టీమిండియా క్రికెట్ జట్టును విజయపథంలో నడిపించి.. అగ్రభాగన నిలపడంలో క్రియాశీలక పాత్ర పోషించిన జార్ఖండ్ డైనమైట్, మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని.. తన జన్మస్థలమైన రాంఛీ నుంచి ముంబైకి మకాం మార్చాడు. మూడేళ్ల క్రితం టెస్టు కెప్టెన్సీ పగ్గాలకు వదులుకున్న ధోని, తాజాగా పరిమిత ఓవర్ల కెప్టెన్సీ పగ్గాలను కూడా వదులుకుంటున్నట్లు ప్రకటించి తన అభిమానులను షాక్ కు గురి చేసిన ధోని ఇకపై తన కుటుంబంతో కలసి ముంబైలో నివసించబోతున్నారు.
అందుకోసం ఇప్పటికే ముంబైలోని అంధేరి ప్రాంతంలోని ఒక పేరొందిన హౌజింగ్ సొసైటీలో నాలుగు ఫ్లాట్స్ను కొనుగోలు చేసిన అయన ఇంత అకస్మాత్తుగా ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకున్నారో తెలియడం లేదు. సొసైటీలో కొనుగోలు చేస్తున్న ఇళ్లలోకి ఆయన కుటుంబసభ్యులతో కలిసి మకాం మార్చబోతున్నట్టు తెలుస్తోంది. అయితే టీమిండియాకు తన అవసరం చివరి దశకు వచ్చిందని గ్రహించిన ధోని.. ఇక తాను వ్యాపారాలపై దృష్టి సారించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నారా..? అన్న ప్రశ్నలు కూడా రేకెత్తుతున్నాయి.
ప్రస్తుతం ఎంఎస్ ధోని జార్ఖాండ్లోని రాంచిలో హర్ము హౌజింగ్ కాలనీలో నివాసం ఉంటున్నారు. స్థానిక బ్రోకర్లు సైతం ఆ సొసైటీ 'ధోని వాలీ' బిల్డింగ్గా లేబ్లింగ్ చేయబోతున్నట్టు రిపోర్టులు పేర్కొన్నాయి. ప్రముఖ బాలీవుడ్ సెలబ్రిటీలు విపుల్ షా, చిత్రాన్గడ సింగ్, ప్రాచి దేశాయ్, ప్రభు దేవా వంటి పలువురు ఇళ్లకి దగ్గర్లో ధోని ఈ ఫ్లాట్లను కొన్నారు. వన్డే, టీ-20 క్రికెట్ జట్ల కెప్టెన్సీ నుంచి వైదొలుగుతున్నట్టు ప్రకటించిన ధోని ముంబైకి మకాం మార్చడానికి కారణాలు మాత్రం తెలియాల్సివుంది.
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్స్ట్రైకర్ ఎండ్లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more