెన్ని పంపాల్సి వస్తే మాత్రం.. శ్రేయాస్ అయ్యర్కి అవకాశమివ్వాలి’ అని గవాస్కర్ సూచించాడు. కార్లోస్ బ్రాత్వైట్ బౌలింగ్లో నేరుగా వచ్చిన బంతిని ఎదుర్కోవడంలో తడబడిన రిషబ్ పంత్.. బ్యాట్ని అడ్డంగా ఊపి క్లీన్ బౌల్డయ్యాడు. వెస్టిండీస్ పర్యటనలో అతను తక్కువ స్కోరు చేయడం కంటే.. అతను ఔటైన తీరే టీమిండియాలో కంగారు పెంచుతోంది.
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్స్ట్రైకర్ ఎండ్లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more