స్థలపురాణం :
పూర్వం త్రేతాయుగంలో భరద్వాజ మహర్షి శ్రీ మహావిష్ణువు కోసం ఘోర తపస్సు చేయాలని నిర్ణయించుకుని.. దక్షిణ హిందూ దేశానికి వెళతాడు. ఆ సందర్భంలో కృష్ణానదికి దగ్గరలో వున్న ఒక కొండ ప్రాంతానికి చేరుకున్న తరువాత అక్కడే వున్న ఒక కొండ మీద ఆశ్రమాన్ని నిర్మించుకుని విష్ణుదేవుని కోసం కొన్ని వందల సంవత్సరాలవరకు ఘోర తపస్సును ఆచరించాడు. శ్రీ మహావిష్ణువు, భరద్వాజ మహర్షి ఘోర తపస్సును మెచ్చుకుని, అతని ముందు ప్రత్యక్షమవుతాడు.
అప్పుడు విష్ణువు.. ‘‘నీ తపస్సుకు నేను సంపన్నుడయ్యాను. నీకు ఏం కావాలో కోరుకో’’ అని అంటాడు. దానికి సమాధానంగా భరద్వాజ మహర్షి... ‘‘ఓ విష్ణుదేవా! ఈ ప్రాంతంలో నివసిస్తున్న ప్రజలు ఎన్నో అష్టకష్టాలు ఎదుర్కుంటున్నారు. అన్నివేళలా రకరకాల సమస్యలతో బాధపడుతున్నారు. అటువంటి ప్రజలకు తమ బాధలను చెప్పుకోవడానికి, కొద్దిసేపటి వరకు సేద తీర్చుకోవడానికి నీ అంశతో ఇక్కడో ఆలయాన్ని నిర్మించు. అప్పుడే వారు తమ బాధలను నీతో వ్యక్తపరుచుకుని సంతోషిస్తారు’’.
‘‘ప్రజల జీవన విధానాలను మార్చడానికి, వారిని ఎల్లప్పుడూ సంరక్షించడానికి పవిత్రమైన ఈ పర్వతంమీద నువ్వే స్వయంగా కొలువై వుండు. దూర ప్రాంతాలవరకు కూడా ప్రజలకు తాగడానికి కనీసం నీళ్లు కూడా లేవు. కాబట్టి వారి దాహాన్ని తీర్చడానికి ఈ కొండ ప్రాంతానికి దగ్గరలోనే నిర్మలమైన జల తరంగణిని కూడా నిర్మించు. ప్రజలకు తోడుగా వుండి, వారిని నిత్యం కాపాడు’’ అని కోరుకుంటాడు. విష్ణువు ఆ మహర్షి కోరికను మెచ్చుకుని... ‘‘నువ్వు కోరినట్లే జరుగుతుంది. తథాస్తు’’ అని చెప్పి.. అక్కడి నుంచి అదృశ్యమయ్యాడు.
తరువాతిరోజు భరద్వాజ మహర్షి తెల్లవారుజామునే లేచి చూడగా.. తిరుమలగిరి కొండపై అఖండ శిలారూపంలో వెంకటేశ్వరు స్వామి స్వయంభువుగా అవతరించాడు. అలాగే ఆయన వెనుక భాగంలో పెద్దశిలా వల్మీకం కూడా వెలిసింది. అదేవిధంగా వెంకటేశ్వరునికి తూర్పుభాగంలో ఎడమకాలి పాద ఘట్టనతో కోనేరు ఏర్పడింది. పెద్ద రాతిపుట్ట, వెంకటేశ్వరుడు కలిసి వుండటం ఒక పెద్ద విశేషపూర్వకంగా చెప్పుకోవచ్చు. ఇలా ఈ విధంగా శ్రీ మహావిష్ణువు, వెంకటేశ్వర స్వామిరూపంలో స్వయంభువుగా అవతరించి, ఇక్కడే వున్న ప్రాంతప్రజలను సంరక్షిస్తున్నాడు.
ఆలయ విశేసాలు :
జగ్గయ్యపేటలోని నేషనల్ హైవేమీద చిల్లకుంట సెంటర్ నుంచి 2 కిలోమీటర్ల దూరంలో తిరుమలగిరి అనే ఒక చిన్న ఊరు వుంది. ఈ కొండప్రాంతంలోనే శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయం ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకుంది. శ్రీదేవి, భూదేవి సమేతంగా శ్రీవెంకటేశ్వరస్వామి ఈ తిరుమలగిరి కొండలో కొలువైవున్నాడు. ఈ ఆలయాన్ని సందర్శించుకోవడానికి దూరప్రాంతాల నుంచి కూడా భక్తులు విచ్చేస్తుంటారు. గ్రామానికి ఉత్తరంవైపుగా వుండే ఈ తిరుమలగిరి కొండను ఎంతో పవిత్రంగా భావిస్తారు.
అటువంటి కొండపై వున్న ఈ స్వామివారి ఆలయాన్ని దర్శించుకుంటే.. అనుకున్న పనులన్నీ పూర్తవుతాయని ఈ ప్రాంతంలో వున్న ప్రజలు, స్థానికులు, దేవాలయ పూజారులు, పండితులు ఎంతగానో విశ్వసిస్తుంటారు. ఈ గ్రామం కూడా చాలావరకు తిరుమల తిరుపతిని పోలి వుంటుంది. తిరుపతికి జంటగా అలివేలు మంగాపురం అనే ప్రాంతం ఎలా వుందో... ఈ తిరుమలగిరికి కూడా జంటగా మంగొల్లు అనే ప్రాంతం వుంది. ఈ మంగొల్లు ప్రాంతంలో పూర్వం అలివేలు మంగమ్మ నివసించేదని అక్కడి ప్రజల విశ్వాసం. అందుకే ఆ ఊరికి ఆ పేరు వచ్చిందని వారు చెబుతుంటారు.
(And get your daily news straight to your inbox)
Apr 18 | మహాభారతంలోని కథ : మాంధాత కుమారుడైన శిబి చక్రవర్తికి మేఘదాంబరుడు, జీమూత వాహనుడు అనే ఇద్దరు తమ్ముళ్లు వుండేవారు. వారిద్దరిలో మేఘదాంబరుడు.. తన అన్న అనుమతితో 1500 మందిని వెంటబెట్టుకుని కాష్మీరదేశం విడిచి తీర్థయాత్రలకు... Read more
Apr 08 | ఆలయ విశేషాలు : ఛాయ సోమేశ్వర ఆలయం నల్లగొండ పట్టణానికి నాలుగు కీలోమీటర్ల దూరంలో వున్న పానగల్లు అనే గ్రామంలో వుంది. క్రీ.శ. 12వ శతాబ్దంలో కుందూరు చోళులు దీనిని నిర్మించినట్టు ప్రస్తుతమున్న మ్యూజియం... Read more
Apr 03 | స్థలపురాణం : పూర్వం పరశురాముడు తన తండ్రి ఆజ్ఞమేరకు తల్లినే సంహరిస్తాడు. అయితే తీవ్ర బాధతో కుంగిపోతున్న పరశురాముడు.. తిరిగి తన తండ్రి ఇచ్చిన వరంతో తల్లిని బ్రతికించుకుంటాడు. కానీ.. తల్లిని చంపినందుకు తీవ్ర... Read more
Mar 28 | స్థలపురాణం : పూర్వం వజ్రనాభ అనే రాక్షసుడు నిత్యం ప్రజలను హింసిస్తూ.. వారికి అనేక కష్టాలను పెట్టేవాడు. ఇది చూసి తట్టుకోలేక బ్రహ్మ.. తన చేతిలో వున్న తామరపువ్వును ఆయుధంగా మార్చి ఆ రాక్షసుడని... Read more
Mar 20 | యమధర్మరాజు ఆస్థానంలో కూర్చొని మానవులు చేసే పాప, పుణ్య కర్మలను లెక్కించి, చిట్టాలు రాసే చిత్రగుప్తుడికి భూలోకంలో అక్కడక్కడా కొన్ని దేవాలయాలు వున్నాయి. తెల్లవారుజాము లేచిన క్షణం నుంచి మనం నిత్యం నిర్వహించుకునే కార్యక్రమాలతో... Read more