లాహోర్ లో జరుగుతోన్న ఆసియా కబడ్డీ చాంపియన్షిప్ వివాదాస్పదంగా ముగిసింది. టైటిల్ను పాకిస్తాన్ జట్టు ఏక రీతిలో కైవసం చేసుకుంది. తమ కోచ్కు జరిమానా విధించడాన్ని నిరసిస్తూ భారత జట్టు ఫైనల్ మ్యాచ్ నుంచి అర్ధాంతరంగా వాకౌట్ చేయడంతో ఈ టైటిల్ పాకిస్తాన్ వశమైంది. పాకిస్తాన్లోని పంజాబ్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్లో అంపైర్ తీసుకున్న వివాదాస్పద నిర్ణయాలపై నిరసన వ్యక్తం చేసేందుకు భారత కోచ్ గూర్మెల్ సింగ్ రెండుసార్లు గ్రౌండ్లోకి ప్రవేశించాల్సి వచ్చింది. అయినప్పటికీ తీరు మార్చుకోని అంపైర్ మరోసారి వివాదాస్పద నిర్ణయం తీసుకున్నాడు. దీనిపై నిరసన తెలిపేందుకు గూర్మెల్ సింగ్ మరోసారి గ్రౌండ్లో ప్రవేశించగా, పదేపదే మ్యాచ్కు అంతరాయం కలిగిస్తున్నాడంటూ పాక్ ఆటగాళ్లు అభ్యంతరం తెలిపారు. దీంతో ఉభయ జట్ల ఆటగాళ్ల మధ్య కొద్దిసేపు తీవ్ర స్థాయిలో వాగ్యుద్ధం జరిగింది. ఆ తర్వాత పోరును కొనసాగించరాదని నిశ్చయించుకున్న భారత జట్టు మ్యాచ్ నుంచి వాకౌట్ చేసింది. అప్పటికి పాకిస్తాన్ జట్టు 40-31 పాయింట్ల తేడాతో ఆధిక్యతలో నిలువడంతో ఆ జట్టుకు టైటిల్ను అందజేశారు.
...avnk
(And get your daily news straight to your inbox)
Nov 29 | సువిశాలమైన క్రికెట్ మైదానంలో బంతులతో ఆటఆడే క్రికెటర్లు రియల్ లైఫ్ లో అమ్మాయిలతో కూడా ప్రేమాటలాడుతుంటారు. ఇప్పటికే చాలా మంది క్రికెటర్లు ప్రేమలో పడి పెళ్లిళ్లు కూడా చేసుకున్న సంఘటనలు ఉన్నాయి. టీమ్ ఇండియా... Read more
Nov 28 | భారత క్రికెట్ దేవుడ్ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ సుదీర్ఘ అంతర్జాతీయ క్రికెట్ కి ఇటీవలే గుడ్ బై చెప్పి ఎంచక్కా ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్న విషయం తెలిసిందే. సచిన్ వీడ్కోలు సందర్భంగా ఒక్క... Read more
Nov 27 | భారత్ టూర్లో కనీసం ఒక్క టైటిల్ని అయినా గెల్చుకోవాలని చూస్తున్న విండీస్ ఆశల పై శిఖర్ ధావన్ వింధ్వంసకర బ్యాటింగ్ తో నీళ్ళు చల్లాడు. భారత్ కి అచ్చొచ్చిన విశాఖ స్టేడియంలోనే కుర్రాళ్ళను ఖంగుతినిపించిన... Read more
Nov 27 | భారత్-వెస్టిండీస్ మూడు వన్డేల సిరీస్ లో భాగంగా నేడు కాన్పూర్ లో జరుగుతున్న చివరి డే మ్యాచ్ లో టాస్ గెలిచిన భారత్ క్రికెట్ జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇప్పటికే ఈ సిరీస్ లో... Read more
Nov 25 | జాతీయ జట్టులో స్థానం కోల్పోయిన సీనియర్స్ దక్షిణాఫ్రికా జట్టు పర్యటన జట్టు సెలక్షన్స్ ఎప్పుడెప్పుడు జరుగుతాయా అని ఎదురు చూసిన వారిలో కొంత మందికి చాలా ఏళ్ళ కల నెలవేరితే , కొంత మందికి... Read more