వసతులు, ప్రోత్సాహం మాటెలాఉన్నా, చదరంగంలో మనవాళ్లు దూసుకుపోతున్నారు. కోనేరు హంపి, హారికల ఇప్పుడు నూతక్కి ప్రియాంక. తాజా అంతర్జాతీయ ఈవెంట్లో విజేతగా నిలిచి అందరి దృష్టిని ఆకర్షిస్తోన్న ఈ అమ్మాయి ఇటీవల స్లొవేనియాలో జరిగిన అండర్-10 వరల్డ్ చెస్ చాంపియన్ను గెలుచుకుంది. విజయానంతరం మంగళవారం రాత్రి నగరానికి చేరుకున్న ఆమెకు శంషాబాద్ విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది.
అనంతరం తన అభిప్రాయాలను ప్రియాంక వెల్లడించింది. ‘ముందు బొబ్బా వీరభద్రరావు గారికి కృతజ్ఞతలు చెప్పాలి. హంపితో పాటు కలిసి చదివిన మా అక్క ఆయన వద్ద చెస్ నేర్చుకోవడానికి ఆసక్తి ప్రదర్శించినా... తీరిక లేకపోవడం వల్ల కోచింగ్ ఇవ్వలేకపోయారు. కానీ ఇప్పుడు నేను ఆయన దగ్గర మూడేళ్లుగా శిక్షణ తీసుకుంటున్నాను. అక్క ఆడలేకపోయినా ఇప్పుడు నేను వరల్డ్ టైటిల్ గెలవడం సంతోషంగా ఉంది. అలాగే హైదరాబాద్లో ఉన్న విజయసారథి గారు కూడా నాకు అండగా నిలిచారు. భవిష్యత్తులోనూ వీరి సహకారంతో ముందుకు సాగుతాను. ముందుగా వయో పరిమితి ఉండే వివిధ కేటగిరీల టోర్నీల్లో ఎక్కువగా పాల్గొనేందుకు ప్రయత్నిస్తాను. దాంతోనే నా ఆట మెరుగుపడుతుంది. క్లాసిక్, బ్లిట్జ్, ర్యాపిడ్...మూడు విభాగాల్లోనూ రాణించాల్సి ఉంది’. అయితే ప్రాథమికంగా గ్రాండ్ మాస్టర్ను కావడమే నా లక్ష్యం అందు కోసం ఇప్పటినుంచి పట్టుదలగా కృషి చేస్తానంటోన్న ప్రియాంక తల్లిదండ్రులు : రాధాకృష్ణ, దుర్గాదేవి, నివాసం : విజయవాడ. చదువు : విశ్వభారతి పాఠశాలలో ఐదో తరగతి,
ఇటీవల కాలంలో రాష్ట్ర క్రీడాకారులు అంతర్జాతీయ యవనికపై వెలుగిపోవటం ఆనందించాల్సిన విషయం. సైనా, సానియా, గగన్, మిథాలీ తదితరులు అద్భుత విజయాలతో ఇప్పటికే స్టార్లుగా ఎదిగి దేశ ప్రతిష్టను పెంచారు.
...avnk
(And get your daily news straight to your inbox)
Nov 29 | సువిశాలమైన క్రికెట్ మైదానంలో బంతులతో ఆటఆడే క్రికెటర్లు రియల్ లైఫ్ లో అమ్మాయిలతో కూడా ప్రేమాటలాడుతుంటారు. ఇప్పటికే చాలా మంది క్రికెటర్లు ప్రేమలో పడి పెళ్లిళ్లు కూడా చేసుకున్న సంఘటనలు ఉన్నాయి. టీమ్ ఇండియా... Read more
Nov 28 | భారత క్రికెట్ దేవుడ్ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ సుదీర్ఘ అంతర్జాతీయ క్రికెట్ కి ఇటీవలే గుడ్ బై చెప్పి ఎంచక్కా ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్న విషయం తెలిసిందే. సచిన్ వీడ్కోలు సందర్భంగా ఒక్క... Read more
Nov 27 | భారత్ టూర్లో కనీసం ఒక్క టైటిల్ని అయినా గెల్చుకోవాలని చూస్తున్న విండీస్ ఆశల పై శిఖర్ ధావన్ వింధ్వంసకర బ్యాటింగ్ తో నీళ్ళు చల్లాడు. భారత్ కి అచ్చొచ్చిన విశాఖ స్టేడియంలోనే కుర్రాళ్ళను ఖంగుతినిపించిన... Read more
Nov 27 | భారత్-వెస్టిండీస్ మూడు వన్డేల సిరీస్ లో భాగంగా నేడు కాన్పూర్ లో జరుగుతున్న చివరి డే మ్యాచ్ లో టాస్ గెలిచిన భారత్ క్రికెట్ జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇప్పటికే ఈ సిరీస్ లో... Read more
Nov 25 | జాతీయ జట్టులో స్థానం కోల్పోయిన సీనియర్స్ దక్షిణాఫ్రికా జట్టు పర్యటన జట్టు సెలక్షన్స్ ఎప్పుడెప్పుడు జరుగుతాయా అని ఎదురు చూసిన వారిలో కొంత మందికి చాలా ఏళ్ళ కల నెలవేరితే , కొంత మందికి... Read more