సాధారణంగా ప్రతిఒక్కరు తమతమ ఇళ్లలో ఏదో ఒక జంతువును పెంచుకుంటుంటారు. మరికొంతమంది తమ పిల్లల ఆనందం కోసం చిన్నచిన్న పిల్లులను, కుక్కలను, ఇతర జాతులకు చెందిన జంతువులను తెచ్చి బహుమానంగా ఇస్తుంటారు. గతంలో డబ్బులున్నవారే పెంపుడు జంతువులను పెట్టుకునేవారు. కానీ ప్రస్తుతకాలంలో చిన్నాపెద్ద, పేదధనిక వంటి తేడాలు లేకుండా అందరూ ఏదో ఒక జంతువును పెంచుకోవడం ఆచారంగా మారిపోయింది.
అయితే వాస్తుశాస్త్రం ప్రకారం... ఇటువంటి పెంపుడు జంతువులను పెంచుకోవడం సరైనదా, కాదా అనే కోణంలో పరిశీలిస్తే.. ఇది ఎంతో ఉత్తమమేనని పురోహితులు, జ్యోతిష్య నిపుణులు పేర్కొంటున్నారు. సహజంగా ఇంట్లో ఏవైనా ఆపదలు వచ్చినప్పుడు కూడా ముందుగా పెంపుడు జంతువులే వాటికి సంబంధించిన సమాచారాలను తమ యజమానులకు అందిస్తాయి. అలాగే గృహానికి ఎటువంటి దోషాలు, లోపాలు ఏమైనా వుంటే.. ముందుగా అవి ఇంట్లో వున్న పెంపుడు జంతువుల మీదే తమ ప్రభావాన్ని చూపుతాయి.
అంటే.. ఇంట్లో మనకు వాస్తుదోషాల నుంచి ఏవైనా ప్రమాదాలు జరిగే ముందు అవి పెంపుడు జంతువుల మీద దుష్ర్పభావాన్ని చూపుతాయి. ఆ తరువాత గృహంలో వున్నవారికి మెల్లమెల్లగా సోకడం జరుగుతుంది. దీనిని బట్టి మనం జరిగే నష్టాలను, లోపాలను పెంపుడు జంతువుల ద్వారా ముందుగానే పసిగట్టి, వాటి నివారణకు చర్యలు తీసుకోవచ్చు.
ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటంటే.. పెంపుడు జంతువులకు కూడా ఒక నిర్దిష్టమైన స్థలాన్ని కేటాయించుకోవాలి. వాటి కోసం ఏదైనా ఒక షెడ్డు నిర్మించుకోవాలంటే.. దానిని వాస్తుశాస్త్ర ప్రకారం దక్షిణ మధ్యస్థ భాగంలోకానీ, పడమర మధ్యస్థ భాగంలోకానీ, నైరుతి లేదా వాయువ్యంవైపుగా వున్న దిశలలో నిర్మించుకోవడం చాలా మంచిదని నిపుణులు తెలుపుతున్నారు.
గృహ వాస్తు దోషాల నుంచి విముక్తి కలగాలంటే... అద్దె ఇంట్లో వున్నవారుగానీ, సొంతంగా ఇంటిని నిర్మించుకోలేనివారుగానీ వాస్తుశాస్త్రాలను అనుసరించి నిర్మించిన దేవాలయాలను ప్రతిరోజూ సందర్శించి కొంత సమయం అక్కడే వేచి వుండాలి. ఆ తరువాత తమ పనులను ప్రారంభిస్తే అన్ని విధాలుగా మంచి ఫలితాలు కలుగుతాయని వాస్తుశాస్త్ర నిపుణులు బల్లగుద్దిమరీ చెబుతున్నారు.
(And get your daily news straight to your inbox)
Nov 17 | ఇద్దరు వ్యక్తులు కలుసుకున్నప్పుడు ఒకరినొకరు నమస్కరించుకోవడం భారతీయ సంస్కారం. ఇలా పలకరించుకునే పద్ధతి ఒక్కొక్క జాతిలో ఒక్కో విధంగా వుంటుంది. అవి.. వారివారి సంస్కృతీసంప్రదాయాలు, నాగరికతపై ఆధారపడి వుంటుంది. అయితే.. ఈ పలకరింపులన్నింటిలో భారతీయులది... Read more
Nov 10 | ఏ దేవునికైనా సరే.. పూజ చేసే సమయంలో పుష్పాలు వినియోగించడం ప్రాచీనకాలం నుంచి ఆచారంగా మారిపోయింది. అయితే.. ఈ పుష్పాలు కచ్చితంగా ఎందుకు వినియోగించాలి..? వాటివల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి..? అనే విషయాలు చాలామందికి... Read more
Nov 05 | గుడికి వెళ్లిన భక్తులు చాలామంది గుడివెనకున్న భాగాన్ని సైతం మొక్కుతుంటారు. ఇలా ఒక్క దేవాలయంలోనే కాదు.. ప్రతిఒక్క ఆలయంలోనూ భక్తులందరూ ఆచరిస్తారు. అయితే.. ఇలా చేయడం వెనుకగల కారణాలు చాలామందికి తెలిసి వుండదు. ఏదో... Read more
Oct 16 | పూర్వకాలంలో ఋషులు ఎక్కువకాలం ధ్యానంలోనే గడిపేవారు. అంటే తపస్సు చేస్తుండేవారు. ప్రపంచంతో ఎటువంటి సంబంధం లేకుండా ప్రశాంత వాతావరణంలో కూర్చొని, దేవుడి నామాన్ని స్మరిస్తూ నిరంతర ధ్యానంలోనే వుండేవారు. ఇంతకీ ఈ తపస్సు వల్ల... Read more
Oct 09 | సాధారణంగా అన్ని దేవాలయాలలో ప్రవేశద్వారానికి దగ్గర పైకప్పు నుంచీ ఒకటి లేదా ఎక్కువ గంటలు వ్రేలాడ దీయబడి ఉంటాయి. భక్తుడు ఆలయంలోకి వెళ్ళగానే గంట మ్రోగించి ఆ తరువాతనే భగవంతుని దర్శనానికి, ప్రార్ధనలకి ఉపక్రమిస్తాడు.... Read more