దాదాపు ఏడాది అనంతరం ఆల్రౌండర్ యువరాజ్, వెటరన్ ఆఫ్ స్పిన్నర్ హర్భజన్, తమిళనాడు ఓపెనింగ్ బ్యాట్స్ మెన్ విజరు టెస్టు జట్టులో చోటు దక్కించుకున్నారు. బిసిసిఐ సెలక్షన్ కమిటీ ఇంగ్లండ్తో ఈ నెల్లో ప్రారంభమయ్యే నాలుగు టెస్టుల సిరీస్కు గాను తొలి రెండు టెస్టులకు 15 మందితో కూడిన జట్టును ఎంపిక చేసింది. గత న్యూజిలాండ్ సిరీస్లో పాల్గొన్న లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ సురేష్ రైనాతోపాటు లెగ్ స్పిన్నర్ పీయుష్ చావ్లా, తమిళనాడు మిడిల్ ఆర్డర్ బ్యాట్స్ మెన్ బద్రీనాథ్కు సెలక్టర్లు ఉద్వాసన పలికారు. క్యాన్సర్తో పోరాడి గెలిచిన యోధుడు యువరాజ్కు స్థానం దక్కింది.
ఇటీవలి టి-20 వరల్డ్ కప్లో యువరాజ్ అంతంత మాత్రంగానే రాణించినా తరువాత దులీప్ ట్రోఫీ మ్యాచ్లో డబుల్ సెంచరీతో రాణించడంతోపాటుగా, తాజాగా భారత్ 'ఎ' బృందం సభ్యునిగా ఇంగ్లండ్పై అర్ధ సెంచరీతో పాటు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్తో ఐదు వికెట్లు సాధించి సెలక్టర్లను ఆకర్షించాడు.
ఇక విజరు విషయానికొస్తే, ఇరానీ ట్రోఫీలో డబుల్ సెంచరీతోపాటు ఛాలెంజర్ ట్రోఫీలో రాణించడంతో దాదాపు ఏడాది అనంతరం టెస్టు జట్టులో చోటు దక్కించుకున్నాడు.
కాగా, లెగ్ స్పిన్నర్ చావ్లా గాయానికి గురవడంతో మూడో స్పిన్నర్గా హర్భజన్కు అవకాశం దక్కింది. ఇటీవలి టి-20 వరల్డ్ కప్లో స్థానం పొందిన భజ్జీ అంతకుముందు ఇంగ్లీష్ కౌంటీల్లో రాణించినా, తాజాగా హైదరాబాద్తో జరిగిన రంజీ మ్యాచ్లో పంజాబ్ తరుఫున బరిలోకి దిగి 21 ఓవర్లు వేసినా ఒక్క వికెట్ కూడా దక్కలేదు. మొత్తానికి హర్భజన్కు ఇది చివరి అవకాశమని చెప్పవచ్చు.
రిజర్వ్ ఓపెనర్లగా విజరుతో పాటుగా రహానే కూడా చోటు సంపాదించాడు. గాయంతో ఇబ్బంది పడుతున్నా ఉత్తరప్రదేశ్తో జరుగుతున్న రంజీ మ్యాచ్లో సెంచరీ సాధించిన ఢిల్లీ కెప్టెన్ సెహ్వాగ్కు, అలాగే రైల్వేస్తో జరుగుతున్న రంజీ మ్యాచ్లో గాయంతో రెండు సార్లు ఫీల్డ్ నుండి వైదొలిగిన జహీర్కు జట్టులో స్థానం లభించింది. ఛటేశ్వర్ పూజారా బ్యాటింగ్ ఆర్డర్లో మూడో స్థానాన్ని దక్కించుకోగా, జహీర్తో పాటుగా ఉమేష్, ఇషాంత్ పేసర్లుగా చోటు సంపాదించుకున్నారు. అశ్విన్, ప్రజ్ఞాన్ ఓజా ప్రధాన స్పిన్నర్లు.
జట్టు సభ్యులు : ధోనీ (కెప్టెన్), సెహ్వాగ్, గంభీర్, సచిన్, ఛటేశ్వర్ పూజారా, విరాట్ కోహ్లీ, యువరాజ్ సింగ్, అజింక్య రహానే, మురళీ విజరు, అశ్విన్, ఉమేష్ యాదవ్, ప్రజ్ఞాన్ ఓజా, జహీర్ ఖాన్, హర్భజన్, ఇషాంత్ శర్మ.
...avnk
(And get your daily news straight to your inbox)
Nov 29 | సువిశాలమైన క్రికెట్ మైదానంలో బంతులతో ఆటఆడే క్రికెటర్లు రియల్ లైఫ్ లో అమ్మాయిలతో కూడా ప్రేమాటలాడుతుంటారు. ఇప్పటికే చాలా మంది క్రికెటర్లు ప్రేమలో పడి పెళ్లిళ్లు కూడా చేసుకున్న సంఘటనలు ఉన్నాయి. టీమ్ ఇండియా... Read more
Nov 28 | భారత క్రికెట్ దేవుడ్ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ సుదీర్ఘ అంతర్జాతీయ క్రికెట్ కి ఇటీవలే గుడ్ బై చెప్పి ఎంచక్కా ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్న విషయం తెలిసిందే. సచిన్ వీడ్కోలు సందర్భంగా ఒక్క... Read more
Nov 27 | భారత్ టూర్లో కనీసం ఒక్క టైటిల్ని అయినా గెల్చుకోవాలని చూస్తున్న విండీస్ ఆశల పై శిఖర్ ధావన్ వింధ్వంసకర బ్యాటింగ్ తో నీళ్ళు చల్లాడు. భారత్ కి అచ్చొచ్చిన విశాఖ స్టేడియంలోనే కుర్రాళ్ళను ఖంగుతినిపించిన... Read more
Nov 27 | భారత్-వెస్టిండీస్ మూడు వన్డేల సిరీస్ లో భాగంగా నేడు కాన్పూర్ లో జరుగుతున్న చివరి డే మ్యాచ్ లో టాస్ గెలిచిన భారత్ క్రికెట్ జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇప్పటికే ఈ సిరీస్ లో... Read more
Nov 25 | జాతీయ జట్టులో స్థానం కోల్పోయిన సీనియర్స్ దక్షిణాఫ్రికా జట్టు పర్యటన జట్టు సెలక్షన్స్ ఎప్పుడెప్పుడు జరుగుతాయా అని ఎదురు చూసిన వారిలో కొంత మందికి చాలా ఏళ్ళ కల నెలవేరితే , కొంత మందికి... Read more